స్థానికంగానే ఐటీ ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

స్థానికంగానే ఐటీ ఉద్యోగావకాశాలు

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

● డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌

ఆదిలాబాద్‌: జిల్లా యువతకు స్థానికంగానే ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ అన్నారు. ఎన్‌హెచ్‌ 44ను ఆనుకుని నిర్మాణం పూర్తయిన ఐటీ టవర్‌ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులతో కలిసి టవర్‌ను శనివారం సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు త్వరలో ఐటీ టవర్‌ను ప్రారంభించడంతో పాటు కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించేలా ఆహ్వానిస్తున్నట్లు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించే అవకాశాలున్నాయని వెల్లడించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఇన్‌చార్జి మంత్రి జూపలి కృష్ణారావు తదితరులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఐటీ కంపెనీలు ఆదిలాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇది జిల్లా అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బట్టిసావర్గాం సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దుర్గం శేఖర్‌, బాలూరి గోవర్ధన్‌రెడ్డి, గండ్రత్‌ సుజాత, సాజిద్‌ ఖాన్‌, గోక గణేశ్‌రెడ్డి, అంబకంటి అశోక్‌, బెజ్జంకి అనిల్‌, ప్రేమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement