ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల అభ్యసన ఫలితా లు మెరుగుపర్చేందుకు బోధనలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించాలని డీఐ ఈవో జాదవ్ గణేశ్కుమార్ అన్నారు. జిల్లాలో ని నాలుగు క్లస్టర్ల పరిధిలోని లెక్చరర్లకు సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలురజూనియ ర్ కళాశాలలో నిర్వహించిన సమావేశానికి హా జరయ్యారు. విద్యార్థుల ప్రగతి,హాజరుశాతం, అడ్మిషన్ల పెంపు, బోధన ప్రమాణాల మెరుగుదలపై పలు సూచనలు చేశారు. విద్యార్థుల అ భ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు స మర్థవంతమైన బోధన పద్ధతులు అవలంభించాలని, తరగతి గదిలో సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కళాశాలల లెక్చరర్లు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో డీఐఈవో పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, డీఏఎంవో సభ్యులు సునిల్, సత్యనారా యణ, ఉపేందర్రెడ్డి, లక్ష్మణ్, వనజ తదితరులు పాల్గొన్నారు.


