బజార్హత్నూర్: వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు త్వరగా పూర్తి చే యా లని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ సూచించా రు. గురువారం మండలంలోని గిర్నూర్, పిప్రి గ్రా మాల్లో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, సెగ్రిగేషన్ షెడ్లు, డంప్యార్డులు పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తని ఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు తొలగించాలని సూచించారు. ఎంపీడీవో మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


