పెర్కిట్(ఆర్మూర్): ఇద్దరు కవల సోదరులు మరో ఇద్దరు కవల సోదరీమణులను పెళ్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన బాలాజీ ఇండస్ట్రీస్ యజమాని రామిడి శోభ, వెంకట్రెడ్డి దంపతులకు తరుణ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి కవల కుమారులు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం టెంబుర్ని గ్రామానికి చెందిన నిమ్మల సునీత, మహేందర్రెడ్డి దంపతులకు స్పందన, స్ఫూర్తి కవల కూతుళ్లు. ఈ రెండు జంటల వివాహ వేడుక గురువారం నిర్మల్ జిల్లా సోఫీనగర్లోని ఎంకే కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.


