నీటి వృథాను అరికట్టాలంటే ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. వానాకాలంలో వరదనీరు వృథా పోకుండా పారే నీటికి నడకనేర్పి, నడిచే నీటిని నిలకడగా ఉంచి, నిలకడగా ఉన్న నీటిని భూమిలోకి ఇంకించేలా చూడాలి. ఇలా నీటి సంరక్షణ చర్యలు చేపడితే భూమిలోకి నీరు ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. దీంతో నీటి కష్టాలనూ అధిగమించవచ్చు. రైతులు తమ పంట పొలాల్లో బోర్ల చుట్టూ బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్, ఫాంపౌండ్స్ను నిర్మించుకుని వర్షపునీటిని సంరక్షించుకోవాలి.
– సతీశ్యాదవ్, జిల్లా భూగర్భ జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్


