ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశముంది. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ ఎల్నినీనో ప్రభావంతో ఇప్పటికి రుతుపవనాల జాడలేదు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. సెప్టెంబర్ తర్వాత ఎల్నినో ముప్పు తగ్గే అవకాశముంటుంది. కానీ, అప్పటికే పంటల సాగు కాలం ముగిసి వర్షాల అవసరం అంతగా ఉండదు. రైతులు, ప్రజలు సాగునీటి విషయంలో వర్షాలపై ఆధారపడకుండా తక్కువనీటితో సాగయ్యే పంటలు వేయడం ఉత్తమం.
– డాక్టర్ శ్రీధర్చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త


