భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోవడంతో ఆదిలాబాద్రూరల్ మండలంలోని గుట్టలపై నివాసముండే గ్రామాల ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై చాలా వరకు ఎండగా ఉంటుంది. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
బోథ్ మండల కేంద్రానికి చెందిన ఈ రైతు పేరు రాసం ప్రవీణ్ కుమార్. 2022లో తనకున్న ఆరెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశాడు. మూడేళ్ల తర్వాత గెలలు చేతికి రావడం ప్రారంభించాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 16 టన్నులు విక్రయించగా రూ.3,10,000 ఆదాయం వచ్చింది. ఏటా 15 సార్లు గెలలు అమ్మకానికి వస్తాయని, ఆయిల్ పామ్ సాగుకు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదని, ఒకసారి పంటను కాపాడుకుంటే ఏటా ఆదాయం పొందవచ్చని రైతు పేర్కొంటున్నాడు.


