జాతరను విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

జాతరను విజయవంతం చేద్దాం

Jan 18 2026 7:11 AM | Updated on Jan 18 2026 7:11 AM

జాతరను విజయవంతం చేద్దాం

జాతరను విజయవంతం చేద్దాం

ఇంద్రవెల్లి: ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించే నాగోబా జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉట్నూర్‌ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్‌ అన్నారు. నాగోబా ఆలయంతో పాటు జాతర నిర్వహణ స్థలాన్ని శనివారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం దుకాణా లు ఏర్పాటు చేసుకోవాలని పలువురికి సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అడుగడుగునా సీసీ నిఘా ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ సీఐ ప్రసాద్‌, ఎస్సై సాయన్న తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement