
● మారనున్న జెడ్పీ స్వరూపం ● ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం
కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం తొలుత పరిషత్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా రాష్ట్రమంత్రులు ప్రకటించడంతోఆశావహుల్లో జోష్ మొదలైంది. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతా వరణం నెలకొంది. అయితే ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలను పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహిస్తుందా లేక కొత్తగా ప్రకటిస్తుందా అనేదానిపై ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణతో జెడ్పీ స్వరూపం మారనుంది. మండలాల పునర్విభజనతో కొత్తగా పలు ఎంపీటీసీ స్థానాలు ఏర్పడగా, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అదనంగా పెరిగాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల రిజర్వేషన్లు అనివార్యం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమతుంది. దీంతో ఏ మండలానికి ఏ రిజర్వేషన్ వస్తుందోననే ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతుంది.
పెరిగిన స్థానాలు ...
జిల్లాలో గ్రామీణ మండలాలు గతంలో 17 ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు కొత్తగా ఏర్పాటు చేసింది. బోథ్మండలాన్ని పునర్విభజన చేసి సొనా ల మండలంను, జైనథ్ను విభజించి సాత్నాల, భో రజ్ మండలాలను ఏర్పాటు చేశారు. బేల, ఆదిలా బాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను ఆ యా మండలాల పరిధిలోకిచేర్చారు. దీంతో ఆయా మండలాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఎన్నికయ్యే అవకాశముంది. కాగా ఆయా మండల్లాలోని గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను సైతం పునర్విభజన చేశారు. జిల్లాలో గతంలో 158 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పునర్విభజనతో 11 మండల ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ను అదనంగా పెంచారు. దీంతో ఈ సంఖ్య ప్రస్తు తం 169కి చేరింది. మావల మండలంలో రెండు, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో నాలుగు స్థానాలను పెంచగా పునర్విభజన జరిగిన మండలాల్లో సొనాల, భోరజ్, సాత్నాల మండలాల్లో మరో ఐదు స్థానాలు పెంచారు. తద్వారా మండల సర్వసభ్య సమావేఽశాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
గ్రామాల్లో ఎలక్షన్ ఫీవర్
స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ నెలాఖరులోగా ఎప్పుడైనా షెడ్యూల్ రావచ్చంటూ మంత్రులు సీతక్క, పొంగులేని చేసిన ప్రకటనలు ఆశావహుల్లో జోష్ నింపింది. పోటీకి సై అంటున్న వారు గ్రామాల్లోని ఓటర్ల ను మచ్చిక చేసుకునేపనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి శుభకార్యాలైనా అక్కడ వాలిపోతున్నారు. ఇక గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ముగిసే వరకు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోసారి వారింటికెళ్లి పరామర్శిస్తున్నారు. మరికొంత మంది ఆశావహులు గ్రామ సమస్యలపై స్థానికులతో వెళ్లి కలెక్టర్, అధికారులను కలుస్తున్నారు. పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో పల్లెల్లో ప్రస్తుతం ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది.
జెడ్పీ స్వరూపం ఇలా..
జిల్లాలో..
మండలాలు : 20
ఎంపీటీసీ స్థానాలు : 169 (కొత్తవి 11 )
జెడ్పీటీసీ స్థానాలు : 20 (కొత్తవి 3 )
గతంలో 17 మండలాలుండగా 17 మంది చొప్పు న జెడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులుగా ఉండేవా రు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. త్వరలో నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో ఈ సంఖ్య 20కి చేరనుంది. కొత్తగా మరో ముగ్గురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు జిల్లా పరిషత్లోకి అడుగుపె ట్టనున్నారు. మండలాల సంఖ్య పెరగడం, గ్రా మ పంచాయతీలు, అక్కడి జనాభాకనుగుణంగా ఎంపీటీసీల పునర్విభజన జరగడంతో ఆయా సా ్థనాల రిజర్వేషన్లు మారనున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎ న్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అదే జరిగితే బీసీలకు కలిసోచ్చే అవకాశం ఏర్పడి సభలో వారి సంఖ్య పెరిగే అవకాశముంటుంది. అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోవచ్చని పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశముందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్ర భుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

● మారనున్న జెడ్పీ స్వరూపం ● ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం