వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

Jun 17 2025 5:09 AM | Updated on Jun 17 2025 5:09 AM

వ్యవసాయ అధికారుల   సూచనలు పాటించాలి

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

తలమడుగు: రైతులు సాగులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సుంకిడి గ్రామ రైతు వేదికలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. నేల ఏ పంటకు అనుకూలమో వాటినే సాగు చేయాలన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు పడుతున్నాయని, ఈ విషయంలో ముందస్తు జాగ్రతలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement