
సమస్యల పరిష్కారానికి చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని వెంటనే సంబంధిత పోలీ సు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 54 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికా రిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.