
రైతుకు భరోసా..
● బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ● ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా లబ్ధి ● అన్నదాతల్లో ఆనందం
రైతుల వివరాలు..
మండలం గ్రామాలు పట్టా రైతులు
ఆదిలాబాద్రూరల్ 44 11,467ఆదిలాబాద్అర్బన్ 03 502
బజార్హత్నూర్ 41 10,692
బేల 53 11,530
భీంపూర్ 23 8,741
భోరజ్ 28 6,992
బోథ్ 42 11,294గాదిగూడ 61 7,737
గుడిహత్నూర్ 29 7,865
ఇచ్చోడ 44 10,985
ఇంద్రవెల్లి 47 9,359
జైనథ్ 26 9,853
మావల 06 1,019
నార్నూర్ 40 7,060
నేరడిగొండ 58 11,377
సాత్నాల 12 3,206
సిరికొండ 26 5,943
సొనాల 10 3,707
తలమడుగు 33 11,503
తాంసి 12 6,023
ఉట్నూర్ 58 11,383
మొత్తం 696 1,68,238
ఆదిలాబాద్టౌన్: వానాకాలం పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసింది. అయితే ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తోంది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది. మొదటి విడతగా రెండెకరాల్లోపు రైతులకు అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతులకు వారంలోగా జమ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,68,238 మంది రైతులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.342 కోట్ల 30లక్షల 71వేల 305 విడుదల చేసింది. ఆయా మండలాల ఏఈవోలు 1,61,775 అకౌంట్లను అప్గ్రేడ్ చేశారు. కాగా 1,61,552 అకౌంట్లను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. 1,10,647 మంది రైతులకు సంబంధించిన అకౌంట్లను ట్రెజరీ అధికారులకు పంపించారు. ఇందుకు గాను రూ.148కోట్ల 41లక్షల 307 రైతుల అకౌంట్లో జమకానున్నాయి. తొలివిడతగా సోమవారం సాయంత్రం రెండెకరాల లోపు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం మూడోసారి విడుదల చేసింది. గత యాసంగిలో జిల్లాలో 96,682 మంది రైతులకు రూ.124.50 కోట్ల నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే గతంలో పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా జమ కాలేదు. నాలుగు ఎకరాల్లోపు మాత్రమే నిధులు జమైనట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయంలో నిధులు ఖాతాల్లోకి చేరడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుండటంపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కాగా, కొత్త రైతులకు సంబంధించి ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో రైతులు : 1,68,238
రైతు భరోసా నిధులు :రూ.342.30 కోట్లు