
ఉన్నత చదువా.. పట్నమే దారి!
● ఇప్పటికే చేజారిన గిరిజన వర్సిటీ ● ఉత్తర్వులకే పరిమితమైన ‘ఇంజినీరింగ్’ ● జిల్లాలో కానరాని పీజీ, ఫార్మా కళాశాలలు ● ఇబ్బందుల్లో విద్యార్థులు.. పట్టించుకోని పాలకులు
ఆదిలాబాద్టౌన్: ప్రతీ విద్యార్థి జీవితంలో రాణించాలంటే ఉన్నత చదువు ఎంతో అవసరం. ప్ర స్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంసై తం అందిపుచ్చుకోవాలి. అయితే అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లాలో అందుకు అవసరమైన అవకాశాలు కానరాని పరిస్థితి. వనరులు న్నాసంబంధిత విద్యాసంస్థలు నెలకొల్పడం లేదు. పీజీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ,ఎంసీఏ వంటి కోర్సుల్లో విద్యను అభ్యసించాలంటే హైదరాబా ద్, వరంగల్ తదితర నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో చాలామంది పేద విద్యార్థులు డిగ్రీకే పరిమితమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం జిల్లాకు గిరిజన యూనివర్సిటీని మంజూ రు చేసింది. అయితే జిల్లా పాలకుల పట్టింపులేమి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెరసీ ఆ వర్సిటీ ఉమ్మడి వరంగల్కు తరలిపోయింది. ఇలా ఈప్రాంతానికి విద్యాపరంగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. గళమెత్తాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
ఉన్నత చదువులకు దూరం..
రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉండగా ఆదిలాబాద్లో మాత్రం కానరాని పరి స్థితి. జిల్లాలో కేవలం రిమ్స్, అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. గతంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఉండగా అది హైదరాబాద్ కు తరలిపోయింది.జిల్లాకేంద్రంలో ప్రభుత్వడీఎడ్ కళాశాల ఉన్నా అందులో కేవలం ఇద్దరు రెగ్యులర్ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. వారికి కూడా ఇతర జిల్లాల్లో డీఈవోలుగా అదనపు బాధ్యతలు ఉండ డం గమనార్హం. బీఎడ్ విషయానికి వస్తే రెండు ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసినవారికి ఇంజినీరింగ్ చదవాలంటే ఇతర జిల్లాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో మంచి ర్యాంకులు వచ్చిన వారు సైతం ఆర్థిక పరిస్థితులు సరి గా లేని కారణంగా చదువుకోలేకపోతున్నారు.
ఇంజినీరింగ్ కళాశాల ఊసేది..
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరుచేస్తూ ఉత్తర్వులు జా రీచేశారు. ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ ఇక్కడే తరగతులు నిర్వహిస్తారని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రస్తుతం ఆ అంశం అటకెక్కింది. పీజీ కూడా లేదాయే..
డిగ్రీ పూర్తయిన తర్వాత జిల్లా విద్యార్థులు పోస్టు గ్రాడ్యూయేట్ చేయలేని దుస్థితి. ఏటా వేలాది మంది డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత పీజీ ఎంట్రెన్స్ రాస్తున్నారు. అయితే జిల్లాలో పీజీ కళాశాల లేకపోవడంతో హైదరాబాద్, వరంగల్కు వెళ్లి ఉన్నత చదువులు చదవాల్సిన పరిస్థితి. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బాటనీ, జువాలజి, ఆర్ట్స్ డిగ్రీ కళాశాలో ఎకనామిక్స్ పీజీ కోర్సులు మాత్రమే ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా కేవలం ఆర్ట్స్కు సంబంధించిన పీజీ కోర్సులు ఉండడంతో చాలా మంది సైన్స్ విద్యార్థులు డిగ్రీకే పరిమితం అవుతున్నారు.
యూనివర్సిటీ మంజూరు చేయాలి
జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేస్తేనే విద్యాపరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు డిగ్రీ తర్వాత ఉన్నత చదువులు కొనసాగించలేకపోతున్నారు. అలాగే బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఇన్సూరెన్స్ తదితర కొలువుల కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి.
– సంతోష్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సైన్స్ కళాశాల
గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలి
జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. గతంలో జిల్లాకు కేటాయించినా వరంగల్కు తరలిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. గత ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో గిరిజన యువత ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
– గణేశ్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉన్నత చదువా.. పట్నమే దారి!

ఉన్నత చదువా.. పట్నమే దారి!