నేడు యూత్‌ మారథాన్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నేడు యూత్‌ మారథాన్‌ ర్యాలీ

Aug 8 2024 11:48 PM | Updated on Aug 8 2024 11:48 PM

అమలాపురం రూరల్‌: అమలాపురంలో యూత్‌ మారథాన్‌ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ నియంత్రణ అధికారి సీహెచ్‌వీ భరతలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఈ ర్యాలీని భట్నవిల్లి వద్ద జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రారంభిస్తారన్నారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై యువతకు అవగాహన పెంచడానికి జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ కార్యాచరణ చేసిందన్నారు. ఇందులో భాగంగా మారథాన్‌ రెడ్‌ రన్‌–5 కిలోమీటర్లు జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటలకు భట్నవల్లి బైపాస్‌ వద్ద నుంచి పేరూరు వై.జంక్షన్‌ వరకూ ఈ రన్‌ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు క్విజ్‌ పోటీలను అమలాపురంలోని ఏరియా హాస్పిటల్‌ జిల్లా సత్వర వైద్య సేవల కేంద్రం మీటింగ్‌ హాల్లో జరుపుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement