breaking news
yudham
-
యుద్ధం సిద్ధం!
తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ ఉపశీర్షిక. భారతీ గణేశ్ దర్శకుడు. నట్టి కుమార్, నట్టి లక్షీ్ష్మ నిర్మాతలు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. సి.కల్యాణ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని జిట్టా సురేంద్రరెడ్డికి అందించారు. పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నామని నట్టికుమార్ చెప్పారు. తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని తరుణ్ నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుందని, ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. -
గెలుపు కోసమే ఈ యుద్ధం
‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. గెలుపు కోసమే ఇన్ని రోజులు యుద్ధం చేశాం. విజయం సిద్ధిస్తుందని మా నమ్మకం’’ అని తరుణ్ అన్నారు. ఆయన కథానాయకునిగా, స్వర్గీయ శ్రీహరి ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘యుద్ధం’. భారతీగణేశ్ దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ- ‘‘దర్శకుడు భారతీగణేశ్ మంచి మాస్ పల్స్ ఉన్న దర్శకుడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా నా కెరీర్లో ఓ మంచి సినిమా అవుతుంది’’అని చెప్పారు. ఈ సందర్భంలో శ్రీహరి లేకపోవడం బాధాకరమని, ఈ చిత్రం తరుణ్కి పెద్ద హిట్ కావాలని శ్రీకాంత్ అభిలషించారు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేసి, సంక్రాంతి కానుకగా ఈ నెల 16న సినిమా విడుదల చేస్తామని నట్టికుమార్ తెలిపారు. మాస్ లీడర్కీ, యూత్ లీడర్కీ మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా అని దర్శకుడు చెప్పారు. ఇంకా సాధక్ కుమార్, ఘటికాచలం, నట్టి క్రాంతి, జిట్టా సురేందర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.