-
కాళేశ్వరంతో ఆంధ్రాకు నష్టం లేదు
సాక్షి, విజయవాడ : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం లేదని రాష్ట్ర డ్రైనేజ్ బోర్డు మాజీ సభ్యులు, రైతు సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహితా – చేవెళ్ల అనే మెగా ప్రాజెక్టు చేపట్టిందని, 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గోదావరి నది కాలువగా ఉపయోగించుకుని రివర్స్ పంపింగ్ ద్వారా రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిండని వివరించారు. గోదావరి జల్లాల్లో తెలంగాణకు కేటాయించిన 936 టీఎంసీలలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 350 టీఎంసీల నీటిని వినియోగించుకుంటారని తెలిపారు. ఈ నీటిని వినియోగించుకున్నా.. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత పోలవరం కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 300 టీఎంసీలు, దిగువన మరో 500 టీఎంసీల నీటికి ఢోకా ఉండదని తెలిపారు. గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ 10 వరకు 100 రోజుల్లో సుమారు 80 రోజులు మిగులు జలాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా – పెన్నా నదులకు తరలించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ కలిసి వస్తే పులిచింతల ఎగువన కృష్ణానదిపై 2 బ్యారేజలు నిర్మించి సాగర్ టెయిల్పాండ్లోకి, అక్కడ నుంచి సాగర్లోకి నీటిని ఎత్తిపోయాలన్నారు. శ్రీశైలం వద్దకు చేరిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రాజెక్టులు ప్రణాళిక బద్దంగా వాడుకోవచ్చన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో వెనులుబాటు కల్పించిన డెసిషన్–ఇంప్లిమెంటేషన్ బోర్డ్ ఏర్పరచుటకు వీలుగా సుప్రీం కోర్టులలోను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందున్న దావాలను ఇరు రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలన్నారు. -
పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలి
ఏలూరు(ఆర్ఆర్ పేట) : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులోని సమాఖ్య కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నదీజలాల విని యోగ విధానం కారణంగా రాష్ట్రంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కృష్ణ, గోదావరి నదీజలాల వినియోగంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల తరువాత మన రాష్ట్రం చివరన ఉండటంతో, దిగువకు నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తెలంగాణలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు నీరు రాని కారణంగా తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చే ప్రాణహిత, ఇంద్రావతి నదీజలాలను తరలించుకుపోవటానికి మేడిగడ్డ, అన్నారం, సందిళ్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి పూనుకోవడంతో, రాష్ట్ర ప్రజలు మరింత ప్రమాదంలో పడబోతున్నారని పేర్కొన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు 1,480 టీఎంసీల గోదావరి నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయిందన్నారు. దానిలో 900 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి, 580 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి విభజించారన్నారు. ఆంధ్రాకు వచ్చే 580 టీఎంసీలలో గోదావరి డెల్టాకు 260 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టుకు 302 టీఎంసీలు, చిన్న ప్రాజెక్టులకు 18 టీఎంసీలను పంపంకం చేసిందన్నారు. పోలవరానికి కేటాయించిన నీటిలో అధిక భాగం సముద్రంలో కలిసిపోతోందన్నారు. ఆ నీటిని నిలువ చేసేందుకు పోలవరం ’పాజెక్టును త్వరగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను రప్పించుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ.40 వేల కోట్లను కేంద్రం వెంటనే విడుదల చేసే వరకూ పోరాటం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ముందుకు రావాలని కోరారు. -
పోల‘వరమా’? ‘పట్ట్టు’సీమా?
విశ్లేషణ పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాకి చేరేది పోలవరం కుడి కాలువ ద్వారానే. దానిలో 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. హైకోర్టులోని రైతుల దావాలు తేలి 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అదిగాక అటవీ, గిరిజన భూముల సేకరణ జరగాలి. కనీసం రూ. 400 కోట్ల నిధుల కొరత పూడాలి. ఇవన్నీ జరిగితేనే కాలువ పని మొదలయ్యేది. అది పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. సత్వరమే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టులపై ప్రస్తుతం వాదోపవా దాలు సాగుతున్నాయి. పోలవరానికి అధిక నిధులను కేటాయించి నాలుగేళ్ల లోనే దాన్ని పూర్తి చేయాలని అన్నిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు న్నాయి. మరోవంక పట్టిసీమ ఎత్తిపోతలతో ఆరునెల్లలోనే గోదావరి వరద నీటిని కృష్ణానదికి తరలిస్తామని, తద్వారా నాగార్జునసాగర్లో ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాజెక్టులను కలిపి పరిశీలించాల్సి ఉంది. మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టయిన పోలవరం ఏపీకి జీవనాడి. దాని అంచనా వ్యయం రూ.16,060 కోట్లు. ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.5,150 కోట్లు. కుడి కాల్వలో 70%, ఎడమ కాల్వలో 65%, హెడ్ వర్క్స్లోని స్పిల్వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పనులలో 10%, శాడిల్ డామ్లు, సొరంగాలలో 80% పనులు పూర్తయ్యాయి. కేంద్రం, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ప్రాజెక్టు అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏటా వర్షాకాలం 120 రోజులలో 85 రోజులు గోదావరి వరద నీరు లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతుంది. ఆ నీటిని నిల్వ చేసి వరద లేని రోజులలో ఆ ప్రాంతాల తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చ డంతోపాటూ, కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని తరలించే చిట్టచివరి రిజర్వా యరే పోలవరం. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమే ఈ ప్రాజెక్టులోని ప్రధానాంశం. తద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణాకు చేరుతుంది. కాబట్టి నాగా ర్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆగిపోతుంది. ఇలా ఆదా అయిన నీటిలో 35 టీఎంసీలను ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలూ, 45 టీఎంసీలు తెలంగాణ, రాయలసీమలూ వినియోగించుకునేట్టు 1978లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీనిని 1980నాటి బచావత్ అవార్డు తుది తీర్పులో పొందుపరచారు. ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలతోనే 80 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యం నెరవేరుతుండగా ఇంకా పోలవరం ప్రాజెక్టు అవశ్యకత ఏమిటని దాన్ని వ్యతిరేకిస్తున్న వారి ప్రశ్న. పోలవరం కుడి కాల్వలోకి పట్టి సీమ పథకం ద్వారా నీటిని తరలిస్తున్నట్టే, మరో ఎత్తిపోతల ఏర్పాటుతో విశాఖ అవసరాలు తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పోలవరం పూర్తయ్యేలోగానే తక్షణమే పట్టిసీమతో గోదావరి వరదజలాలను వినియోగంలోకి తెస్తామంటున్నది. కానీ దానివల్ల ఇప్పటికే అంతరాష్ట్ర, పర్యావరణ వివాదాలలో ఉన్న పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తుందనేది ఎందుకు పట్టడం లేదు? కాల్వ లేకుండానే పట్టిసీమ జలాల పరుగులా? పోలవరం దిగువన పట్టిసం వద్ద గోదావరి జలాలను 24 పంపులతో తోడి 3.2 మీటర్ల వ్యాసం గల పైపుల ద్వారా 4.5 కిలోమీటర్ల దూరంలోని పోల వరం కుడికాల్వలోకి చేరుస్తారు. ఇందుకు 150 మెగావాట్ల విద్యుత్తు అవస రం. ఆ భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాలోకి చేరేది పోలవరం కుడికాల్వ ద్వారానే. 174 కిలోమీటర్ల పొడ వైన ఈ కాల్వలో ఇంకా 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. అందుకు 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అది జరగాలంటే హైకోర్టులో ఉన్న రైతుల దావాలు తేలాలి. అటవీ, గిరిజన భూముల సేకరణ కూడా జరగాలి. ఇవన్నీ జరిగితేనే పని మొదలయ్యేది. ఈ కాలువ పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. 6 నుంచి 9 నెలల్లోనే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? కుడికాల్వ వ్యయం రూ. 2,441 కోట్లని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు వ్యయం రూ. 1,345 కోట్లు. ఇంకా రూ. 1,800 కోట్లు కావాలి. పట్టిసీమకు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన రూ. 257 కోట్లకు తోడు కేంద్ర ప్రభుత్వ ఏఐబీపీ నిధులు రూ. 850 కోట్ల నుంచి రూ. 775 కోట్లను కేటాయించారు. మొత్తం రూ.1,032 కోట్లు. ప్రాజెక్టు వ్యయం 22% పెరిగి రూ. 1,450 కోట్లకు పెరిగింది. మిగతా రూ. 400 కోట్లూ లేకుండానే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? కుడి కాల్వ పూర్తి కాకుం డానే పట్టిసీమ నీరు కృష్ణాకు, తర్వాత రాయలసీమకు చేరుతుందా? ప్రాజెక్టు లక్ష్య సాధన సంగతెలా ఉన్నా పంట పొట్ట మీదున్న కీలక దశలో నీటి కొరత ఏర్పడుతుందని గోదావరి డెల్టా వారూ, ఇటు పట్టిసీమ నీరు పారక, అటు సాగర్ నుంచి నీరు విడుదలకాక కృష్ణా డెల్టావారు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అవుతుందని ఆందోళన చెందడం సమంజసం కాదా? గోదావరి నీటి మళ్లింపు జరిగినా, జరగకపోయినా పట్టిసీమలో పం పింగ్ ప్రారంభం కాగానే బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు 65 టీఎంసీలను అదనంగా వినియోగిస్తే నష్టపోయేది సీమవాసులే. అందుకే పోలవరం కల సాకారమౌతుందని ఆశలు పెట్టుకున్నవారంతా పట్టిసీమ, పోలవరానికి అడ్డంకి అవుతుందని భయాందోళనలకు గురవుతున్నారు. పట్టిసీమ లేకుండానే సీమకు నీరు సాధ్యం 1. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆయకట్టులో కేటాయింపుల కన్నా అధిక నీటి వినియోగాన్ని తగ్గించి నీరు ఆదా చేయవచ్చు. అలాగే పులిచింతలలో 40 టీఎంసీల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయొచ్చు. జాతీయ జలరవాణా మార్గం 4లో భాగం, గోదావరి-కృష్ణా అనుసంధా నమైన ఏలూరు కాల్వల ద్వారా 20 టీఎంసీల గోదావరి నీటి తరలింపు నకు ప్రాధాన్యత ఇస్తే సీమకు నీరందించొచ్చు. 2. రాయలసీమకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వతోపాటు, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాల్వలు, నిప్పులవాగులలో ప్రవాహాలకున్న అడ్డంకులను తొలగించి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇప్పటికంటే రెట్టింపు నీటిని సీమకు తరలించవచ్చు. 3. }Oశెలం రిజర్వాయర్లో నీటిమట్టం 854 అడుగులకు పైగా ఉంటేనే పోతి రెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా జలాలు అందుతాయి. గత ఏడేళ్లలో (2008- 2015) సగటున ఏడాదిలో 198 రోజులు నీటిమట్టం 854పైనే ఉంది. పోతిరెడ్డిపాడు పాత, కొత్త రెగ్యులేటర్ల నీటి విడుదల సామర్థ్యం 55.5 టీఎంసీలు. కానీ అత్యధికంగా జరిగిన నీటి విడుదల 14 వేల క్యూసెక్కులు! దీనికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు- బనకచర్ల ప్రధాన కాల్వను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవటమే. 4. అలాగే తెలుగుగంగ కాల్వల ద్వారా బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్కు నీరు చేరటం లేదు. శ్రీశైలం కుడికాల్వ, గాలేరు-నగరి కాల్వల పరిస్థితీ అంతే. గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లు పూర్తికాలేదు. హం ద్రీ-నీవా కాల్వకు సిమెంటు లైనింగ్ చేయలేదు. కృష్ణా నుంచి పెన్నాకు, అక్కడి నుంచి సోమశిల, కండలేరుకు నీరు చేర్చే నిప్పులవాగు ప్రవాహ వాగు సామర్థ్యం పెంచలేదు. దీనిపై నిర్మించిన నాలుగు విద్యుత్ కేంద్రాల డ్యామ్లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయి. నీరున్నా తీసుకోలేని దుస్థితి. పోలవరం పూర్తయ్యేలోగానే సీమకు నీరు అందించాలన్న చిత్త శుద్దే ఉంటే ప్రభుత్వం ఈ అడ్డంకులను తొలగిం చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ అసాధ్యమైన తక్షణ లక్ష్యాలతో భారీ ప్రాజెక్టు పట్టిసీమ కోసం పట్టు ఎందుకు? కోరికోరి పోలవరానికి అడ్డంకులు సృష్టించడమెందుకు? పాలకుల పంతాలు... ప్రజలకు సంకటాలు రాష్ట్ర విభజన తర్వాత నీటి కష్టాలు పెరిగాయి. ఈ ఏడాది కూడా కృష్ణానదికి వరదలొచ్చాయి, జలాశయాలు నిండాయి. 73 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకుపైగా ఉంటేనే సీమకు నీరు అందుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఏలికల మధ్య పంతాలు, పట్టింపులతో జల వివాదాలు ముదిరాయి. తెలంగాణ తమకు చెందిన శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి వేలాది క్యూసెక్కుల నీటిని సాగర్లోకి విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, రివర్ బోర్డు ఆదేశాలను కూడా ఖాతరు చేయక శ్రీశైలం నీటి మట్టాన్ని తాజాగా 800 అడుగులకు తగ్గించింది. మరోవంక నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 లక్షల ఎకరాలు, కుడికాల్వ కింద గుంటూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, డెల్టాలో 75 వేల ఎకరాలు అనుమతులు లేని దాళ్వా వరి సాగు జరిగింది. ఈ అనుమతులు లేని సాగుకు నీరు అందించ డంలో ఇద్దరు ముఖ్యమంత్రులకూ అంగీకారం కుదిరింది. ఇలా సాగర్ నుంచి నిత్యం 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటి వినియోగం వలన కనీస నీటి మట్టం (ఎండీడీయల్) 510 అడుగుల కన్నా దిగువనున్న నీటిని వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో రాబోయే ఏడాదికి ముందస్తుగా వాడు కోవడానికి అవసరమైన 150 టీఎంసీల నీటిని క్యారీ ఓవర్గా శ్రీశైలం, నాగా ర్జునసాగర్లలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. క్యారీ ఓవర్గా ఉం చాల్సిన 150 టీఎంసీలను గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మొత్తం జలాశయాలన్నీ ఖాళీ చేయడం దురదృష్టకరం. పులిచింతల కృష్ణా డెల్టా మొదటి పంటకు ముందుగా నీరందించే ప్రాజెక్టు. కానీ ఆ నీరూ వాడేశారు. రాబోయే నెలల్లో తాగునీటికి, నారుమళ్లకు నీరు ఎలా ఇస్తారు? ఇప్పటికే శ్రీశైలం, సాగర్లో పూడిక వలన 189 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాం. ఈసారి కూడా ఆలస్యమైతే కృష్ణా డెల్టాలోని 12 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకమే కదా? నీటి దుర్వినియోగాన్ని అరికట్టి, చట్టబద్ధంగా నీటి కేటాయింపులున్న వారికి, దుర్భిక్ష ప్రాంతాల తాగునీటి అవసరాలకు ప్రాధా న్యాన్నిచ్చే విధంగా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు కొంత మేరకైనా ప్రయోజనం. కేటాయింపులకు మించి అధిక నీటి వినియోగం జరుగుతున్న కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి, సాగర్ ఆయకట్టు తదితరాల నుంచి 80 నుంచి 100 టీఎంసీల నీరు ఆదా చేసి తీరాలి. ఆ నీటిని దుర్భిక్ష ప్రాంతాల తాగునీటికి, చెరువులు, జలాశయాలు నింపుట ద్వారా భూగర్భ జలాల పెంపుదలకు వినియోగించాలి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టిసీమపై పట్టుదలను వీడి, పోలవరం కుడి, ఎడమ కాల్వలను, ప్రాజెక్టును పూర్తి చేయుటకు ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టిసీమపై పట్టుదలకు పోతే రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం తప్పదు. దీనికి ఖర్చు చేసే రూ. 1,600 కోట్లు సీమ ప్రాజెక్టులలో అత్యవసర పనులకు వెచ్చించి, రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని రైతాంగ సమాఖ్య డిమాండ్ చేస్తోంది. పట్టిసీమపై పట్టువీడి, పోలవరం పూర్తి చేద్దాం! రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం! (వ్యాసకర్త ‘రైతాంగ సమాఖ్య’ అధ్యక్షులు ఫోన్ నం: 98495 59955) -
‘కృష్ణా’ను మరో మూసీ చేయొద్దు
రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ విజయవాడ : రివర్ వ్యూ కేపిటల్ పేరుతో కృష్ణా నదిని మరో మూసీ నది చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ హితవు పలికారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు కాబోతున్న తరుణంలో కృష్ణా నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటుచేసినా తమకు అభ్యంతరం లేదని, కృష్ణా నది కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. స్వరాజ్ మైదానానికి ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పించాలని కోరారు. 1992లో అప్పటి ప్రభుత్వం స్వరాజ్ మైదానంలోని ఆక్రమణలు తొలగించాలని జీవో జారీచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ ఆ జీవోను సమర్థించిందన్నారు. రైతు బజారును తొలగించి నగరంలోని ఇతర ప్రాంతాల్లో పదికిపైగా రైతు బజారులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బందరు కాలువ, ప్రకాశం రోడ్డు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఉన్న 350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన భూములను తిరిగి తీసుకోవాల న్నారు. విజయవాడకు దుఖఃదాయినిగా మారిన బుడమేరు వరద నీరు నగరంలోకి రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. గుణదల నుంచి ఎనికేపాడు వరకు బుడమేరు అనేక మెలికలు తిరిగిందని, ముస్తాబాద చానల్ను వెడల్పు చేసి అందులో బుడమేరును కలపడం ద్వారా చాలా వరకు వరద నగరంలోకి రాకుండా పోతుందని, పోలవరం కాలువకు ఇరువైపులా రహదారి ఏర్పాటు చేస్తే జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడుతుందని సూచించారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని, నగరంలో మరిన్ని సమస్యలు తల్తెకుండా చూడాలని కోరారు. నగరంలోని ప్రధాన కాలువల్లో మురుగునీరు చేరకుండా చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. -
మద్దతు కాదు గిట్టుబాటు ధర కావాలి
ఏఎన్యూ, న్యూస్లైన్: ప్రభుత్వాలు రైతులకు ఇవ్వాల్సింది మద్దతు ధర కాదని, గిట్టుబాటు ధర అని ఆంధ్రప్రదేశ్ రైతాంగ్ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ చెప్పారు. వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రభుత్వాలు వ్యవసాయం కంటే పరిశ్రమలు, సేవారంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. దేశ ఆహార సమస్యలు తీర్చేందుకు జీవితాంతం శ్రమిస్తున్న రైతుల భద్రతకోసం ఎలాంటి చర్యలు లేకపోవటం విచారకరమన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజులపాటు జరుగనున్న జాతీయ సదస్సు శనివారం యూనివర్సిటీలో ప్రారంభమయింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేంద్రనాథ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో లేదని, రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర లభించకపోవటమే దీనికి కారణమన్నారు. ఐక్యత లేకపోవటం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. రైతాంగ సమస్యలను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించటంలేదని ఆరోపించారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆ ఫలాలు రైతులకు దక్కటం లేదని చెప్పారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు అధ్యక్షోపన్యాసం చేస్తూ వ్యవసాయరంగంలో వ్యాపార ధృక్పధం ఉన్న సంస్థలు లాభాల బాటలోనే ఉన్నాయని, రైతులు మాత్రం నష్టాలు ఎదుర్కొంటున్నార ని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కంపెనీలు నష్టాలు ఎదుర్కొన్న సందర్బాలు లేవని, రైతులు గిట్టుబాటు ధరలేక నష్టపోయిన సందర్బాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. ఐటీసీ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ రామ్గ్రాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని లాభాసాటిగా నిర్వహిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయేల్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను పాటించాల్సిన అవసరం ఉంద న్నారు. సదస్సు డెరైక్టర్ ఆచార్య పి.నరసింహారావు, ఆంధ్రా యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు ఆచార్య ఎల్ .కె.మోహనరావు, ఏఎన్యూ సోషల్ సెన్సైస్ డీన్ ఆచార్య బి.సాంబశివరావు, బెంగళూరు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య రామాంజనేయులు తదితరులు ప్రసంగించారు. అనంతరం అతిథులు సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు ఆచార్య ఎం.కోటేశ్వరరావు, మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.వి.ఎన్.శర్మ, ఆచార్య కె.రాజబాబు, ఆచార్య సి.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ కె.మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement