-
సిబ్బందిని పొట్టనబెట్టుకుంది అతడే
జమ్మూ: శ్రీనగర్లో 1990 జనవరి 25వ తేదీన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సిబ్బందిపై కాల్పులు జరిపింది జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ అని ప్రత్యక్ష సాక్షి ధ్రువీకరించారు. ఆ రోజు ఘటన జరిగిన తీరును గురువారం ఐఏఎఫ్ మాజీ కార్పొరల్ రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టుకు చెప్పారు. శ్రీనగర్ వైమానిక కేంద్రానికి వెళ్లేందుకు ఐఏఎఫ్ సిబ్బంది 1990 జనవరి 25వ తేదీ ఉదయం రావల్పొరాలో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో యాసిన్ మాలిక్తోపాటు కొందరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. యాసిన్ మాలిక్ తన దుస్తుల్లో నుంచి తుపాకీని బయటకు తీసి, యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు నేలకొరగ్గా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉమేశ్వర్ సింగ్ ఒకరు. తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ గురువారం జరిగిన కోర్టు విచారణకు వర్చువల్గా పాల్గొన్నాడు. ప్రత్యక్ష సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని యాసిన్ మాలిక్ తిరస్కరించాడు. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కోరాడు. ఈ కేసులో మాలిక్, మరో అయిదుగురిపై 1990 ఆగస్ట్ 31వ తేదీన జమ్మూలోని టాడా కోర్టులో చార్జిషీటు దాఖలైంది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా కిడ్నాప్, నేవీ అధికారులపై కాల్పుల కేసులు యాసిన్ మాలిక్పై ఉన్నాయి. -
వేర్పాటు నేత భార్యకు పాక్ పట్టం.. ప్రతీకార ధోరణే ప్రధాన కారణం?
భారతదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్కు పాకిస్తాన్ పట్టంకట్టింది. ఆమె పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోకి అడుగు పెట్టింది. అన్వరుల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రభుత్వంలో మానవ హక్కులు, మహిళా సాధికారతపై ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారుగా ఆమె నియమితులయ్యింది. ఆమె ఒక ఉగ్రవాది భార్య అయినప్పటికీ పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కుల అంశంలో ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు ముషాల్ హుస్సేన్ మాలిక్కు మించిన అర్హత కలిగిన వ్యక్తులు పాకిస్తాన్లో లేరా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకం వెనుక పాకిస్తాన్ రహస్య ఎజెండా ఉందనేది స్పష్టం అవుతున్నదని వారు అంటున్నారు. ముషాల్కు బాధ్యతల అప్పగింత వెనుక.. నిజానికి ముషాల్ హుస్సేన్ మాలిక్ నియామకం లాంఛనప్రాయ చర్య అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ముషాల్ పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రముఖరాలేమీ కాదు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టనూ లేదు. అటువంటి పరిస్థితిలో కాశ్మీర్ ఎజెండాను సజీవంగా నిలిపివుంచడానికి, పాకిస్తాన్ సైన్యం వినతి మేరకు ముషాల్ను పాకిస్తాన్ ఈ ఉన్నత పదవిలో నియమించిందని తెలుస్తోంది. ముషాల్ హుస్సేన్ కశ్మీర్ విషయంలో మొదటి నుంచి భారత్పై విషం చిమ్ముతూ వస్తోంది. కశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచాలని.. భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్- 370 రద్దు చేసిన అంశాన్ని తిరిగి లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న విఫల ప్రయత్నాలలో భాగమే ఈ చర్య అని విశ్లేషకులు అంటున్నారు. కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన జీ-20 సమావేశాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముషాల్ను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ముషాల్ మాట్లాడుతూ యాసిన్ మాలిక్ విషయంలో భారత్పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు చేసింది. ఇదిలావుండగా ఇటీవల జీ-20 సభ్యులు శ్రీనగర్కు చేరుకుని, సమావేశంలో పాల్గొన్నప్పుడు మరోసారి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నించింది. పీఓకే ప్రజలను తప్పుదారి పట్టించేందుకే.. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలో ముషాల్ చేరిక వెనుక పాక్ ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ముషాల్ను నియమించడం ద్వారా పీఓకే ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం దక్కుతుందని భావిస్తోంది. కాగా ముషాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్. 2005లో పాకిస్తాన్లో ఆమెకు యాసిన్ మాలిక్ పరిచయం అయ్యాడు. 2009లో వారు పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను చైనా ఎందుకు హెచ్చరించింది? -
Yasin Malik: మరీ ఇంత నిర్లక్ష్యమా?
ఢిల్లీ: కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న అభియోగాలతో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్ మాలిక్ ఉన్నపళంగా కోర్టులో ప్రత్యక్షం కావడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వర్చువల్గా విచారించే అవకాశం ఉన్నా.. కోర్టుకు తీసుకురావడం ఏంటని? జైలు అధికారులను ప్రశ్నించింది. అదే సమయంలో సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ అంశంపై కేంద్ర హోం శాఖకు ఓ ఘాటు లేఖ సైతం రాశారు. ఆదేశాలు ఇవ్వకున్నా సరే.. యాసిన్ మాలిక్ను అధికారులు విచారణకు తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్రంగా తప్పుబట్టింది. టెర్రర్ ఫండింగ్ కేసులో జీవిత ఖైదు పడిన యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తోటి ఖైదీల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలోనూ అతన్ని ప్రత్యేకంగా ఉంచారు కూడా. అలాంటిది.. వర్చువల్గా విచారించే ఛాన్స్ ఉన్నా.. జమ్ము కశ్మీర్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన ఓ అభ్యర్థన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జైలు అధికారులు యాసిన్ మాలిక్ను కోర్టుకు తీసుకొచ్చారు. చుట్టూ అధికారులున్నా.. మాలిక్ కోర్టు ప్రాంగణంలోనే కాసేపు కలియ తిరిగాడు. అయితే.. మాలిక్ను కోర్టులో భౌతికంగా హాజరుపర్చాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని.. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వర్చువల్గా విచారించే అవకాశం ఉంది కాదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అందుకు వీలున్నా జైలు అధికారులు ఆ పని చేయలేదని అదనపు సోలిసిటర్ జనరల్ వివరించారు. ‘‘ఇది భద్రతా వైఫల్యం కిందకే వస్తుంది. యాసిన్ మాలిక్ ప్రాణాలకు సంబంధించిన అంశం ఇది. భవిష్యత్తులో అతన్ని బయటకు తీసుకురాకపోవడమే మంచిది’’ అని తెలిపారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని.. సంబంధిత బెంచ్ నుంచి ఆదేశాలు పొందాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన బెంచ్ అదనపు సోలిసిటర్ జనరల్కు సూచించింది. హోం శాఖకు లేఖ యాసిన్ మాలిక్ను జైలు నుంచి బయటకు తీసుకువస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఓ ఘాటు లేఖ రాశారు. యాసిన్ మాలిక్కు పాక్ సంబంధిత ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అతనెంత కీలకమో హోంశాఖకు తెలుసు. ఇలా బయటకు తీసుకొస్తే.. అతను తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే అతన్ని ఎత్తుకెళ్లడమో కుదరకుంటే చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సర్వోన్నత న్యాయస్థానం భద్రతకు సంబంధించిన అంశం కూడా. జైలు అధికారులకు అతన్ని బయటకు తీసుకొచ్చే అధికారం ఉండదన్న విషయం గుర్తించాలి. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని తుషార్ మెహతా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై తీహార్ జైలు డీజీ విచారణకు ఆదేశిస్తూ.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోరారు. సుప్రీం కోర్టు నుంచి నిత్యం ఇలాంటి నోటీసులు సర్వసాధారణంగా వెళ్తుంటాయని.. అయితే జైలు అధికారులు వాటిని తీవ్రంగా పరిగణించినందునే మాలిక్ను కోర్టుకు తీసుకెళ్లి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1989లో నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని హతమార్చడంతో పాటు అప్పటి కశ్మీర్ హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతురు రుబియాను అపహరించిన వ్యవహరానికి సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. అయితే.. యాసిన్ మాలిక్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 268 ఆదేశాలు ఉన్నాయి. అంటే.. కోర్టులో అతన్ని హాజరుపర్చడం నుంచి మినహాయింపు ఉంది. కానీ, జమ్ము కశ్మీర్ ప్రత్యేక కోర్టు(టాడా కోర్టు) అదనపు సెషన్స్ జడ్జి నిర్లక్ష్యంగా హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలనే సవాల్ చేస్తూ.. సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
జైలులో నిరాహార దీక్ష చేపట్టిన యాసిన్ మాలిక్!
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాలిక్ జూలై 22 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడని చెప్పారు. తన కేసును సంక్రమంగా విచారంచిలేదంటూ ఆరోపణలు చేస్తూ... నిరాహారదీక్ష చేపట్టాడని వెల్లడించారు. వాస్తవానికి మాలిక్ నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఐతే అతను 2019లో జేకేఎల్ఎఫ్ని నిషేధించిన కొద్దికాలానికే అరెస్టు అవ్వడమే కాకుండా ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష తోపాటు దాదాపు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. పైగా అతను తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఫిటిషన్ దాఖలు చేయనని కోర్టుకు తెలిపాడు కూడా. అంతేగాదు పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబుబా మఫ్తీ సోదరి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహ్మద్ సయ్యద్ కుమార్తె రుబయా సయ్యద్ని డిసెంబర్ 8,1989న తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ కేసులో మాలిక్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాలిక్ పై కిడ్నాప్ కేసు తోపాటు 1990 జనవరిలో శ్రీనగర్లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కాల్చి చంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐతే మాలిక్ ప్రస్తుతం ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. (చదవండి: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో బెంగాల్ మంత్రి అరెస్ట్.. అసలు సినిమా ముందుంది: బీజేపీ) -
యాసిన్ మాలిక్ తీర్పుపై విమర్శా?.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు.. కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ను దోషిగా తేల్చింది.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై ఇస్లామిక్ దేశాల కూటమి (OIC-IPHRC) మానవహక్కుల విభాగం ప్రతికూలంగా స్పందించింది. యాసిన్ మాలిక్ శిక్ష విషయంలో భారత్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఐవోసీ మానవ హక్కుల విభాగం పేర్కొంది. యాసిన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనివ్వకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఓఐసీ ఇలా విమర్శలు గుప్పించడం పట్ల భారత్ తీవ్రంగా మండిపడింది. ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ను కోరింది. ప్రపంచం ఉగ్రవాద ముప్పు నుంచి భారత్ భద్రతను కోరుకుంటోందని పేర్కొంది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ... మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదని ఓఐసీకు హితవు పలికారు. మాలిక్కు జీవితఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. అటు వంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘యాసిన్ మాలిక్ కేసులో తీర్పుపై భారత్ను విమర్శిస్తూ ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం.. ఈ వ్యాఖ్యల ద్వారా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ విభాగం పరోక్షంగా మద్దతునిచ్చింది.. ఆధారాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో సమర్పించారు.. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని కోరుతోంది.. దానిని ఏ విధంగానూ సమర్థించవద్దని మేము ఓఐసీ కోరుతున్నాం’’అని వ్యాఖ్యానించారు. చదవండి: Yasin Malik: యాసిన్కు మరణశిక్ష ఎందుకు వేయలేదు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement