breaking news
World womens boxing tourney
-
ఆశల పల్లకిలో...
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్కు దేశ రాజధాని వేదికగా రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 24 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. మొత్తం 10 విభాగాల్లో కలిపి 73 దేశాలకు చెందిన 300కు పైగా బాక్సర్లు ఈ ప్రతిష్టాత్మక పోరులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత్ నుంచి కూడా ఒక్కో విభాగంలో ఒకరు చొప్పున 10 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. 2001 నుంచి తొమ్మిది సార్లు మహిళల ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహించగా... 2006లో నాలుగో వరల్డ్ చాంపియన్షిప్ తర్వాత ఢిల్లీలో మళ్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ జరుగుతోంది. స్కాట్లాండ్, మాల్టా, బంగ్లాదేశ్, కేమన్ ఐలాండ్స్, డీఆర్ కాంగో, మొజాంబిక్, సియరా లియోన్, సోమాలియా దేశాలు తొలిసారి విశ్వ వేదికపై తలపడనుండటం ఈ పదో ప్రపంచ చాంపియన్షిప్లో మరో విశేషం. 2001 నుంచి 2010 మధ్య ఆరుసార్లు వరల్డ్ చాంపియన్షిప్ జరిగితే తొలిసారి (2వ స్థానం) మినహా ఆ తర్వాత వరుసగా ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత స్టార్ మేరీకోమ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి మేరీకోమ్కు యువ బాక్సర్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చు. 2006లో ఇదే వేదికపై స్వర్ణం సాధించిన మరో భారత బాక్సర్ సరితా దేవిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. భారత్ ఒక స్వర్ణం సహా కనీసం మూడు పతకాలు గెలుచుకునే అవకాశం ఉందని జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు: మేరీకోమ్ (48 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (64 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు), సవీటీ బూరా (75 కేజీలు), భాగ్యవతి కచారీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు). -
క్వార్టర్స్లో ఓడిన నిఖత్
ప్రపంచ మహిళల బాక్సింగ్ టోర్నీ అస్తానా (కజకిస్తాన్): సీనియర్ స్థాయిలో తొలి సారి ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. మంగళవారం జరిగిన 54 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 0-3తో పియాపియో (చైనా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్కే చెందిన సోనియా లాతెర్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోగా... సవీటి బోరా (81 కేజీలు), సర్జూబాలా దేవి (48 కేజీలు), సీమా పూనియా(+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు. సోనియా 3-0తో అనెతా రిగిల్స్కా (పోలండ్)పై విజయం సాధించగా... సవీటి 0-3తో ఎలిఫ్ గునెరి (టర్కీ) చేతిలో, సర్జూబాలా 0-3తో నజిమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో, సీమా 0-3తో లజత్ కుంగ్బయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.