breaking news
World Disabled Day
-
స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు!
చెవులు వినపడవు. ‘పాపం ఈ పిల్లను ఎవరు చేసుకుంటారు?’ కళ్లు కనిపించవు. ‘అయ్యో. ఎలా బతుకుతుంది’ నడవలేదు. ‘జన్మంతా అవస్థే’ దివ్యాంగులపై జాలి, సానుభూతి రోజులు పోయాయి. వాటిని ఉచితంగా పడేస్తే అదే పదివేలు అని మహిళా దివ్యాంగులు అనుకోవడం లేదు. మేము సాధిస్తాం.. మేము జీవిస్తాం... ఈ జగత్తు మాది కూడా అని ముందుకు సాగుతున్నారు. స్వర్ణలత ఒక ఉదాహరణ. మస్క్యులర్ డిజార్డర్ వల్ల వీల్చైర్కు పరిమితమైనా గాయనిగా, రచయితగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా, మోటివేషనల్ స్పీకర్గా గుర్తింపు పొందింది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం ఇది. జీవితం ఒక్కోసారి అడుగు ముందుకు పడనివ్వదు. మరోసారి శరీరం కదలిక కోల్పోయి ముందుకు అడుగు పడనివ్వదు. కాని జీవితంలో కాని, శరీరం మొరాయించినప్పుడు కాని మొండి పట్టుదలతో ముందుకు సాగితే దారి కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తుంది. గమనంలో తోడు నిలిచేవాళ్లుంటారని తెలిసి వస్తుంది. అచలనంలో జీవితానికి సార్థకత లేదని చలనంలోనే పరమార్థం ఉందని అర్థమవుతుంది. దివ్యాంగులు గతంలో న్యూనతతో ఇంటికి పరిమితమయ్యేవారు. నలుగురిలో వచ్చేవారు కాదు. ఇక ఆ దివ్యాంగులు స్త్రీలైతే మానసిక కుంగుబాటుతో ముడుచుకుపోయేవారు. కాని ఆ రోజులు పోయాయి. ‘మనల్ని మనలాగే మన శారీరక పరిమితులతోనే గౌరవించేలా ఈ సమాజంలో మార్పు తేవాలి. ఒకరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని జీవించాలి. నలుగురికీ స్ఫూర్తినివ్వాలి’ అని మహిళా దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. జాలి చూపులు, సానుభూతి మాటలు... ఇవి అక్కర్లేదు... ఈ సమాజంలో దివ్యాంగులు ఒక భాగమని గుర్తించి... ఈ జగత్తులో తమ వాటా చోటును మాకు వదిలిపెట్టి... అందరూ తిరుగాడే చోటుల్లో తాము కూడా అడుగుపెట్టేలా సౌకర్యాలు ఉంచితే చాలు అని అంటున్నారు. పెద్ద ఉద్యోగాలు, డాక్టర్ చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీల్చైర్కు పరిమితమైనా ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారు. స్వర్ణలత– మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ స్వర్ణలత వేదిక మీదకు వస్తే చాలు కరతాళధ్వనులు వినిపిస్తాయి. ఎందుకు? ఆమె మోటివేషనల్ స్పీకర్. ‘చూడండి... నేను వీల్చైర్లో ఉన్నాను. 80 శాతం నా శరీరంలో కదలిక లేదు. మీరు నూరు శాతం కదల వీలైన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను నా పరిమిత కదలికల్లోనే సమాజం కోసం ఇంత చేస్తుంటే మీరు ఎంత చేయాలి?’ అని ఆమె ప్రశ్నిస్తే వింటున్నవారు చప్పట్లు కొడుతూ ఇన్స్పైర్ అవుతారు. కాని స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. బెంగళూరులో జన్మించిన స్వర్ణలత చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేది. బాగా చదువుకుందామనుకుంది. కాని దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెను అడుగు పడనివ్వక కంప్యూటర్స్లో డిప్లమా చాల్లే అని ఆపేసింది. ఆ తర్వాత ఆమె ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటే వెలి వేసి ఇంటికి రాకుండా ఆపేసింది. జీవితం ఇలా నిరోధిస్తుంటే పెళ్లయ్యి పాప పుట్టాక 2009లో ఆమెకు హటాత్తుగా మెడ దిగువల పక్షవాతం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి దాని పేరు ‘మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ అన్నారు. అంటే మెడ కింద వెన్ను ప్రాంతంలో కండరాల ఇబ్బంది వచ్చి శరీరం చచ్చుబడుతుంది. చిన్న పాప, ఏం చేయాలో తోచని భర్త. కాని స్వర్ణలత ధైర్యం చెప్పింది. ‘ఏం కాదు... పోరాడదాం’ అంది. తనకు ధైర్యం రావాలంటే తనలాంటి వారికి మేలు చేయాలని అనుకుంది. తనలాంటి వారిని గుర్తించి వెంటనే మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ వచ్చిన తనలాంటి వారిని గుర్తించేలా ‘స్వర్గ ఫౌండేషన్’ స్థాపించింది స్వర్ణలత. కర్నాటక, తమిళనాడుల్లో ఈ వ్యాధితో బాధ పడేవారి గురించి పని చేయసాగింది. వారికి అందాల్సిన వైద్యం, ఉండవలసిన అవగాహన, కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి, వీల్చైర్లో ఉంటూనే జీవితంపై ఆశ కలిగి బతికే ఉపాధి ఎలా పొందాలి... ఇలాంటి విషయాలన్నీ ఈ స్వర్గ ఫౌండేషన్ చూస్తుంది. అంతే కాదు పబ్లిక్ ప్లేసులలో దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉండేలా ర్యాంప్ల నిర్మాణం చేపట్టేలా సమాజాన్ని, పాలనా వ్యవస్థని అని సెన్సిటైజ్ చేస్తుంది. ‘కోయంబత్తూరులో దాదాపుగా అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ర్యాంప్లు వచ్చేలా చూశాం. బడి కాని ఆస్పత్రి కాని దివ్యాంగులు సౌకర్యంగా వెళ్లి రావచ్చు’ అంటుంది స్వర్ణలత. కాని దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాల్సి ఉంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రెస్టరెంట్లు, థియేటర్లు.. ఎన్నో వారి రాకపోకలకు వీలుగా లేవు. ఈ జగత్తు వారిది కూడా. వారు అందరిలానే అన్ని సౌకర్యాలు పొందుతూ జీవించేలా చూసే బాధ్యత మనది కూడా. ఆ విధంగా ఆలోచిద్దాం. ‘సారథి’లాంటి వాహనం స్వర్ణలత తన ఫౌండేషన్ తరఫున చేసిన మరో మంచి పని ‘సారథి’ పేర ఒక వాహనాన్ని తయారు చేయడం. ఇందులో దివ్యాంగులు తమ వీల్చైర్తో చాలా వీలుగా ప్రవేశించవచ్చు. లోపల సోఫా, బెడ్ ఉంటాయి. అంతేకాదు వేడి నీళ్ల బాత్రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ‘ఈ సారథిని ఉపయోగించుకుని ఒక దివ్యాంగుడు మూడేళ్ల తర్వాత తన తల్లిని చూడటానికి వెళ్లాడు. ఒక 90 ఏళ్ల ఆమె ఎన్నేళ్లగానో చూడాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చింది. నిజానికి ఇలాంటి వాహనాలు ప్రతి ఊళ్లో ఉండాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలి. వీటిని ఫీజుతో, పేదలకు తక్కువ చార్జీలతో ఉపయోగించవచ్చు’ అంటుంది స్వర్ణలత. -
దివ్యాంగులకు జననేత ఆత్మీయ స్పర్శ
సాక్షి, కపిలేశ్వరపురం: విశాలమైన అవనిలో ఎత్తుపల్లాలు.. చల్లని సముద్రంలో ఎగిసి..పడే కెరటాలు.. నీలి ఆకాశంలో నల్లని మబ్బులు.. ప్రకృతిలో ఏదీ సక్రమంగా ఉండదు. ప్రకృతి ప్రభావిత మానవుని జీవితంలోనూ సమస్యలు, ఒడిదొడుకులు సహజం. పుట్టుకతోనైనా, విధి వంచనైనా.. కారణమేదైనా దివ్యమైన జీవితాన్ని వైకల్యం వెంటాడినా విధి రాతను ఎదిరించి నిలిచిన దివ్యాంగులెందరో చైతన్యపూరితంగా జీవిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బు లేదనో, స్థిరాస్థి లేదనో, గౌరవం ఇవ్వడం లేదనో నిత్యం సమస్యలుగా భావించే వారు ఓసారి దివ్యాంగుల జీవితాల వైపు చూస్తే ఎంతో ప్రేరణ పొందుతారు. శరీర భాగాలు సహకరించకపోయినా జీవితంలో ఎదురీదుతూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం.. అడుగడుగునా జననేత ఆత్మీయ స్పర్శ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2018 జూన్, ఆగస్టు మధ్యకాలంలో జిల్లాలో సాగింది. దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులు పాదయాత్రలో తమ సమస్యలను చెప్పుకోగా వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. చూడలేకున్నా.. వెలుతురును ప్రసాదిస్తున్న శ్రీనివాస్ అంధత్వంతో తాను వెలుగును చూడలేకపోతున్నా తనలాంటి అనేక మందికి జీవితంలో వెలుతురును ప్రసాదిస్తున్నారు అమలాపురానికి చెందిన రామాయణం శ్రీనివాస్. పట్టుదలతో దూరవిద్యలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అంధుల సేవకు అంకితమై పనిచేస్తున్నారు. స్వశక్తితో 2004 అక్టోబర్ 16న లూయిస్ అంధుల పాఠశాలను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి అంధ విద్యార్థులకు తన సంస్థలో లూయీ బ్రెయిలీ అందించిన బ్రెయిలీ లిపితో విద్యాబోధన చేస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నారు. ఆయన సంస్థలోనే దాతల సహకారంతో అంధ విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈయన కృషిని ప్రశంసిస్తూ 2017 జనవరి 4న ప్రభుత్వం తరఫున అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత రాష్ట్ర ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. కోనసీమలోని అనేక సంస్థలు, దాతలు శ్రీనివాస్ కృషి కొనసాగింపునకు సహకరిస్తున్నారు. తెల్లవారగానే సాయం.. జిల్లాలో 1,590 సచివాలయాల ద్వారా 537 రకాల సేవలందుతున్నాయి. వాటి పరిధిలోని 26,743 మంది వలంటీర్లు శ్రమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ క్రమం తప్పకుండా తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు పింఛను సాయమందిస్తుంది. జిల్లాలో సుమారుగా 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లు నెలనెలా పొందుతున్నారు. సొంత కాళ్లపై నిలబడిన శ్రీఘాకోళపు పుట్టుకతోనే వైకల్యం వెంటాడడంతో మండపేటకు చెందిన శ్రీఘాకోళపు వెంకట కృష్ణగుప్తకు తన రెండు కాళ్లు పనిచేయవు. ఈయన ఎమ్కాం వరకూ చదువుకున్నాడు. స్థానికంగా కంప్యూటర్ కోర్సు చేసి స్వయం ఉపాధికి బాట వేసుకున్నాడు. ప్రస్తుతం మండపేటలో గుప్త గ్రాఫిక్స్ను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో పలువురి నిత్యావసర వస్తువులు అందజేసిఆదర్శంగానిలిచారు. చైతన్య దివిటీలు దివ్యాంగులు చైతన్య దివిటీలు. పుట్టుక వెక్కిరించినా, విధి వంచించినా సమాజంలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తమను సానుభూతితో కాదు.. సామాజిక దృక్పథంతో చూడాలంటున్నారు. గత కాలాల్లో ప్రభుత్వాలు అందజేసిన బహుళ అంతస్తుల భవనంలో దిగువ ఫ్లోర్లోనే దివ్యాంగులకు ఫ్లాట్లను కేటాయించేలా చేసుకున్నారు. నాలుగేళ్లుగా మండపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్లో మూడు శాతం నిధులను దివ్యాంగుల సంక్షేమానికి కేటాయిస్తున్నారు. మండపేటలో దివ్యాంగుల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుట్టు పని, ఫినాయిల్ తయారీ తదితర జీవనాధార అంశాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. దివ్యాంగుల కోసం ‘సమగ్ర’ సేవ భానుగుడి(కాకినాడ సిటీ): సమగ్రశిక్షా అభియాన్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు పలు ప్రత్యేక పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు దివ్యాంగుల ఉన్నతి కోసం నిరంతర పర్యవేక్షిస్తూ, నెలనెలా పలువిధాలుగా నగదు ఇస్తూ విద్యోన్నతికి తోడ్పాటు అందిస్తోంది. భవిత సెంటర్ల ద్వారా చిన్నారులకు విద్య జిల్లాలో 21 భవిత సెంటర్లు, 43 నాన్ భవిత సెంటర్ల ద్వారా 1379 మంది చిన్నారులకు 18మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. గృహ ఆధారిత విద్య 128 మంది ఐఈఆర్టీల ద్వారా వారంలో 640 మంది విద్యార్థులకు వారంలో ప్రతి శనివారం హోమ్బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతినెలా రూ.200 చొప్పున అలవెన్సులను ప్రభుత్వమే అందిస్తోంది. విద్యార్థులకు ట్రాన్స్పోర్టు అలవెన్సు ట్రాన్స్పోర్టు అలవెన్సు రూపంలో 2019–20 సంవత్సరానికి సంబంధించి 1094 మంది వీఐ, హెచ్ఐ, ఎంఆర్ కేటగిరీల విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున అలవెన్సులు అందిస్తోంది. ఎస్కార్టు అలవెన్సు: ప్రత్యేక అవసరాల గల సెరిబ్రల్ పాల్సీ, లోకోమోటార్ డిసెబిలిటీ అండ్ మల్టీపుల్ డిసెబిలిటీ విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఎస్కార్టు అలవెన్సు, ప్రత్యేక అవసరాలు గల ఆడపిల్లలకు 6,7,8 తరగతుల విద్యార్థినులకు 398 మందికి రూ.200 చొప్పున స్టైఫండ్, ప్రత్యేక అవసరాలు గల 46 మంది విద్యార్థినులకు రీడర్ అలవెన్స్ కింద, తొమ్మిది మంది విద్యార్థులకు నెలకు రూ.200 హాస్టల్ అలవెన్సు అందిస్తున్నారు. మైనర్ కరెక్టివ్ సర్జరీలు: రాజమండ్రి యూనివర్సల్ హాస్పిటల్ 52మందికి ఎసెస్మెంట్ క్యాంపు నిర్వహించి మైనర్ కరెక్టివ్ సర్జరీలు నిర్వహించారు. పదిలో 40 మంది పాస్ పదో తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. స్పెషల్ ఒలంపిక్ భారత్ క్రీడలు భవిత, నాన్ భవిత సెంటర్లలో పిల్లలకు స్పెషల్ ఒలింపిక్ భారత్ నిర్వహిస్తున్న క్రీడలకు జిల్లా స్థాయిలో పాల్గొనేందుకు శిక్షణ ఇచ్చారు. సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్... వైకల్యాన్ని నిర్ధారించేందుకు ప్రామాణికంగా ఉన్న సదరం సర్టిఫికెట్ జారీని ప్రస్తుత ప్రభుత్వం సరళతరం చేసింది. దివ్యాంగుడు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో టైమ్స్లాట్ను బుక్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్షకు వెళ్లాల్సిన తేదీ, సమయం, ఆస్పత్రి వివరాలను స్లాట్లో పేర్కొంటారు. పరీక్ష అనంతరం వైద్యుడు అందజేసే సర్డిఫికెట్ను సచివాలయాల్లోనే పొందొచ్చు. దివ్యాంగుల అవస్థలను తొలగించేందుకు వైద్య పరీక్షలు చేసే కేంద్రాల సంఖ్యను 18కు పెంచింది. జీజీహెచ్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీల్లో ఈ కేంద్రాలను నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా కొద్ది నెలల పాటు నిలిచిన సదరన్ శిబిరాల నిర్వహణ ప్రక్రియను పుదరుద్ధరించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిత కేంద్రాల ద్వారా సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల సంక్షేమం కోసం సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో భవిత విద్యా వనరుల కేంద్రాల ద్వారా ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. జిల్లాలో 64 భవిత కేంద్రాలుండగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 10,384 ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రబంద్పోర్టల్లో 1524 మంది బాలురు, 1283 మంది బాలికలను నమోదు చేశారు. 18 మంది ఫిజియో థెరపిస్టులు, 124 మంది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, 64 మంది ఆయాలు చిన్నారులకు సేవలందిస్తున్నారు. 21 రకాల వైకల్యాలతో బాధపడే చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పీచ్థెరపీ, సైకలాజికల్ థెరపీ, ఫిజియో థెరపీ సేవలందిస్తున్నారు. చిన్నారులకు, చిన్నారుల పర్యవేక్షకులకు అలవెన్స్ రూపంలో నగదును కూడా అందజేస్తుంది. వికలాంగుల చట్టం 2016 ఏం చెబుతుందంటే.. శారీరకంగా, మానసికంగా వైకల్యం కలిగిన వారిని దివ్యాంగులుగా పరిగణిస్తున్నారు. 2016 డిసెంబర్ 16న దేశంలో వికలాంగుల చట్టం (ఆర్పీడీ) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆత్మ గౌరవం, వ్యక్తి స్వేచ్ఛ, అవకాశాల పెంపు, సామాజిక భద్రత లక్ష్యంగా ఈ చట్టం రూపొందింది. ఏడు రకాల వైకల్యాలను మాత్రమే పరిగణించే పరిస్థితుల స్థానంలో ఆ సంఖ్యను 21కు పెంచారు. వికలాంగుల రిజర్వేషన్ శాతాన్ని మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు. వికలాంగులపై దాడి చేసినా, వివక్ష చూపినా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తారు. 50 శాతం రాయితీ బస్పాస్ల జారీ దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ చార్జీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ బస్పాస్లను జారీ చేస్తోంది. జిల్లాలో 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 24 వేల మందికి రాయితీ పాస్లను అందజేసింది. నూరు శాతం వైకల్యం కలిగిన దివ్యాంగుడితోపాటు వారి సహాయకుడికి కూడా 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించింది. దివ్యాంగుల సేవలో ఉమా మనోవికాస కేంద్రం అనంతకోటి జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది. అటువంటి జన్మకు సార్ధకత చేకూర్చుకునేందుకు ఒక్కక్కరూ ఒక్కో బాటను ఎంచుకుంటారు. అలా కాకినాడ రాయుడుపాలెంలోని ఉమామనో వికాస కేంద్రం నిర్వాహకులు దివ్యాంగులకు సేవ చేసే మార్గాని ఎంచుకుని తరిస్తున్నారు. పుట్టుకనే అంగవైకల్యంతో కొందరు, మానసికంగా ఎదలేని వారు కొందరూ జీవితాన్ని భారంగా మోస్తుంటారు. వారిని అక్కున చేర్చుకుని అవసరమైన ఆరోగ్య, విద్య, జీవనోపాధి, సాంఘిక, సాధికార విషయాలను నేర్పుతూ 33 ఏళ్లుగా ముందుకు సాగుతోంది. కాకినాడ రూరల్/యానాం: ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ(ఉమామనోవికాస కేంద్రం) తొలుత తొమ్మిది మందితో ప్రారంభమై నేడు 1500 మందికి విద్యనందిస్తోంది. మన జిల్లాతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో సేవలందిస్తోంది. యానాంలో సేవలు.. యానాంలోని జిక్రియనగర్లోని మానసిక వికలాంగ పిల్లల కోసం పదేళ్ల నుంచి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వారికి బుద్ధిమాంద్యం, సెరిబ్రల్ పాలసీ, వినికిడి, మాట సమస్య అభివృద్ధిలో ఆలస్యమైన వారికి ప్రత్యేక విద్య అందిస్తోంది. దీనిలో భాగంగా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, రోజువారీ పనులు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యం, విద్య తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్బేడీ సందర్శన ఈ ఏడాది ఫిబ్రవరిలో యానాంలోని ఉమా మనోవికాస కేంద్రాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న సేవలపై ఆ సొసైటీ డైరెక్టర్ ఎస్పీ రెడ్డిని అభినందించారు. ఆరుసార్లు జాతీయ పురస్కారాలు 33 ఏళ్లుగా దివ్యాంగ చిన్నారులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉమామనోవికాస కేంద్రానికి ఆరుసార్లు జాతీయ పురస్కారాలు లభించాయి. ఆ విధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం, ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవిడ్ నుంచి అనేక అవార్డులను సంస్థ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి అందుకున్నారు. ఏటా డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ డే ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పెర్సన్స్ (ప్రపంచ వికలాంగదినోత్సవం)ను సంస్థలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విభిన్నప్రతిభావంతుల అభివృద్ధికి కృషి విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సేవలను అందిస్తూ వారి అభివృద్ధి సేవలు అందించేందుకు ఉమామనో వికాస కేంద్రం 1988లో నెలకొల్పాం. తమ సంస్థ ద్వారా మానసిక వికలాంగుల(బుద్ధి మాంద్యత) ప్రత్యేక పాఠశాల, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు, స్టేట్ సెంటర్ ఫర్ డెఫ్ అండ్ బ్లైండ్, జిల్లా దివ్యాంగుల పునరావాసం, కృత్రిమ అవయవాల తయారీ, పంపిణీ యూనిట్, కృత్రిమ అవయవాల రిపేరు మొబైల్ వర్క్షాపు, ఘరోంద గ్రూపు హోమ్, సమాజ ఆధారిత పునరావాస కార్యక్రమం, ఇలా పలు కార్యక్రమాల చేపడుతున్నాం. – ఎస్పీ రెడ్డి, డైరెక్టర్, ఉమామనోవికాస కేంద్రం -
అయ్యా... నా వికలాంగ పింఛన్ పోయిందయ్యా
కష్టం: ఈ చిత్రంలో ఉన్న ఈ వికలాంగురాలిని చూడండి. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ఈమె శోకం వినండి...ఓ చెయ్యి వంకర తిరిగింది. దీనికి తోడు మ రో కాలు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. అద్దంకి మండలం రామాయపాలెం గ్రామానికి చెందిన గండు అంకమ్మ పుట్టుకతో వికలాంగురాలు. ఇదీ సాక్ష్యం:ఈమె వికలాంగురాలేనంటూ సదరమ్ క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం కూడా అందించారు. ఫలితం:ఆ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2014 సంవత్సరం వరకు ఈమె పింఛన్ తీసుకుంటూ వస్తోంది. ఈమె పింఛన్ కార్డు ఐడీ నంబరు 1298. శాపం: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పడిన ఈ మాయదారి ప్రభుత్వం అసలు నీవు వికలాంగురాలివే కాదంటోంది. రోదన:నా చెయ్యి, నా కాలు చూడండి... నేను వికలాంగురాలిని కాదా ... వృద్ధాప్యంలో నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు... నా ఉసురు ఊరికే పోదు...నాకు అన్యాయం చేస్తారా అంటూ కార్యాలయాల చుట్టూ ఈమె పాకుకుంటూ తిరుగుతోంది. అయ్యోపాపం: ఈ రోదన ... ఆవేదన చూసిన వాళ్లు మాత్రం ఇదేమి చిత్రమో... వైకల్యం కనిపించడం లేదా ఈ అధికారులకు? కళ్లుండీ గుడ్డిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, పాలకులు, అధికారులే నిజంగా అవిటివాళ్లంటూ ఛీత్కరించుకుంటున్నారు. వికలాంగులకు ఏదో చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇలాంటి వికలాంగుల గోడు పట్టించుకుంటే అదే పదివేలంటున్నారు ఈ తరహా బాధితులు. పరిశీలిస్తాం: ఈ వృద్ధురాలి వేదనను ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణమోహన్ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా అర్హతా పత్రాలు పరిశీలిస్తాం. పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. - అద్దంకి ఓ వైపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం వివిధ హామీలతో సందడి గా జిల్లాలో జరుపుకుంటుండగా ఇంకోవైపు అదే రోజు ఓ వికలాంగురాలి రోదన మిన్నంటింది. వైకల్యం ఉన్నా లేదన్న అధికారుల మాటకు తల్లడిల్లింది. మీటింగుల్లో మీ భరోసా సరే.. నాకేదీ ఆసరా అంటూ నిలదీసింది. -
బధిరుల జీవితాల్లో ‘ఆదిత్య’ వెలుగులు
నేటి నుంచి ‘డీ-వార్మింగ్’ = 5,62,268 మంది విద్యార్థులకు మాత్రలు = 32 కాంట్రాక్టు ఏఎన్ఎం పోస్టులకు 2369 దరఖాస్తులు! కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్లైన్ : జవహార్ బాల ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు, బడిబయట పిల్లలకు మంగళవారం నుంచి డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జే సరసిజాక్షి తెలిపారు. డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డీ-వార్మింగ్ కార్యక్రమంలో జిల్లాలోని 5,62,268 మంది విద్యార్థులకు మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఐదు నుంచి 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. సంవత్సరానికి రెండుసార్లు డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల విద్యార్థుల్లో నులిపురుగులు, నట్టలు, బద్దె పురుగులు తదితర క్రిముల వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. డీ-వార్మింగ్ (అల్బెండజోల్-400 మిల్లీగ్రాములు) మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం వేసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు చేతులు పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. విద్యాశాఖ, మాతా, శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల్లో పనిచేస్తున్న 20వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఏడుగురు జిల్లాస్థాయి అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించామని తెలిపారు. కాంట్రాక్టు ఏఎన్ఎం పోస్టులకు 2,369 దరఖాస్తులు ... ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎంలుగా పనిచేసేందుకు దరఖాస్తులు కోరామని, 32 పోస్టులకు గానూ సోమవారం నాటికి 2,369 దరఖాస్తులు అందాయని సరసిజాక్షి తెలిపారు. ఏఎన్ఎం పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రతిభ, రోష్టర్ పాయింట్ల ఆధారంగా జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన జాబితా జిల్లా కమిటీ అనుమతి పొందిన అనంతరం నియామకాలు జరుగుతాయని తెలిపారు. జబార్ కో-ఆర్డినేటరు డాక్టర్ రమేష్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వై.సుబ్రమణ్యం, డాక్టర్ ఎన్.రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.