breaking news
Working Long Hours
-
ఎనలేని పనిభారం.. జీవితం నిస్సారం
ఆధునిక జీవన శైలిలో దాదాపు అందరూ బిజీగా మారిపోయారు. రోజంతా క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉంటున్నారు. ఇలా దీర్ఘకాలంపాటు పనిచేయటం వల్ల చాలామంది ‘బర్న్ ఔట్’పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగ పరంగా తీవ్రంగా అలసిపోవటాన్నే బర్న్ ఔట్ అంటారు.దీనివల్ల పనిపై ఏకాగ్రత కోల్పోవడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఉత్పాదకత, పనితీరు తగ్గిపోతుంది. ఉద్యోగుల్లో ఈ బర్న్ఔట్ సమస్య ఇటీవల గణనీయంగా పెరిగిందని పలు సర్వేల్లో తేలింది. 50 శాతం కంటే ఎక్కువ మంది బర్న్ ఔట్ను ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం సాధించడంలో విఫలం కావడమే ఇందుకు కారణమని అంటున్నారు.⇒ తమ రోజువారీ జీవితంలో అత్యంత బిజీగా గడిపేవారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇష్టమైన పని అయినా మితిమీరి చేయడంతో బర్న్ ఔట్’కు గురవుతారు. దీనివల్ల ముఖ్యమైన బాధ్యతలపై పూర్తి దృష్టిని కేంద్రీకరించే పరిస్థితులు ఉండడం లేదు. కోపం, చిరాకు పరిపాటిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు తమను తాము ‘సెల్ఫ్ ఆడిట్’చేసుకుని పని భారాన్ని తగ్గించుకొనే విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి.సమస్యను అధిగమించడానికి సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ను సంప్రదించాలి. ఏదైనా క్రీడలో పాల్గొనడం, వీకెండ్స్లో మిత్రులతో గడపడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటి ఏదో ఒక కొత్త హాబీని అలవరుచుకుని ఒత్తిడిని అధిగమించి ‘బర్న్ ఔట్’కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. – సి.వీరేందర్, సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్వివిధ సంస్థల సర్వేల్లో తేలిన అంశాలు⇒ ఫోర్బ్స్ పరిశీలన ప్రకారం 66 శాతం మంది కారి్మకులు బర్న్ ఔట్కు గురవుతున్నారు. మరొక నివేదిక ప్రకారం అమెరికాలోని 44 శాతం ఉద్యోగులు బర్న్ ఔట్కు గురవుతున్నారు. దీనివల్ల విధులకు గైర్హాజరు పెరుగుతోంది. వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయడంతో పాటు శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ పేర్కొంది. ⇒ ఇటీవల ఇండియా టుడేలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చాలా మంది ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయాల్సి రావటం, చేస్తున్న పనులకు సరైన గుర్తింపు లేకపోవడం, ఉన్నతాధికారుల నుంచి తగిన మద్దతు లభించకపోవడం వంటివి బర్న్ ఔట్కు ప్రధాన కారణాలుగా తేలింది. ‘నిరంతరం బిజీగా ఉండాలనే ఒత్తిడి, తరచుగా అంచనాలు అందుకోలేకపోవడంతో ఒత్తిడి, అలసటకు గురవుతున్నారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం చూపి ఉత్పాదకత, పనితీరు తగ్గడానికి దారితీస్తోంది’అని ద ఎకనామిక్ టైమ్స్ సర్వే పేర్కొంది. ⇒ దాదాపు 52 శాతం మంది ఉద్యోగులు వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక బర్న్ ఔట్కు గురవుతున్నట్టు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో న్యూయార్క్కు చెందిన వెర్టెక్స్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితి నుంచి ఉద్యోగులను బయటపడేయాలంటే వారాంతాల్లో వారితో ఎక్కువ గంటలు పనిచేయించడం మానేయాలని సూచించింది. సంస్థల పురోగతికి ఉద్యోగుల ‘మెంటల్ వెల్ బీయింగ్’ఎంతో ముఖ్యమని పేర్కొంది. ⇒ ఉద్యోగులు బిజీగా ఉండటం వల్ల నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నిర్లక్ష్యానికి గురవుతాయి. ఇవన్నీ శారీరక, మానసిక అంశాలపై దు్రష్పభావం చూపిస్తాయి అని హోప్ ట్రస్ట్ తన అధ్యయనంలో పేర్కొంది. ⇒ పై అధ్యయనాలకు భిన్నంగా జనరేషన్ జెడ్గా పిలుస్తున్న (1997–2012 మధ్యలో పుట్టినవారు) వారు తమ చుట్టూ జరుగుతున్న మార్పులను నిశితంగా గమనిస్తూ, పనిప్రదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తూ వర్క్–లైఫ్ బ్యాలెన్స్తో పాటు తాము కోరుకున్న విలువలకు అనుగుణంగా జీవన శైలి, కెరీర్లను ఎంచుకుంటున్నట్టు డెలాయిట్ 2024 జెన్ జెడ్ అండ్ మిలీనియల్ సర్వే పేర్కొంది. -
భార్యాభర్తలు ఎక్కువ టైం పనిచేస్తే తిప్పలేనట!
ఉద్యోగం చేసే భార్యాభర్తలు దీర్ఘకాలం పనిచేస్తే వారి మధ్య సంబంధాలు అంత మెరుగ్గా ఉండవట. దంపతుల మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతలు క్రమేపీ తగ్గుతాయని జీవితం యాంత్రికంగా మారుతుందని ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. సర్వే వివరాలను ఫోర్బ్స్ రిపోర్ట్ చేసింది. ఆరు నెలలపాటు ఉద్యోగాలు చేస్తున్న 285 మంది జంటలపై సర్వే నిర్వహించారు. పని గంటలు మరీ ఎక్కువయ్యే కొద్ది ఆయా ఉద్యోగుల ఎనర్జీ బాగా తగ్గిపోయి, ఆ తర్వాత భాగస్వామితో సమయాన్ని వెచ్చించలేకపోతున్నామని ఒప్పుకున్నారు. ఉదయం లేవడంతోనే ఉరుకులు పరుగులతో వారు తమ రోజులు నెట్టుకొట్టుస్తున్నామని, కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు తమ గోడు వెల్లబోసుకున్నారట. రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములతో హాయిగా సమయాన్ని గడపలేకపోతున్నట్లు వారు కూడా గుర్తించినా ఏం చేయలేకపోతున్నారు. అలా కాకుండా భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను(సంతోషం, బాధ మొదలైనవి) షేర్ చేసుకుంటుంటే వారి మధ్య అన్యోన్యత, ప్రేమ పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయట. దీర్ఘకాలిక ఆఫీస్ టైమింగ్స్, వ్యాపారం కోసం ఎక్కువగా టైం కేటాయించడంతో ఏర్పడిన టెన్షన్, ఒత్తిడి మన నుంచి కాస్తయిన తొలగిపోయి రిలాక్స్ అవుతారు. రెండు సగం గ్లాసులు కలిస్తేనే పూర్తి గ్లాస్ నిండుతుందిగానీ, రెండు అర్ధసగాలు విడివిడిగా ఉన్నంతకాలం జీవితం కూడా సగంగానే మిగిలిపోతుందట. లక్ష్యాలు, సంపాదన అంటూ ఎన్నో ఉన్నప్పటికీ వాటిని రోజులో కాస్త సమయమైనా మూలన పడేయాలని సర్వే వివరాలను గమనిస్తే తెలిసిపోతుంది.