13న పెయిడ్ హాలిడే
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 13న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి చంద్రవదన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
షిఫ్టు పద్ధతిన నడిచే సంస్థల్లో పనిచేసే కార్మికులకు పోలింగ్ సమయంలో మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్ను, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను ఆదేశించారు.