-
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెన్నై: ఆసియా ఆన్లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడ్గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్పై... ఎనిమిదో మ్యాచ్లో 2.5–1.5తో కజికిస్తాన్పై... తొమ్మిదో మ్యాచ్లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్తో జరిగిన మ్యాచ్లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్లో కిర్గిస్తాన్తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి. -
భారత్కు మూడో విజయం
సఖద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్షిప్లో భారత జట్టు మూడో విజ యాన్ని సాధించింది. క్యూ బాతో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్లో భారత్ 2.5-1.5 పాయింట్ల తేడాతో గెలిచింది. డొమింగెజ్తో హరికృష్ణ 27 ఎత్తుల్లో; బ్రుజోన్ బాటిస్తో సేతురామన్ 53 ఎత్తుల్లో; పెరెజ్తో శశికిరణ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెనాల్డో స్యురెజ్పై విదిత్ సంతోష్ గుజరాతి 41 ఎత్తుల్లో గెలిచి భారత్కు విజయాన్ని ఖాయం చేశాడు. మహిళల జట్టుకు మూడో ఓటమి మరోవైపు చైనాలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్షిప్లో భారత జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. జార్జియా జట్టుతోఆదివారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక... మహారాష్ట్ర అమ్మాయి సౌమ్య స్వామినాథన్ తమ గేమ్లను ‘డ్రా’ చేసుకోగా... ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ ఓడిపోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. హంపి, బేలా ఖోతెనాష్విలి గేమ్ 40 ఎత్తుల్లో; హారిక, లెలా జవఖిష్విలి గేమ్ 80 ఎత్తుల్లో; సౌమ్య, సలోమి మెలియా గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. పద్మిని రౌత్ 41 ఎత్తుల్లో మేరీ అరాబిద్జె చేతిలో పరాజయం పాలైంది. ఏడో రౌండ్ తర్వాత భారత్ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. సోమవారం జరిగే ఎనిమిదో రౌండ్లో పోలండ్తో టీమిండియా తలపడుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement