breaking news
Womans body
-
మహిళ దారుణ హత్య
దుండగులు ఓ గుర్తుతెలియని మహిళ ను దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. హత్య అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నాలుగైదు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మండల పరిధిలోని తిమ్మాయిపల్లి అనుబంధ బండమీదిపల్లి శివారులో బుధవారం వెలుగు చూసింది. - తల నరికేసిన దుండగులు - మృతదేహాన్ని కాల్చివేసిన వైనం - డాగ్స్క్వాడ్తో వివరాలు సేకరించిన సీఐ శివశంకర్ - యాలాల మండలం బండమీదిపల్లి శివారులో ఘటన యాలాల: స్థానికులు, తాండూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండమీదిపల్లి గ్రామ శివారులోని ర్యాలబండ గుట్టలో ఉన్న లోయ ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయి తల లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించారు. గ్రామ సర్పంచ్తో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. తాండూరు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో హత్యకు జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు పరిసరాలను పరిశీలించగా సమీపంలోని పొదల్లో మహిళకు సంబంధించిన తల కనిపించింది. దుండగులు హత్య అనంతరం మృతదేహంపై పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహం సగం కాలిపోయింది. హతురాలి కుడి చేతిపై పచ్చబొట్టు ఉంది. చేతులకు రోల్డ్గోల్డ్ గాజులు ఉన్నాయి. సంఘటన స్థలానికి సమీపంలో మృతురాలికి చెందినవిగా భావిస్తున్న చెప్పులు, ఇంటికి సంబంధించిన తాళాలు పడి ఉన్నాయి. హతురాలిని గుర్తించే వీలులేకుండా పోయింది. మహిళకు తెలిసిన వారే ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. అనంతరం జాగిలాలతో వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా బండమీదిపల్లి శివారులో మహిళను దుండగులు దారుణంగా హత్య చేయడంతో గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ వీఆర్వో పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ పేర్కొన్నారు. -
కమ్మనపల్లెలో టెన్షన్..టెన్షన్
పలమనేరు: పలమనేరు నియోజకవర్గం బెరైడ్డిపల్లె మండలం కమ్మనపల్లెలో ఆదివారం టెన్షన్ నెలకొంది. కమ్మనపల్లెకు చెందిన ఓ అదృశ్యమైన వివాహిత కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ వద్ద శవమై బయటపడిందంటూ పుకార్లు వినిపించాయి. దానికితోడు గంగవరం పోలీసులు ఆ ప్రాంతంలో అన్వేషణ జరపడం, ఇందుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలను బలపరిచాయి. అదృశ్యమైన వివాహిత ఏమైందనే సమాచారం తెలియనప్పటికీ కమ్మనపల్లె పంచాయతీలోని అన్ని గ్రామాల్లో దీని గురించే చర్చ జరిగింది. కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరేపల్లెకు చెందిన శిల్పతో వారి బంధువైన కీలతొరిడి గ్రామానికి చెందిన కుమార్రాజాకు పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. ఈ సాకుతో అత్తమామలు వేధిస్తున్నారని, ఇందుకు భర్త సహకరిస్తున్నాడని బాధితురాలు గతంలో పలమనేరు కోర్టులో కేసు వేసింది. విచారణ జరుగుతుండగానే కమ్మనపల్లెకు చెందిన కొందరు తాము కేసును రాజీ చేస్తామంటూ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత కోర్టుకు హాజరైన శిల్ప అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ సమీపంలో గల ఓ చెరువులో పూడ్చి పెట్టిన ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడిందనే విషయం దావానలంలా వ్యాపించింది. దుస్తులు దాదాపు అలాగే ఉండడంతో ఆ మృతదేహం శిల్పాదేనని కుటుంబ సభ్యులు అనుమానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికెళ్లి కర్ణాటక పోలీసులతో చర్చించారు. భర్త కుమార్రాజాను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కమ్మనపల్లెకు చెందిన ప్రస్తుత సర్పంచ్ కుమారుడు, మాజీ సర్పంచ్తో పాటు మరికొంధరిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డిని వివరణ కోరగా శిల్ప అదృశ్యమైందని తమకు గతంలో ఫిర్యాదు వచ్చిందని, ముల్బాగల్ ప్రాంతం లో వెలుగు చూసిన మహిళ శవం ఆమెదేనా అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని తెలిపారు. వివరాలు తెలిశాక సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు.