breaking news
water rights
-
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం బిట్కాయిన్, షేర్లు, చమురు, రిటైర్మెంట్ ఫండ్లపై ఉండగా, అసలు భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం ‘నీరు (Water Rights)’ అని ప్రముఖ ఆర్థిక రచయిత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత ‘రాబర్ట్ కియోసాకి’ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్టులో నీటి హక్కుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణను పంచుకున్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి పెట్టారని తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రముఖ ఇన్వెస్టర్ ‘మైఖేల్ బర్రీ’ ఎన్నో సంవత్సరాలుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే అమెరికాలో 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉన్న బిల్ గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదని, ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ‘చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్’ వాషింగ్టన్ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా నీటి హక్కులేనని చెప్పారు.నీరు లేని భూమికి విలువే లేదు"నీరు లేని భూమి తక్కువ విలువైనది కాదు... పూర్తిగా విలువలేనిది" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని మంచినీటిలో సుమారు 70 శాతం వ్యవసాయానికే వినియోగిస్తుండగా, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, పెరుగుతున్న జనాభా, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతకు దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో ఈ సమస్య ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.నీటినీ ట్రేడ్ చేస్తున్న వాల్ స్ట్రీట్కియోసాకి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సీఎంఈ గ్రూప్ ఇప్పటికే వాటర్ ఫ్యూచర్స్ మార్కెట్ను ప్రారంభించింది. అంటే చమురు మాదిరిగానే నీటిని కూడా ఆర్థిక మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంటే దానికి సంబంధించిన నీటి హక్కులకే ఎక్కువ విలువ ఉందని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, కొంతకాలం రైతులకు లీజుకు ఇచ్చి, అనంతరం ఆ నీటి హక్కులను నగరాలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని వివరించారు.ధనవంతుల పెట్టుబడుల వ్యూహం ఇదే!మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, సాధారణ పెట్టుబడుల్లో డబ్బు పెడుతుంటే, ధనవంతులు మాత్రం భూమితో పాటు దానికి సంబంధించిన నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నీటి కొరత పెరిగే కొద్దీ ఆ హక్కుల విలువ మరింత పెరుగుతుందని, తర్వాత వాటిని నగరాలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీ లాభాలు పొందుతున్నారని చెప్పారు.తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన ఒక ముఖ్యమైన సూత్రాన్ని కూడా కియోసాకి గుర్తుచేశారు. "ఏది లేకుండా ప్రపంచం జీవించలేదదో అలాంటి ఆస్తిని కొనుగోలు చేయి" అని తన గురువు చెప్పారని పేర్కొన్నారు. గత 100 సంవత్సరాల్లో ఆ ఆస్తి చమురైతే, రాబోయే 100 సంవత్సరాల్లో అది ‘నీరు’ అవుతుందని తన ఫేస్బుక్ పోస్టులో కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. -
వాటికోసం జయ పట్టువిడవని పోరాటం
కర్ణాటక, తమిళనాడులకు రావణకాష్టలా ఉన్న కావేరి నీళ్ల వివాదంపై జయలలిత అలుపెరగని పోరాటం చేశారు. ఆమె అధికారంలో ఉన్నా, లేకపోయినా ఈ సమస్యపై పోరాడుతూనే ఉన్నారు. కావేరీ నది నుంచి కర్ణాటక నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయలలిత రెండు సార్లు నిరాహార దీక్షకు దిగారు. గత 35 ఏళ్లుగా కావేరీ నదీ జలాలపై ఆమె ఏన్నాడూ తన పట్టువిడవలేదు. వందేళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై తమిళనాడుకు దక్కాల్సిన వాటా రాష్ట్రానికి దక్కాల్సిందేనని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 1993లో అయితే హఠాత్తుగా ఆమె నాలుగురోజులు నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా 1998లో కావేరీ రివర్ అథారిటీ కూడా ఏర్పాటైంది. ప్రధానమంత్రి చైర్పర్సన్గా, కావేరీ బేసిన స్టేట్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ అథారిటీ 2002 ఆగస్టులో ఏర్పాటుచేసిన మీటింగ్లో తమిళనాడుకు అన్యాయంగా నిర్ణయం వస్తుందని తెలిసి ఆమె ఆ మీటింగ్ నుంచే వాకౌట్ చేశారు. 1991 కాలంలో కూడా ఈ వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు యుద్ధానికే దిగే ఛాయలు నెలకొన్నాయి. ఆ సమయంలో తమిళనాడు సీఎంగా జయలలిత పదవిలో ఉన్నారు. కర్ణాటక ఏటా 205 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదలచేయాలని ట్రైబ్యూనల్ ఆదేశించింది, కానీ ట్రైబ్యునల్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీచేసింది. ఫలితంగా హింసాత్మక ఘటనలే చోటుచేసుకున్నాయి. పదవిలో ఉన్న జయలలిత ప్రభుత్వం ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కర్ణాటక నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం ఆ ఆర్డినెన్స్ను రద్దుచేసింది. కోర్టు నిర్ణయాన్ని పాటించాలని ఆదేశించింది. కానీ ఆ నిర్ణయాన్ని కూడా కర్ణాటక బేఖారతు చేసింది. ఇటు కేంద్రం, అటు కర్ణాటక ప్రభుత్వాలు నదీ జలాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జయలలిత ఇరు ప్రభుత్వాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో హోంమంత్రి హాజరుకాబోయే పలు కార్యక్రమాల నుంచి తన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేయాలని ఆదేశించారు. కేంద్రం తమకు సపోర్టు ఇచ్చే వరకు తాము తగ్గేది లేదని పేర్కొన్నారు. 1993లో ఆమె చేసిన దీక్షకు దిగొచ్చిన కేంద్రం 1998లో కావేరి వాటర్ అథారిటీని నియమించనున్నట్టు హామీ ఇచ్చింది. దీంతో ఆమె దీక్ష విరమించారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో ట్రైబ్యునల్ మళ్లీ తుది తీర్పును వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వుల్ని గెజిట్ లో పొందుపరచలేదు. దీంతో గెజిట్లో ఈ ఆర్డర్ను పబ్లిష్ చేసేలా చూడటమే తనకు ముఖ్యమైన విషయమని 2011 ఎన్నికల్లో గెలిచిన జయలలిత రైతులకు వాగ్దానం చేశారు. చివరకు 2013లో కేంద్రం ట్రైబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేసింది. జయ జన్మదినానికినాలుగు రోజుల ముందే ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేస్తున్నట్టు సుప్రీం ప్రకటించడంతో తన బర్త్డే గిప్ట్గా దీన్ని ప్రకటించారు. అయినా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొలిక్కిరాలేదు. ట్రైబ్యునల్ ఉత్తర్వుల మేరకు కర్ణాటక తమిళనాడుకు నీటిని విడుదల చేయకపోవడం, కర్ణాటక విడుదల చేసిన నీరు చాలవని తమిళనాడు కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది. -
‘కేటాయింపుల మేరకు వినియోగించుకుంటాం’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ర్ట నీటి హక్కులు కేటాయింపుల మేరకు పూర్తిగా వినియోగించుకుంటామని అటవీ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోటీపడుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.


