వోల్వో బస్సు బోల్తా: ప్రయాణికులకు గాయాలు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవలో వోల్వో బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు రాజాపులోవలో బోల్తా పడింది. ఆ ఘటనలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు.
అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.