virasam
-
‘ఇంగ్లీష్ మీడియం.. మీ పిల్లలకేనా?..మా పిల్లలకొద్దా?’
విశాఖపట్నం, సాక్షి: తెలుగు వికాసం ముసుగులో బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా? అని విదసం ఐక్య వేదిక ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటూ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు మహా సభలు తీర్మానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం రద్దును మేము ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వేదిక మీద మాట్లాడిన వారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు?. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా?.. మా పిల్లల మాత్రం మీ దొడ్లుల్లో పశువులు కాయలా.. అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా?.. .. తెలుగు మహా సభల వేదిక మీద ఉన్నవారు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా మాట్లాడారు. వేదికపై ఒకరు కూడా బడుగు బలహీను వర్గాలకు చెందిన వారు లేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే!. అందుకే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ప్రపంచీకరణలో ఉద్యోగాల రావాలంటే ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కి వచ్చిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు రాక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక నష్టపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని విదసం ఐక్య వేదిక పేర్కొంది. -
మావోయిస్టులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసం సహా 16 అనుబంధ సంఘాలపైనా వేటు వేసింది. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 ప్రకారం వీటిపై మరో ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. అనుంబంధ సంఘాలివే.. తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డీఎస్యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఏఎస్యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్ఎస్), తుడుందెబ్బ (టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం), తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్ఏహెచ్ఎఫ్వో), సివిల్ లి బర్టీస్ కమిటీ (సీఎల్సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), విప్లవ రచయితల సంఘం (విరసం).. ఈ 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ.. చదవండి: తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్ -
వరవరరావుకు కరోనా పాజిటివ్
-
వరవరరావుకు కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై : ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. (జైలులోనే చంపుతారా?) దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును బెయిల్పై విడుదల చేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన విడుదలను కోరుతూ మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సైతం వామపక్ష పార్టీలు లేఖలు రాశాయి. కనీసం ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించాలని ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు) -
వరవరరావుకు అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్ స్టేషన్కు అందించినట్టు పుణె పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వరవరరావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడైన తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తప్పుడు అభియోగాలతో తమ తండ్రిని జైల్లో వేశారని వాపోయారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వారు పేర్కొన్నారు. (చదవండి: జీవించే హక్కు వీరికి లేదా?) -
ప్రొఫెసర్ ఖాసీం అరెస్టు.. గజ్వేల్కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓయూలోని క్వార్టర్స్లో ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. అయితే, ప్రొఫెసర్ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు. నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. -
మతంపై యుద్ధం చేయాల్సిన దుస్థితి
సాక్షి, సుందరయ్య విజ్ఞానకేంద్రం: దేశంలో పరిస్థితులను చూస్తుంటే మతంపై యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం సభ్యుడు నాళేశ్వరం శంకరం అన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) ఏర్పడి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజ లకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రజలకు మాట్లాడే హక్కు లేకపోవటం బాధాకరమన్నారు. చివరకు దేశంలో పౌరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక ధిక్కార స్వరాలు వెల్లువెత్తటానికి విరసం కూడా కారణమన్నారు. వ్యవస్థ మార్పుతోపాటు పితృస్వామ్యం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన చైతన్యాలు తెలుగు సాహిత్య రంగాన్ని ప్రభావితం చేశాయన్నారు. తెలంగాణ సాహితి ప్రతినిధి భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక కవులు, రచయితలపై దాడులు పెరిగాయని అన్నారు.విరసం సభ్యుడు చంద్రయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయితలు పీసీ రాములు, సంగిశెట్టి శ్రీనివాస్, తైదల అంజయ్య, కె.శివారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, శిఖామణి, కొండేపూడి నిర్మల, వేంపల్లి షరీఫ్, ప్రొఫెసర్ కాశీం, రివేరా తదితరులు పాల్గొన్నారు. విరసం రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎన్నిక విరసం రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా అరసవెల్లి కృష్ణ, కార్యదర్శిగా ప్రొఫెసర్ కాశీం, ఉపాధ్యక్షునిగా బాసిత్, సహాయ కార్యదర్శిగా రివేరా, కార్యవర్గ సభ్యులుగా పాణి, వరలక్ష్మి, ఉజ్వల్, రాంకి, రాము, చిన్నయ్య తదితరులు ఎన్నికయ్యారు. -
విరసం మా ఊపిరి
విశాఖలో 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీకి జరిగిన సన్మానానికి నాలుగు చెరగులనుంచీ సాహిత్యాభిమానులు తరలివచ్చారు. విశాఖ విద్యార్థులు ‘రచయితలారా! మీరెటువైపు!’ అని సవాల్ విసిరారు. రచయితల్లో కలకలం బయలుదేరింది. తామెటువైపో తేల్చుకోవలసి వచ్చింది. సాయంత్రం ఆర్వీఎస్, పురిపండా, కారా, కేవీఆర్, పురాణం, వరవరరావు, జ్వాలా ముఖి, లోచన్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మొదలైన ప్రముఖ రచయితలూ, కవులూ విశాఖలోని చౌల్ట్రీ నుంచీ స్టేడియం దాకా ఊరేగింపుగా నడిచారు. రచయితలు ఊరేగింపుగా రావడం ఇదే తొలిసారి అన్నారు పురిపండా అప్పలస్వామిగారు. దిగంబర కవులూ, తిరగబడు కవులూ, మరెందరో తమ రచనలు వినిపించారు. లోచన్ ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో’ అంటూ ‘శిశూ! పిడికిలి బిగించి ఈ లోకంమీద యుద్ధం ప్రకటిస్తున్నావా?’ అంటూ పొత్తి ళ్లలో బిడ్డని ఆహ్వానించాడు. అయిదు నెలల తర్వాత 1970 జూలై 4న హైదరాబాద్లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. విడివిడిగా చిన్న సమూహాలుగా ఉన్న అనేకమంది కవులు విరసంలోకి వచ్చారు. ‘నిజం చెప్పాలంటే విరసం ఆవిర్భావానికి ఏకైక చోదక శక్తి నక్సలైట్ ఉద్యమం... విప్లవాగ్నుల లోంచి విరసం ప్రభవించడం నేను కళ్లారా చూశాను’ అన్నాడు శ్రీశ్రీ. విరసం పుట్టి వారం తిరక్కుండానే శ్రీకాకుళోద్యమ నాయకులు వెంపటాపు సత్యం, కైలా సాల్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది (జూలై 10). ఒక కేసులో రైతు నాయకులు కిష్టా గౌడ్, భూమయ్యలకి ఉరిశిక్ష విధించింది కోర్టు. ప్రజాందోళనతో రెండుసార్లు ఉరి ఆగింది. పౌరహక్కుల సంఘం తరఫున పత్తిపాటి వెంకటేశ్వర్లు ఈ విషయంలో నిర్వహించిన పాత్ర అమోఘం. పిరికి ప్రభుత్వం ఎమర్జెన్సీ చీకటిమాటున వాళ్లిద్దర్నీ ఉరి తీసింది (డిసెంబరు 1975). పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వికృత రూపం ధరించడంతో, ఎన్నికల వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు రాజకీయాల్లో ముందుకొచ్చాయి. ఆ పోరాటాల ప్రేరణతో రచయితలంతా ఉత్సాహంగా విరసంలో చేరారు. కవిత, కథ, నవల, విమర్శ, పాట సహా అన్ని సాహిత్య ప్రక్రియల్లో విరసం విస్తృత కృషి చేసింది. రచయితలంతా తమ రచనలతో ప్రజలపక్షం వహించారు. విరసం ప్రేరణతో వందలాదిమంది పోరాట యోధులు తయారయ్యారు. అలాంటి సంస్థకి 2004–2006 మధ్య కార్యదర్శిగా ఉన్నాను. 2001–2007 మధ్య అరుణతారకి సంపాదకత్వం వహించాను. పెరుగుతున్న ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలను అణచివేసే ప్రయత్నంలో భాగంగా విరసంపై నిషేధం విధిం చిన సందర్భంలో నగరంలో పెద్దల్ని (జస్టిస్ చిన్నపరెడ్డిసహా) కలిసి పరిస్థితులు వివరించాం. అప్పుడు నేను విరసం కార్యదర్శిని. ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మాది రాజకీయ పార్టీ కాదనీ సాహిత్య, సాంస్కృతిక సంఘమేననీ, ఇలాంటి సంఘాన్ని నిషేధించడం అన్యాయమనీ త్రిసభ్య కమిటీకి నివేదించాం. ‘నిషేధిస్తే నష్టమేమిటని’ త్రిసభ్య కమిటీ మెంబర్ టీఎల్ఎన్ రెడ్డి అడిగాడు. ‘మీ అబ్బాయిని మూడు గంటలు చీకటి కొట్లో నిర్బంధించి, ఆ తర్వాత అభిప్రాయాన్ని సేకరించండి తెలుస్తుంది’ అన్నాం. మూడు నెలల తర్వాత నిషేధం ఎత్తేయవలసి వచ్చింది. విరసం మా ఊపిరి. తప్పులూ, ఒప్పులూ, నిర్బంధాలూ, విజయాలూ ఎదురయ్యే దారిలోనే విరసం ప్రయాణం సాగుతోంది. విరసం ఆవిర్భావంలో ఎందరో కొత్త రచయితలకి ఊపిరులూది, పీడిత ప్రజల పక్షపాతిగా నిలిచిన విరసంతో నా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాల్లో, చరిత్రని విశ్లేషించుకుంటూ, ఇంకా చేయవలసిన పనులని పురమాయిస్తూ, విప్లవానికి పునరంకితమవుతూ విరసం ముందుకు సాగవలసిన తరుణం ఏర్పడింది. అమరులైన విప్లవ రచయితలందరి స్ఫూర్తితో విరసం మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కృష్ణాబాయి వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యురాలు (హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు, రేపు విరసం మహాసభలు) -
ఒక మిత్ర విమర్శ
స్త్రీవాదంతో విరసానికి పూర్తిస్థాయి ఏకీభావం ఉండే ఆస్కారం లేనట్లే స్త్రీవాదానికి కూడా ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావో ఆలోచనా విధానం’తో పూర్తిస్థాయి ఏకీభావం ఉండే అవకాశం లేదు. ఇవి విడివిడి సైద్ధాంతిక అవగాహనలుగా ఉనికిలో ఉన్నాయీ అంటేనే వాటి లక్ష్యంలోనో ఆచరణలోనో భిన్నత్వం ఉన్నట్లు. ఒకదాన్ని మరొకటి పూర్తిగా ఒప్పేసుకుంటే రెండో అవగాహన అవసరమే లేనట్లు. ఈ రెండు భావజాలాల ఐక్యత, ఘర్షణలను పరిశీలించడానికి విరసం యాభై ఏళ్ల ప్రయాణం ఒక సందర్భం. స్త్రీల సమస్యలకి విడిగా సైద్ధాంతిక స్థాయి ఇచ్చి ఉండకపోవచ్చు, సూక్ష్మస్థాయి అవగాహన లేకపోవచ్చు. కానీ స్త్రీలకి కుటుంబ, సామాజిక చైతన్యాన్ని సమకూర్చిపెట్టడంలో విరసం, ఇతర కమ్యూనిస్టు పార్టీల దోహదం గొప్పది. తొలితరం స్త్రీవాదుల్లో చాలామందికి, మార్క్సిస్ట్ నేపథ్యం, విరసంతో అనుబంధం ఉన్నాయి. స్త్రీలకి అదనంగా ఉండే పునరుత్పత్తి బాధ్యతలని, నిర్మాణాల్లో ఉండే పితృస్వామ్యం వంటి అంశాలను ప్రశ్నిస్తూ స్త్రీవాదం రాగానే ఘర్షణ ఏర్పడింది. విప్లవోద్యమాన్ని డైల్యూట్ చేయడానికి వచ్చిన పెట్టుబడిదారీ కుట్రగా స్త్రీవాదం విమర్శకి గురయింది. ఓల్గా వంటి స్త్రీవాదులు, మార్క్సిస్టులైన కాత్యాయనీ విద్మహే, విరసం రత్నమాల, విమల వంటివారు భిన్న ప్రక్రియల ద్వారా సమాజంలో, విప్లవ పార్టీల్లో, సంఘాల్లో ఉన్న పితృస్వామ్యాన్ని చర్చకి పెట్టారు. స్త్రీవాదం పట్ల విరసం దృష్టికోణాన్ని 1992లో ఒక ఇంటర్వ్యూలో వివి స్పష్టంగా మాట్లాడారు. స్త్రీవాదం స్త్రీలలో తెచ్చే చైతన్యం సమస్త మానవ శ్రమ విముక్తికీ అంతిమంగా మేలు చేసేదేనని స్పష్టమయ్యాక స్త్రీవాదపు పరిమితులు కూడా మిత్ర విమర్శగా చర్చలోకి వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల సంక్లిష్ట ఘటనల్లో విరసం– అనవసర జోక్యపు తడబాటుకి లోనవడమూ వాస్తవమే. విరసం వ్యవస్థాపక సభ్యులు ఒకరు అటువంటి తప్పుని ఒప్పుకోవడమూ గమనించాలి. విరసం ఏర్పాటులో భాగమైన శ్రీశ్రీ, రావిశాస్త్రిలాంటి పీడిత పక్షపాత రచయితలు కూడా ‘స్త్రీ హితం’ కాని భాషని వాడారు. ఇప్పటి విరసం వాటిని అధిగమించింది. సంస్థ వ్యక్తీకరణ పద్ధతుల మీద స్త్రీవాద ప్రభావం కూడా ఉంది. ఆధిపత్య కులం, మతం, ప్రాంతం, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ – తమ కక్ష సాధింపుకి స్త్రీల లైంగికత మీద దాడులు చేయడం పరిపాటి అయిపోయిన వర్తమానంలో ఉన్నాం. స్త్రీలు, క్రూరమైన అమానవీయమైన హింసకి గురైనపుడు అక్కున చేర్చుకునే విరసం, లైంగిక వ్యక్తిత్వాల ఎదుగుదలకి జీవితంతో అనేక ప్రయోగాలు చేస్తున్న ఆధునిక మహిళల హక్కులపట్ల ఇదేస్థాయి సహనంతో ఉంటోందా? సైద్ధాంతికంగా ఒప్పుదల ఉన్నప్పటికీ ఆచరణలో నైతికమైన అవరోధాలను దాటలేకపోతోందా? అన్నది పరిశీలించాలి. యాభై ఏళ్లకాలంలో సంస్థ లోపల ఎంతమంది స్త్రీలు నిర్ణాయక స్థానాల్లోకి రాగలిగారన్నది మరొక ప్రశ్న. విప్లవ నిర్మాణాల్లోనూ స్త్రీల ప్రాతినిధ్యం రెండవ తరగతిగానే ఉండడం నిరాశని కలిగిస్తుంది. చైతన్యపు స్థాయి ప్రాతిపదిక అయితే అటువంటి చైతన్యాన్ని పెంచడం కోసం నిర్మాణాలు తమ పనివిధానాలని సమీక్షించుకోవడానికి విరసం నమూనాగా ఉండాలన్న ఆకాంక్ష సహజం. గలగలా పారే తేటనీటి అడుగున చిన్నచిన్న గులకరాళ్ళు కూడా స్పష్టంగా కనపడతాయి. వాటినే ఏరుకుని ప్రవాహాన్ని మరిచి పోవడమంటే అర్ధశతాబ్ది సూరీడుకి అరచేతిని అడ్డుపెట్టినట్లే. సాంస్కృతిక రంగంలో ఇటువంటి ఒక సంస్థ ఇచ్చే భరోసా– మొత్తం సమాజపు గమనంలో కూడా అత్యంత విలువైనది. - కె.ఎన్.మల్లీశ్వరి -
విరసం గురించి మరోసారి
విరసం ఏభై ఏళ్ళ మహాసభల సందర్భంగా, విరసం గురించి నా అభిప్రాయం అడిగారు మీరు. నేను విరసం మీద, గతంలోనే చాలాసార్లు రాశాను. విరసం మీద, నా గత అభిప్రాయాల్ని మార్చుకోవడానికి, విరసంలో ఈనాటికీ కొత్త మార్పులేవీ లేవు. విరసంతో నాకు భిన్నాభిప్రాయాలు వున్నా, 1985లో, వరంగల్లో విరసం మీటింగులో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడాను. 1990ల చివర్లో, విరసం వారి సిటీ యూనిట్ నడిపిన ‘అవగాహనా తరగతి’లో, మార్క్స్ ‘కాపిటల్’లో వున్న విషయాల క్రమం గురించి మాట్లాడాను. 2005లో, విరసాన్ని ప్రభుత్వం నిషేధించినప్పుడు, ఆ నిషేధాన్ని వ్యతిరేకించే, నిరసన పత్రం మీద సంతకం చేశాను. ‘విరసం’ వారు, తమ ప్రణాళికలో ‘మార్క్సియన్ సోషలిజమే’ తమ ధ్యేయంగా ప్రకటించుకున్నారు. కానీ, ఆ అవగాహన, ఆ సంఘం ప్రవర్తనలో, గడిచిన 50 ఏళ్ళల్లో ఎక్కడా కనపడలేదు నాకు. విరసంలో, ప్రారంభంలో, నాయకులుగా ఆసనాలు ఎక్కిన వాళ్ళల్లో కొందరిలో, బహుభార్యత్వం, బహిరంగ వ్యభిచారం, తాగుబోతుతనం, జంధ్యం వేసుకోవడం, దయ్యాల్నీ– భూతాల్నీ– మంత్రాల్నీ– అతీత శక్తుల్నీ సైన్సులుగా చెప్పడం– వంటి లక్షణాలు కనిపించాయి. విరసం సభ్యులు, అలాంటి నాయకుల్ని ఎందుకు ఎంచుకున్నారు? అంతకుముందే, కవులుగా, రచయితలుగా, కొన్ని కొన్ని కీర్తులతో వున్న వారు, తమకు నాయకులవడం, ఆ సంఘ సభ్యులకు నచ్చిందనుకోవాలి. బైట కీర్తులుండటం వేరూ, మార్క్సియన్ సంఘంలో నాయకత్వ అర్హతలుండటం వేరూ కదా? అంటే, ఒక సంఘం, తన ప్రణాళికలో వున్న సిద్ధాంతాన్ని బట్టి, సభ్యులు చేరాలని ఆశించడం గాక; బైటి వారి కీర్తుల్ని బట్టి, సభ్యుల్ని ఆకర్షించాలని ఆశించడం ఇది! ఈ విప్లవ సంఘం, తన 50 ఏళ్ళ మహాసభలకి జనాన్ని సమీకరించడానికి, 156 మంది బైటి వారితో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పర్చుకుంది. వారు ‘విరసం’లో సభ్యులు కారు; బైట కీర్తులు గల వారు. వీరు ఏమి చెయ్యాలి? అక్కడక్కడా సమావేశాలు జరిపి, జనాలతో, ‘విరసం మహాసభలకు రండి!’ అని చెప్పాలి. ఈ ప్రచారం బైటి వాళ్ళు చెయ్యాలా? ఆ పని చెయ్యడానికి, విరసానికి సభ్యులు లేరా? బూర్జువా సంఘాల సంప్రదాయాలనే విప్లవ సంఘాలు అనుకరించడం ఇది. విరసం వెబ్సైట్లోనూ, ఆహ్వాన సంఘం పేరుతో వేసిన కరపత్రంలోనూ అతిశయమూ, ఆత్మస్తుతీ చూడొచ్చు. విరసానికి యాభై ఏళ్ళు నిండటం ‘చారిత్రక సందర్భం’ అట! సంఘం ప్రారంభంలో ఎంత మంది వున్నారూ, యాభై ఏళ్ళలో సంఘం ఎంత విస్తరించింది? ఆ చరిత్ర కావాలి. విరసం పుట్టాకే, కళా సాహిత్య రంగాలలో ‘‘ద్రుష్టి కోణమే మారిపోయింది’’ అట! విరసం వారి దయ్యాల తత్వశాస్త్ర వ్యాసాల ముద్రణా, పునర్ముద్రణా కూడా కొత్త ద్రుష్టికోణమే అన్న మాట! సాహిత్య విమర్శని మౌలికంగా మార్చేసింది–అట! శ్రమదోపిడీని వివరించే మార్క్సిజంతో సంబంధం లేని ‘బ్రాహ్మణీయ’,‘మనువాద’,‘హిందూత్వ’ వంటి పదజాలాన్ని విరివిగా ఉపయోగించడం ఏమి విమర్శనా పద్ధతి? స్త్రీ–పురుష సమానత్వానికీ, కుల నిర్మూలనకూ మార్క్సిజం పనికి రాదనే ఫెమినిస్టు ధోరణుల్నీ, దళితవాద ధోరణుల్నీ ‘మార్క్సియన్ సోషలిజం’ద్రుష్టితో నీళ్ళు నమలకుండా ఎదుర్కోక పోవడం ఏ రకం విమర్శనా పద్ధతి? ‘‘రచయిత అంటే వ్యవస్తకూ, రాజ్యానికీ నిరంతర ప్రతిపక్షం అనే ఆదర్శాన్ని తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నది’’ అని కితాబు! సంస్త ప్రారంభం నించీ ఇప్పటి వరకూ, సంస్తలో ముఖ్యస్తానాల్లో ఉండిన వాళ్ళందరూ, రాజ్యానికి ‘నిరంతరం ప్రతి పక్షంగా’ఉన్నారా? రాజ్యం ఇచ్చే బహుమతులూ, పదవులూ పొందే వారిని మీటింగులలోనూ, ఆహ్వాన సంఘాలలోనూ కూచో పెట్టుకునే ఆచరణ ఏ ఆదర్శాన్ని నిరూపిస్తున్నది? సాహిత్యంలో అనేక అంశాల్లో విరసం ‘గణనీయమైన క్రుషి చేస్తోంది’ అని ప్రశంస. విరసం తన మాసపత్రికని క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి తీసుకు రాగలుగుతోందా? ఎందుకీ అతిశయాలూ, ఆత్మస్తుతులూ? ఏ విప్లవ సంఘమైనా, తనకు చేతనైనంతా, చేయగలిగినంతా చేస్తుంది, చెయ్యాలి. దాన్ని చూసుకుని మురిసిపోయి, బడాయిలు పోకూడదు. ఇక నిర్బంధాలు అంటారా? తేలుకి కుట్టడం ఎంత సహజమో, దోపిడీ రాజ్యాంగ యంత్రాంగానికి నిర్బంధం అంత సహజం. విప్లవ రచయితలనే కాదు, అంధ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు– వంటి వారు, చిన్న పాటి డిమాండ్లు అడిగినా, వారిని లాఠీలతో కొట్టిస్తారు; గుర్రాలతో తొక్కిస్తారు. దీనిని ప్రతిఘటించడానికి, సాధారణ ప్రజా చైతన్యం సరిపోదు. దోపిడీ శ్రమ సంబంధాలూ, వర్గాలూ, వర్గ ప్రయోజనాలూ, వర్గ పోరాటం వంటి విషయాలు ముందు విప్లవ రచయితలు తెలుసుకుని, వాటిని శ్రామిక వర్గ ప్రజలకి తెలిసేలా ఎంత వరకూ చేస్తున్నారూ– అనే దాన్ని బట్టి ప్రతిఘటన వుంటుంది. అంతే గానీ, మనం చాలా చేసేశాం ఈ యాభై ఏళ్ళలో, ఉద్యమం శరవేగంగా దూసుకుపోతోంది–అనే ధోరణిలో ఉంటే, అంగుళం కూడా ముందుకు పోలేరు. - రంగనాయకమ్మ -
ఘర్షణ ఐక్యత ఇప్పటి విధానం
తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన సందర్భం. తెలుగునేల నుండి దిక్కుల్ని మండించిన అక్షరాలకు యాభై సంవత్సరాలు నిండాయి. శ్రీకాకుళ పోరాటపు అగ్గిని, విప్లవ విద్యార్థుల సవాలును స్వీకరించి– తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుతామనీ, వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలను తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపన కోసం పాటుపడతామనీ, సోషలిజం మా లక్ష్యమనీ చరిత్ర ఎద మీద సంతకం చేసి హామీ పడిన విప్లవ రచయితల సంఘం తన మాటను నిలబెట్టుకుని అర్ధ శతాబ్ది విజయపతాకను ఎగరెయ్యబోతోంది. ఆనాడు సంతకం చేసిన పద్నాలుగు మంది రచయితల్లో వరవరరావు నేడు తన ఎనభై ఏళ్ల వయసులో చీకటి జైలు నుండి వెన్నెల సందేశాలు పంపుతున్నాడు. విప్లవ కవి సాయిబాబా చావును ధిక్కరించి నవజీవన కవితలల్లుతున్నాడు. విరసం పుట్టుక, నడక ఎంత ఆశ్చర్యకరం! శాస్త్రీయ సిద్ధాంతం వెలుగులో నిర్మాణాత్మకంగా విప్లవించాలనుకోవడం ఎంత ఉత్తేజకరం. విరసం ఆవిర్భావం చారిత్రాత్మకం అనే మాట లాంఛనం. చారిత్రక శక్తుల రాపిడిలో పుట్టి, చరిత్ర నిర్మాణంలో భాగమవుతూ 50 ఏళ్లుగా కొనసాగుతున్నది. 1947తో పరిష్కారం కాని వైరుధ్యాల విస్ఫోటనం నుండి జనించిన నక్సల్బరీ– కరడుగట్టిన ఫ్యూడల్ ఆధిపత్యాన్ని ధ్వంసం చేసే ప్రకంపనలను సృష్టించింది. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం దీనికి అంతర్జాతీయ నేపథ్యం. ఆ చారిత్రక సన్నివేశంలో పుట్టిన శిశువు విరసం. భూస్వామ్యం, సనాతన ధర్మం, బ్రాహ్మణ భావాలతో సాహిత్యరంగంలో వర్గపోరాటం నడిపి ఓడించింది విరసం. సాహిత్యాన్ని, సాహిత్య చరిత్రను శ్రామికులు, మట్టి మనుషుల వైపు నుంచి తిరగరాసింది. ఈ చైతన్యంతో సాహిత్య కళారూపాల తీరు మారిపోయింది. సాహిత్యం మట్టిని ముద్దాడి, అంటరానివాడలను హత్తుకుంది. జానపదాలను, మాండలికాలను వెలికి తీసింది. ఆకాశంలో సగాన్ని సాయుధం చేసింది. భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా వేలు, లక్షలుగా భూమి లేని నిరుపేదలు, అంటరాని మనుషులు, మహిళలు, ఆదివాసులు విప్లవంలోకి వచ్చారు. సాయుధ పోరాటాల్లో భాగమయ్యారు. అంటరానితనం, కులవివక్ష, పితృస్వామ్య కుటుంబ బంధనాలు తెంచుకొని వచ్చే చైతన్యాన్ని వర్గపోరాటమే ఇచ్చింది. ఇది భూమి కోసం పోరాటమే కాదు, భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా అన్ని రకాల సామాజిక అణచివేతలను ధ్వంసం చేసే పోరాటం. ఇదంతా ఆనాడు శివసాగర్ ‘చెల్లీ చంద్రమ్మ’గా, చెరబండరాజు ‘గౌరమ్మ కల’గా, ‘ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ’ అనే ఆత్మగౌరవ ప్రశ్నగా, ‘ఉందర్రా మాలపేట’ అనే వంగపండు విషాద గానంగా, అల్లం రాజయ్య ‘అగ్నికణం’లో మాదిగ బయ్యక్క విప్లవ నాయకిగా కావడంగా కనిపిస్తుంది. ఇదంతా వర్గపోరాటం కదిలించిన పీడిత సమూహాల కంఠ స్వరం. ఇప్పుడది తెగల కట్టుబాట్లను, కుటుంబ బంధనాలను తెంచుకొన్న ఆదివాసీ రాగో ముప్పై ఏళ్ల కింద చూపిన మార్గంలో దండకారణ్య స్త్రీల విముక్తి చరిత్రగా విస్తరించింది. ఇదంతా 1970, 80ల తొలినాళ్ళ విప్లవ సాహిత్యోద్యమ అడుగుజాడలు. వర్గపోరాటంలో భాగంగా సామాజిక అణచివేతల మీద గురి ఉన్నందుకే విప్లవ సాహిత్యం అన్ని జీవన పార్శా్వలను పట్టుకున్నది. 1970లలో అట్టడుగున సాగిన వర్గపోరాటాల సంచలనమే పీడిత అస్తిత్వాల చైతన్య ప్రకటనకు దారి చూపింది. అణగారిన గొంతులు మార్మోగే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించింది. ప్రత్యేక అస్తిత్వ గొంతుకలు నిస్సందేహంగా సమాజాన్ని, ఉద్యమాలను సెన్సిటైజ్ చేశాయి. ప్రజాస్వామిక దృష్టిని మరింత నిశితమూ, విశాలమూ చేశాయి. ఇది సామాజిక ప్రగతిలో భాగం. అందుకే విరసం ఏ శషబిషలు లేకుండా వాటిని ఆహ్వానించింది. అదే సమయంలో వర్గ దృష్టి తప్పకూడదని అస్తిత్వవాదాలకు గుర్తుచేసింది. వర్గశత్రువు గురించి హెచ్చరించింది. వ్యవస్థలోని సకల ఆధిపత్యాలను పరిరక్షించి అమలు చేసే రాజ్యం పట్ల రాజీలేని వైఖరి ఉండాలని ఉద్ఘాటించింది. విరసం ఈ యాభై ఏళ్ల ప్రయాణానికి వ్యవస్థ పట్ల, రాజ్యం పట్ల కచ్చితమైన వైఖరే కారణం. అది తప్పితే ఎలా ఉంటుందో గతంలోనే చూశాం. కొందరు స్త్రీవాదులైనా ఎన్జివోల వైపు, కొన్ని దళిత శక్తులైనా బూర్జువా పార్లమెంటరీ మార్గం వైపు వెళ్లి వ్యవస్థతో, రాజ్యంతో సర్దుకుపోవడం చూశాం. దోపిడీ వ్యవస్థను పరిరక్షించడానికి పార్లమెంటరీ రాజకీయాల నుంచే ఫాసిజం వస్తోందనే విషయంలో కచ్చితంగా ఉంటూనే ఈ వ్యవస్థ లోపల పీడిత సమూహాలకు బూర్జువా ప్రజాస్వామ్యం వల్ల ఏ కొంచెం ప్రయోజనం చేకూరినా దాన్ని హక్కుగా అంగీకరించాల్సిందే. అందుకే విరసం ఈ యాభై ఏళ్లుగా వ్యవస్థ సమూల మార్పు కోసం సాగుతున్న పోరాటాల వెంట నడిచినట్టే, రాజ్యాంగ పరిధిలో పీడిత సమూహాల హక్కుల కోసం జరిగిన పోరాటాలతో కలిసి నడిచింది. వాటి న్యాయకాంక్షను అక్షరబద్ధం చేసింది. ఇలాంటి విషయాల్లో విరసం గత నలభై ఏళ్లుగా నిరంతరం సైద్ధాంతిక భావజాల సంఘర్షణ కొనసాగిస్తున్నది. ఇది 70లలో ఫ్యూడల్ శక్తులతో చేసిన సంవాదం వంటిది కాదు. మిత్ర వైరుధ్యంతో ఎట్లా వ్యవహరించాలో విప్లవ రచయితలకు తెలుసు. తెలుగు సాహిత్య రంగంలో అవార్డులు, అకాడమీలు, పోటీలు, రాజ్యప్రాపకాల చీడ పెరిగిపోయిన ఈ స్థితిని తీవ్రంగా విమర్శిస్తూనే ప్రజా సమస్యలపై కలిసిరాగల మేరకు వీలైనంత ఎక్కువ మందితో విరసం కలిసి పని చేస్తోంది. ఘర్షణ ఐక్యత విధానాన్ని ఆచరిస్తోంది. విరసం తన వర్గ దృక్పథంతో శత్రువెవరో, మిత్రులెవరో సునిశితంగా గుర్తిస్తుంది. ఇతరులు తనతో ఎలా ఉన్నారని కాకుండా ప్రజా సమస్యలపై ఎలా ఉన్నారనేదే ఐక్యతకు గీటురాయి. ఎన్ని విమర్శలు, విసుర్లు ఎదురైనా సంయమనం పాటిస్తుంది. రాజ్యం విషయానికొచ్చే సరికి ఏ మాత్రం రాజీపడదు. తనమీద తనతో సహా అందరి మీద విమర్శనాత్మక అంచనా ఇదే సంస్థను అన్ని దశల్లో నిత్య నూతనంగా నడిపిస్తున్నది. అందువల్లనే విరసానికి ఉద్వేగపూరితమైన గతం ఉన్నట్లే అడుగడుగునా తనకే సాధ్యమైన సంభ్రమాశ్చర్యాల పోరాట వర్తమానం ఉన్నది. విరసం సభ్యులు సాహిత్య కళారంగాలతోపాటు ఆర్థికం, రాజకీయాలు, సైన్స్, చరిత్ర, విద్య, రిజర్వేషన్లు వగైరా అంశాల్లో కృషి చేశారు. వర్గపోరాట సిద్ధాంతం, రాజకీయాల వల్ల విరసం సాధించిన విస్తృతి ఎలాంటిదంటే.. అంటరానితనం, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం, కశ్మీర్, ఈశ్యాన రాష్ట్రాలు, తమిళ ఈలం దగ్గరి నుంచి పర్యావరణం, ట్రాన్స్ జెండర్స్ (నిజానికి ఎల్జిబిటిక్యూ అనే ఐదు అత్యంత పీడిత జెండర్ కమ్యూనిటీలుగా గుర్తించాలి) దాకా ఈ యాభై ఏళ్లలో విరసం స్పృశించని విషయం దాదాపుగా లేదు. ఫాసిజం లక్ష్యం చేసుకున్న మైనారిటీ మతాలు, కులాలు, పీడిత సమూహాల పక్షాన నిలిచి హిందుత్వ రాజకీయాల మూలాలను విప్పి చెబుతోంది. 1984 నుండే భారత రాజ్యం ఏవైపుగా పయనిస్తోందో, దాని రాజకీయార్థిక సామాజిక మూలాలేమిటో విరసం చెబుతూ వస్తున్నది. శ్రీకాకుళ పోరాటం దెబ్బతింటున్న సమయంలో ఏర్పడిన విరసం సాహిత్యరంగంలో సాయుధ రాజకీయాల ప్రచార ఎజెండాను స్వీకరించింది. ఈ యాభై ఏళ్లలో సమాజం అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. అనేక ప్రజాస్వామిక చైతన్యాలు ముందుకు వచ్చాయి. వీటన్నిటినీ విరసం స్వీకరించి తన వర్గపోరాట రాజకీయాలతో విశ్లేషిస్తున్నది. ప్రతి ఆలోచనను విప్లవం గీటురాయి మీద పరీక్షించి నిగ్గుదేలుస్తున్నది. రాజీలేకుండా భావజాల సంఘర్షణలో భాగం కావడమే దాని వర్తమానానికి, భవిష్యత్తుకు కారణం. దీనికంతా ప్రజల పోరాటాలే పునాది. ఈ యాభై ఏళ్ళ సభలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పీడిత అస్తిత్వ శక్తులు, వర్గపోరాట శక్తుల ఉమ్మడి కార్యాచరణకు ఒక సందర్భం కావాలని విరసం కోరుకుంటోంది.(విరసం యాభై ఏళ్ల మహాసభలు జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా)- పి.వరలక్ష్మి 4 జూలై 1970 సంస్కరణ వాదానికి కాలం చెల్లిపోయింది. సాంస్కృతిక వ్యవహారాల్లో నిస్తబ్దత పేరుకొని వుంది. అభ్యుదయ రచయితల ఉద్యమం కూడా శవప్రాయమైపోయింది. ఈ దుస్థితిని తొలగించుకొని జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపేందుకు విప్లవ రచయితల సంఘం ఏర్పడుతున్నది. ఈనాటి దోపిడీ వ్యవస్థతో రాజీలేని వైఖరి, నిజాయితీ గల ప్రతి రచయితకు తప్పనిసరి. నిజాన్ని వెల్లడించడంలో రచయితలు భయ సంకోచాలను విడిచి ప్రజలకు బాసట కావాలి. తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలి. సాంస్కృతిక వికాసానికి అంకితమైన ఈ విప్లవ రచయితల సంఘం సాహిత్యాన్ని జాతి జీవితంలో ప్రధానాంగం చేయబూనింది. మార్క్సియన్ సోషలిజమే మనందరి ధ్యేయం. ప్రజల దీర్ఘ కాలిక విమోచన పోరాటాలను గుర్తించి బలపరచే రచయితలే ఇందులో సభ్యులు. ఏ రూపంలో తిరుగుతున్నా ప్రజల వర్గపోరాటాల నన్నిటినీ మనం సమర్థిస్తాం. సర్వ సమగ్రమైన దేశ స్వాతంత్య్రం మన లక్ష్యం. వలస, భూస్వామ్య, ధనస్వామ్య ఆవశేషాలనన్నిటినీ తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడటమే మా ఉద్దేశం. శ్రామిక అంతర్జాతీయత మా వైఖరి. దేశ దేశాల ప్రజల విమోచన పోరాటాలను మేము హృదయ పూర్వకంగా బలపరుస్తాము. - శ్రీశ్రీ 4–7–1970; 1–07 ఎ.ఎం. సంతకం చేసినవారు: కె.వి.రమణారెడ్డి, వరవరరావు, జ్వాలాముఖి, రాచకొండ విశ్వనాథశాస్త్రి, నిఖిలేశ్వర్, రంగనాథం, శ్రీపతి, నగ్నముని, ఉమామహేశ్వరరావు, కేశవరావు, శ్రీనివాసరావు, ఎస్.హరిపురుషోత్తమరావు, పినాకపాణి, సి.(చలసాని) ప్రసాద్ -
తెలంగాణలో చీకటి పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అచ్యుతరామరావు అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు, రచయితలు, ప్రజా సంఘాలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత రామారావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాలను అణిచివేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప యజ్ఞాలతో కాదన్నారు. టీపీఎఫ్ అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో తీవ్రమైన నిర్బంధం కొనసాగుతుందని విమర్శించారు. కశ్మీర్ తరహాలో ఇక్కడ అప్రకటిత నిర్బంధం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీఎఫ్ కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ప్రొఫెసర్లు లక్ష్మణ్, అన్వర్ఖాన్, కాసీం, అడ్వకేట్ రఘునాథ్, నారాయణరావు, నలమాస కృష్ణ, కోటి, దుడ్డు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మేధావుల గొంతులను అణచివేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేసిన విరసం కార్యవర్గ సభ్యులు ప్రజా సమస్యలపై ప్రశ్నించే మేధావుల గొంతులను అణచివేస్తున్నారని, దీనిలో భాగంగానే విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.జగన్పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో విరసం కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ కాశీం, తెలంగాణ సాహితీవేత్త భూపతి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి వఝల శివకుమార్, జగన్ తల్లి లక్ష్మీ నర్సమ్మలు మాట్లాడారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్య మంలో జగన్ కీలకపాత్ర పోషించారని, అప్పుడు ఏర్పడిన విద్యార్ధి జేఏసీలో ప్రధాన నాయకుడిగా ఉన్నారని వారు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అర్ధశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జగన్ పనిచేస్తున్నారన్నారు. మఫ్టీలో ఉన్న గద్వాల పోలీసులు గురువారం ఉదయం 10.30 ప్రాంతంలో జగన్ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనంతరం ఆయన కళ్లకు గంతలు కట్టి ఎక్కడెక్కడో తిప్పి సాయంత్రం 4 గంటలకు ఆయన ఇంటికి తీసుకువచ్చి పుస్తకాలు, ఇల్లు మొత్తం చిందరవందర చేశారన్నారు. బేషరతుగా జగన్ తోపాటు చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్ప, తెలంగాణ విద్యార్ధి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి తదితరులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విరసం కార్యదర్శి పాణి, కార్యవర్గ సభ్యులు రాంకీ, రాము, క్రాంతి, సభ్యులు అరవింద్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
నిర్బంధాన్ని ధిక్కరిద్దాం
తెలుగు విప్లవ రచయితలు ఇద్దరు మహారాష్ట్ర జైళ్లలో బందీలయ్యారు. వీరిలో ప్రొ‘‘ సాయిబాబా నాగపూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనకు వైద్యంకోసం వేసిన బెయిల్ను కూడా కోర్టు కొట్టేసింది. ఆధునిక తెలుగు సాహిత్యంలోనే పేరెన్నికగన్న విప్లవకవి వరవరరావు ఐదు నెలల నుంచి పూణేలోని ఎరవాడ జైల్లో బందీ అయ్యారు. 80 ఏళ్ల వయసులో కనీస సౌకర్యాలు లేని జైలు జీవితం అనుభవిస్తున్నారు. వీరేగాక దేశవ్యాప్తంగా సుప్రసిద్ధులైన సుధాభరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, ప్రొ. షోమాసేన్, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరా, రోనావిల్సన్, సుధీర్ ధావ్లే, మహేష్ రౌత్ కూడా ఎరవాడ జైల్లో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. సాహిత్య, కళా, న్యాయ, మేధో రంగాల్లో దేశం గర్వించదగిన ఈ బుద్ధిజీవులను అక్రమ కేసుల కింద సంఘ్పరి వార్ ప్రభుత్వం నిర్బంధించింది. వీళ్లంతా తమ మేధస్సుతో, సృజనాత్మకతతో సమాజ వికాసానికి దోహదం చేశారు. ప్రజాస్వామిక విలువలను, సంస్కృతిని స్థాపించడానికి కృషి చేశారు. ప్రజా పోరాటాలతో కలిసి నడవడమే బుద్ధిజీవుల కర్తవ్యమనే తరతరాల ఆదర్శాన్ని ఎత్తిపట్టారు. అట్టడుగు కులాల, వర్గాల, ఆదివాసుల, మత మైనారిటీల ఉనికినే రద్దు చేసే ప్రభుత్వ విధానాలను వీళ్లు ఎదిరించారు. దేశ సంపదను సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే కుట్రలను బహిర్గతం చేశారు. తమ శ్రమతో సమస్త సంపదలు సృష్టిస్తున్న కార్మికవర్గంపై జరుగుతున్న దోపిడీని ప్రశ్నించారు. పీడిత ప్రజలు చేస్తున్న పోరాటాల్లో భాగమయ్యారు. అంతిమంగా ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న నియంతృత్వాన్ని ఖండించి, ఒక మానవీయమైన వ్యవస్థను స్థాపించుకోడానికి ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలబడ్డారు. ప్రజల తరపున రాస్తూ, మాట్లాడుతూ, పోరాడుతున్నందుకే వీరి మీద తప్పుడు ఆరోపణలు చేశాయి. బెయిలు రాకుండా అడ్డుకుంటున్నాయి. న్యాయ ప్రక్రియను తమ కనుసన్నల్లో నడుపుతున్నాయి. మన దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వచ్చేసిందనడానికి వీళ్ల నిర్బంధమే ఒక ఉదాహరణ. ఈ పది మంది మేధావులేకాదు, దేశ వ్యాప్తంగా వేలాది మంది దళితులు, ఆదివాసులు, ముస్లింలు చేయని నేరానికి ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. మనకు పేర్లు తెలిసిన ఈ పది మంది గురించేగాక జైళ్లలో అక్రమంగా బందీలైన వాళ్లందరి విడుదల కోసం ఆందోళన జరుగుతోంది. దేశంలో హక్కుల ఉల్లంఘన ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, రచయితలు ఆందోళనపడుతున్నారు. ప్రజాస్వామ్యమంటే భిన్నాభిప్రాయ ప్రకటనలకు చోటు ఉండటం. వేర్వేరు ప్రత్యామ్నాయాలను విశ్వసించి, ఆచరించే అవకాశం ఉండటం. పాలకులు ఈ విలువను ధ్వంసం చేశారు. ఈ స్థితిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా పోరాటాలు జరిగాయి. తెలుగు సాహిత్య, మేధో రంగాల నుంచి కూడా తీవ్ర నిరసన వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదు, వరం గల్, విజయవాడ, కర్నూలు నగరాల్లో విరసం ఆధ్వర్యంలో రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులతో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం. విప్లవ రచయితల సంఘం -
ఖైదు కవితో కరచాలనం
ప్రధాని హత్యకు కుట్ర చేశారనే అర్థం పర్థం లేని ఆరోపణ కింద, నకిలీ ఉత్త రాలు సాక్ష్యాలుగా చూపి విప్లవ కవి వరవరరావును ఐదు నెలలుగా దుర్భరమైన పూణే జైల్లో నిర్బంధించారు. సెషన్స్ కోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కలిసే అవకాశం ఉంటుందని తెలిసి వీవీని చూడ్డానికి తెలంగాణ నుండి 26 మంది రచయితలు, ప్రజాసంఘాల మిత్రులం వెళ్లాం. నిరీక్షణలో అరుణ్ ఫెరేరా సహచరి పరిచయమైంది. అరుణ్ ఇదివరకే సుమారు ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. జెన్నిఫర్ కొడుకుని తలచుకుంటూ తను మొదటిసారి అరెస్టయినప్పుడు వాడికి రెండేళ్లని, విడుదలయ్యాక వచ్చిన తండ్రిని వింతగా చూస్తుంటే మీ నాన్న అని పరిచయం చేయవలసి వచ్చిందని చెప్పింది. ఇప్పుడు పన్నెండేళ్లొచ్చి విషయాలు అర్థం అవుతున్నాయి గనుక నాన్నను మళ్లీ ఎప్పుడు చూస్తానని అడుగుతున్నాడట. చివరికి వీవీని చూడగలిగాం. నల్లబడిన శరీర రంగు, సన్నబడ్డ దేహం, కానీ అదే ఉత్సాహం. దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటే కళ్లను కప్పేస్తూ నీటిపొర. వీవీ ముఖంలో ఎన్నడూ లేనంతగా వృద్ధా ప్యం పైకి తేలింది. షోమాసేన్ బక్కచిక్కిపోయింది. చూపుడువేలితో అభినయిస్తూ చాలా సన్నబడ్డావని పరామర్శిస్తున్న మిత్రులకు ‘మంచిదేగా’ అని నవ్వుతూ సమాధానం చెప్తున్నారామె. సుధా భరద్వాజ్కు అభివాదం చేస్తుంటే విప్పారిన చిరునవ్వుతో ఆమె పలకరింపులు ప్రసన్నంగా ఉన్నాయి. బయట ఉంటే తీరిక లేకుండా ఉండే వీవీకి ఇక్కడి ఖాళీతనంతో పాటు ఉన్న భౌతిక స్థితి వల్ల, అననుకూల పరి సరాల్లో వయసు వల్ల తిరగబెట్టిన అనారోగ్యాల వల్ల చాలా అలసిపోయి కనిపిస్తున్నారు. ఇరుకు బెంచీలో ఆయన కోరికమీద పక్కన సర్దుకొని కూర్చున్నాను. అక్కడ సాయిబాబా, ఇక్కడ ఈయన? తనతో పాటు అదే బ్యారక్లో ఉంటున్న ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, ముఖ్యంగా వారిలో కేవలం ముస్లింలుగా పుట్టినందువల్ల అల్ఖైదా ముద్ర వేయించుకున్న ఇద్దరని గురించి బాధపడుతున్న వీవీ, సాహిత్యం గురించి ముచ్చటిస్తూ తెలుగులో మాట్లాడక ఎన్నాళ్లయిందో అన్నప్పుడు తన స్థితిని ఆదివాసులతో పోల్చుకున్నారు. ఆదివాసుల భాష, సంస్కృతి, ఉనికి కూడా గల్లంతవుతున్నది కదా, అదింకెంత దుర్భరం అన్నారు. నోట్బుక్కులెన్నో కవిత్వం, అనువాదాలు, అనుభూతులతో నింపేసారు కానీ, తెలుగు కావడం వల్ల బైటికి పంపనివ్వడంలేదట. ఇంగ్లీషులో ఉత్తరాలు రాయగలిగినా, సహచరికి తెలియని ఇంగ్లీషు భాషలో రాయలేక మానేసానన్నారు. ఎనభైలలో జైలునుండి రాసిన ప్రేమలేఖల్లో సెన్సార్ అవుతున్న ప్రేమ గురించి బాధపడ్డ కవి, ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే భాష కూడా చేతికందక విలవిల్లాడుతున్నాడా? అక్కడ నాగ్పూర్లో సాయిబాబాను కనీసం కుటుంబసభ్యులతో కూడా తెలుగు మాట్లాడనివ్వడం లేదని వసంత చెప్పింది. ప్రొఫెసర్ షోమాసేన్ ఆర్థరైటిస్ వల్ల కిందకూర్చోలేక, ఎన్నిసార్లు విన్నవించినా కుర్చీ ఇవ్వని జైలు కాఠిన్యంలో శరీరం కృశించిపోయే స్థితి. రిటైర్ అవ్వడానికి కొద్దిరోజుల ముందు ఈ కేసువల్ల నాగపూర్ యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని స్థితి. ప్రతిష్టాత్మక పీఎంఆర్డీ ఫెలోషిప్ సాధించిన చురుకైన పరిశోధక విద్యార్థి మహేశ్ రౌత్, తన చదువును, మనసును, ఆచరణను కూడా ఆదివాసులపై లగ్నం చేసినందుకు ఇక్కడ ఇలా వీళ్ల మధ్యకు వచ్చి చేరాడు. వీళ్ల బెయిల్ వినతిని తిరస్కరించమని ఆరోజు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలో ఎల్గార్ పరిషత్ పేరు మీద దళితుల్ని సమీకరించడం అనే ‘నేరాన్ని’ గురించి పదేపదే ప్రస్తావించడం విన్నాం. వీవీని ఉద్దేశించి ‘బడా నేతా’ అంటున్నప్పుడు ఆయనకేసి చూస్తే నవ్వుతున్నారు. ఆయనే కాదు, ఆ తొమ్మిదిమందీ ఎవరిపేరు ప్రస్తావనకొచ్చినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వులు చిందిçస్తున్నారో, అంతగా కసి, ద్వేషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతులో వినిపించి ఆశ్చర్యపోయాం. ఆ రోజే విన్న కొత్త వింత వాదన, భీమా కోరేగావ్ అల్లర్లలో నిందితులుగా సంఘ్పరివార్ నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బొటేల పేర్లు డిఫెన్స్ వారు తెస్తున్నారని, వారికి అందులో ఏ ప్రమేయం లేకున్నా కేసు తప్పుదారి పట్టించడానికే ఇందులోకి లాగుతున్నారని చెప్పడం. నిజానికి భీమా కోరేగావ్ అల్లర్ల మీద మొదట దాఖ లైన ఎఫ్ఐఆర్ ఆ ఇద్దరి మీదే! వీడ్కోలు సమయంలో బిగిసిన పిడికిలి చూస్తున్నప్పుడే కాదు ఎప్పటికీ వీవీ చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘‘దళితులు ఆదివాసీల జీవితాలను, పోరాటాలను గురించి మాట్లాడే స్వేచ్ఛను మేం కోల్పోయాం. అది బాధాకరమేగానీ, మా గురించి మాట్లాడే స్నేహితులు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతే ఆ మాత్రం స్వేచ్ఛ త్యాగం చేసిన తృప్తి మిగులుతుంది’’. వ్యాసకర్త విరసం కార్యవర్గ సభ్యురాలు ఈ–మెయిల్ : varalurwa@gmail.com పి.వరలక్ష్మి -
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్ : పుణే పోలీసులు విచారణ పేరుతో హైదరాబాద్లో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు జరపడమే కాకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం సహించరానిదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్ అన్నారు. పీసీఐ కమిటీ పర్యటనలో భాగంగా ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఉన్న అమర్ ఈ సంఘటనపై స్పందించారు. పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి మీడియా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికే పోలీసులు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అమర్ స్పష్టం చేశారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే, తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజాసంఘాల ప్రముఖులు వరవరరావు, కూర్మనాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై పుణే పోలీసులు దాడులకు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజే) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు అని పేర్కొన్నారు. పోలీసు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. అరెస్టులు సరికాదు: టీయూడబ్ల్యూజే మోదీ హత్యకు కుట్ర పేరుతో పుణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి ఇళ్లలో అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, క్రాంతి పేర్కొన్నారు. -
వరవరరావును తక్షణమే విడుదల చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: విరసం అధ్యక్షుడు వరవరరావును అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభ ద్రం ఖండించారు. తక్షణ మే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మానవ, ప్రజాస్వామ్య హక్కులపై తీవ్ర దాడి జరుగుతోందన్నారు. అబద్ధపు అభియోగాలు మోపి తన ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తోందన్నారు. దీనిలో భాగంగానే వరవరరావు, ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారని విమర్శించారు. వరవరరావుది అక్రమ అరెస్టు: మంద కృష్ణ సాక్షి, హైదరాబాద్: ఒక లేఖ ఆధారంగా పౌరహక్కుల నేత వరవరరావును పుణే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆ లేఖ రాసింది మావోయిస్టులా? కాదా? అన్న విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ లేఖను పోలీసులే సృష్టించారన్న పౌరహక్కుల నేతల ప్రశ్నకు సమాధానం చెప్పాలని మంగళవారం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వరవరరావుపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
పుణే, న్యూఢిల్లీ, ముంబై, రాంచీ, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు సంచలనం సృష్టించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో వారి నివాసాలపై పుణే పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గతేడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని కోరెగావ్–భీమాలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసు విచారణలో భాగంగా ఈ దాడులు కొనసాగగా.. విరసం నేత వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్, గౌతం నవలఖాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టుల్ని మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు, అభ్యుదయ రచయితలు, న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ప్రజామద్దతు కోల్పోతున్నామనే భయంతోనే అరెస్టులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఏకకాలంలో పలు నగరాల్లో సోదాలు గతేడాది డిసెంబర్ 31న పుణేకి సమీపంలోని కోరెగావ్–భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణే పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో విరసం(విప్లవ రచయితల సంఘం)నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖా ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం హైదరాబాద్లో వరవరరావు, ఫరీదాబాద్లో సుధా భరద్వాజ్, ముంబైలో ఫెరీరా, గొంజాల్వెజ్, ఢిల్లీలో నవలఖాలపై ఐపీసీలోని 153(ఏ), ఇతర సెక్షన్లతో పాటు, మావోలతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నవలఖాను బుధవారం ఉదయం వరకూ ఢిల్లీ నుంచి బయటకు తీసుకెళ్లద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నవలఖా తరఫున ఆయన న్యాయవాది వరిషా ఫరాసత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను విచారించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్పై కూడా పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించింది. మరోవైపు హైదరాబాద్లో క్రాంతి టేకుల, కూర్మనాథ్, రాంచీలో సుసాన్ అబ్రహం, ఫాదర్ స్టాన్ స్వామి, గోవాలో ఆనంద్ టెల్టుంబ్డే ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మావోలతో సంబంధాలున్నాయనే అరెస్టు చేశాం: పోలీసు వర్గాలు ‘ఈల్గర్ పరిషద్ ఆందోళనలతో సంబంధాలపై దర్యాప్తు చేయగా ... నిషేధిత సంస్థ సభ్యులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. దాని ఆధారంగా పోలీసులు చత్తీస్గఢ్, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు’అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లతో పాటు.. జూన్లో అరెస్టైన ఐదురుగు వ్యక్తులతో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా సంబంధమున్న వారి ఇళ్లలోను సోదాలు జరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో నిషేధిత సంస్థలతో సంబంధాలపై కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని, వారి ఆర్థిక లావాదేవీల్ని, ఫోన్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర పోలీసుల తనిఖీల్లో దొరికిన రెండు లేఖల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్నాథ్సింగ్ హత్యకు మావోయిస్టుల కుట్ర పన్నారన్న సమాచారం నేపథ్యంలోను ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కోరెగావ్–బీమా కేసు దర్యాప్తులో భాగంగానే.. కోరెగావ్–బీమా హింసతో సంబంధమున్న అనుమానంతో ఈల్గర్ పరిషద్కు చెందిన ఐదుగురు కార్యకర్తల్ని ఈ ఏడాది జూన్లో పోలీసులు అరెస్టు చేశారు. దళిత కార్యకర్త సుధీర్ ధావలేను ముంబైలోని తన ఇంట్లో అరెస్టు చేయగా.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, కార్యకర్తలు మహేశ్ రౌత్, షోమా సేన్లను నాగ్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక న్యాయవాది రోనా విల్సన్ను ఢిల్లీలోని తన ఇంట్లో అరెస్టు చేశారు. వారికి మావోలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విల్సన్ ఇంట్లో సోదాల్లో దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని అప్పట్లో పుణే పోలీసులు ప్రకటించారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే రోడ్షోలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో ఉందని పోలీసులు చెప్పడం అప్పట్లో సంచలనమైంది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. దళితులు వర్సెస్ పీష్వాలు దళిత సైనికుల సాయంతో జనవరి 1, 1818న పీష్వా పాలకుల్ని బ్రిటిష్ సైన్యం ఓడించింది. పీష్వా పాలకులపై విజయానికి చిహ్నంగా దళిత సంఘాలు ఏటా మహారాష్ట్రలోని భీమా కోరెగావ్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తాయి. గతేడాది డిసెంబర్ 31న ఆ వేడుకల్లో హింస నెలకొంది. కొన్ని హిందూసంస్థలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో విధ్వంసం చోటుచేసుకుంది. ముంబయితో పాటు పలు ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించడంతో మూడు రోజులు మహారాష్ట్ర స్తంభించింది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. -
వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
డాక్టర్ వరవరరావు తెలుగు సాహిత్యంలో సుప్ర సిద్ధ రచయిత. అరవై ఏళ్ల నుంచి కవిగా, రచయి తగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సాహిత్య కృషి చేస్తున్నారు. సముద్రం, చలినెగళ్లు, ఆ రోజులు లాంటి కవితా సంపుటాలను ప్రచురిం చారు. ‘తెలంగాణ విమోచనోద్యమ నవలల’పై విలువైన పరిశోధనను చేశారు. ఈ పరిశోధన వివిధ విశ్వవిద్యాలయాలలో రెఫరెన్స్గా ఉంది. ‘భూమి తో మాట్లాడు...’ లాంటి కల్పనా సాహి త్యంపై విమర్శ గ్రంథాలను రాశారు. వరంగల్ లోని సి.కె.ఎం. కళాశాలలో సుదీర్ఘ కాలం తెలుగు అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవిగా, రచయితగా, వక్తగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లే షకుడిగా ఆయనకు దేశవ్యాపిత గుర్తింపు ఉంది. తెలుగు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఆయన నక్సలైట్లకు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తన బాధ్యతను నిర్వహించారు. వరవరరావు 1970లో ఏర్పడిన విప్లవ రచ యితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ప్రజాకవి శ్రీశ్రీ, కాళోజీలతో కలిసి పనిచేశారు. ఆయన నమ్మిన విలువల కోసం, సిద్ధాంత రాజకీయాల కోసం అరవై ఏళ్లుగా రాజీ లేకుండా పనిచేస్తు న్నారు. ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం సామాజిక చలనానికి అదనపు కూర్పు. భిన్న భావాలు కలిగి ఉండటమనే ప్రజాస్వామిక సూత్రానికి ఆయన లాంటి వాళ్లు ఒక ఉదాహరణ. భారత సమాజం మొదటి నుంచి అన్ని ఆలో చనలకు నిలయంగా ఉంది. వరవరరావు విప్లవా చరణ సాహిత్యంలోనే కానీ ఇతరేతర రూపాలలో కాదని మేము నమ్ముతున్నాం. విప్లవ పార్టీల చర్యలతో ఆయనకు సంబంధం ఉండే అవకాశం లేదు. రచయిత స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడే సృజనాత్మక సాహిత్యం వికసిస్తుంది. భావాలను ఆధారంగా చెబుతున్న లేఖలో వరవరరావు ప్రస్తావనను ఆధారం చేసు కుని రచయితను వేధించడం సరైంది కాదు కనుక మహారాష్ట్ర పోలీసులు అక్రమ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తిచేస్తున్నాము. వరవరరావుపై అక్రమ కేసును మోపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీని వాస్, గద్దర్, అంపశయ్య నవీన్, పాశం యాద గిరి, ఓల్గా, విమలక్క, దేవిప్రియ, యాకూబ్, కాత్యా యని విద్మహే, గోరటి వెంకన్న, సురెపల్లి సుజాత, విల్సన్ సుధాకర్, కొండేపూడి నిర్మల, జయధీర్ తిరుమలరావు. నగ్నముని, కె.శివారెడ్డి, ఖాదర్ మొహినుద్దిన్ తదితర 35 మంది రచయితలు, కవులు, కళాకారులు) -
కుట్ర కేంద్రానిదే
సాక్షి, హైదరాబాద్ : కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నామని, ఇది ప్రజాసంఘాలను, ప్రశ్నించే హక్కును అణచేందుకు కేంద్రం పన్నిన భారీ కుట్రని విప్లవ రచయితల సంఘం(విరసం) నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. భీమా, కోరెగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ దళిత, ఆదివాసీ హక్కుల, ప్రజాసంఘాల బాధ్యుల అరెస్ట్ను నిరసిస్తున్న సమయంలోనే అంతకన్నా కుట్రపూరిత చర్యలకు పోలీసులు తెరలేపారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి అందులో విరసం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వరవరరావు పేరును ఇరికించారని అన్నారు. కోరేగావ్లో అసలు నిందితులైన సంఘ్ పరివార్ నాయకులను వదిలేసి దళిత, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణను అణచివేయాలని చూస్తున్నారని వాపోయారు. నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు రచించిన కుట్రని ఆరోపించారు. మోదీపై కుట్ర పెద్ద అబద్దమని, అసలు కుట్ర మోదీ రాజ్యమే చేస్తున్నదని విరసం నేతలు ఆరోపించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరెగావ్ మరోమారు అణగారిన ప్రజల ముందు పెట్టిందన్నారు. అది సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నదని ఆరోపించారు. నాగ్పూర్ నుంచి భీమా కోరెగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టవలసిందిగా ప్రజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేస్తున్నదని పత్రికా ప్రకటన ద్వారా విరసం నేతలు పాణి(కార్యదర్శి), కల్యాణ రావు(సీనియర్ సభ్యులు), వరలక్షి, కాశిం, రాంకీ(కార్యవర్గ సభ్యులు) తెలియజేశారు. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
విరసం నేత వరవరరావును మెదక్ జిల్లా కొండపాక మండలం కోనాయిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు లాఠీచార్జీలో గాయపడ్డ మల్లన్న సాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నా ఆయనను మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగరు ముంపు బాధితులను పరమార్శించడానికి వెళుతున్న విరసం, ప్రజాఫ్రంట్ నాయకులు డా.కాశీం, రవించంద్ర, దేవేంద్ర, గీతాంజలి,నలమాస కృష్ణ, రమణాచారీ, మెంచు రమేష్, కోటి, రమ, స్నేహ,బద్రీ తదితరులను వేములగట్టు పోలీస్ స్టేషన్ కి తరలించారు. -
అవి ఉద్యమ భానుల వధ్య శిలలా?
సందర్భం నూతన నిర్మాణంలోని ఇటు కల కలల్లో/గునపాల కొసలు దింపడం/ ఇప్పుడు ‘వాడి’ యుద్ధ విధానం/ ప్రతిఘటిం చకపోతే ఇది రాసిన నేనూ/ చదివిన నువ్వూ మిగలం. -ఉదయభాను ఉన్నత విద్యాలయాల్లో భావ సంఘర్షణలు కొత్తకాదు. ముఖ్యంగా తెలుగు సమాజంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి, తిరిగి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర కాలాల నుంచి అగ్రవర్గ, వర్ణ భూస్వామ్య వర్గాల పిల్లలు ఏబీవీపీ భావజాలానికి; దళిత, బడుగు, వర్గాల, కులాల పిల్లల రాడికల్ భావజాలానికి ప్రభావితులై భావ సంఘ ర్షణలు భౌతిక దాడులకు దారితీసిన రోజులు 1972 ఏప్రిల్ 14న జార్జ్రెడ్డి హత్యతో ఉస్మానియా విశ్వవిద్యా లయంలో మొదలై వరంగల్ ఆర్ఈసీ, కేఎంసీలకు విస్తరించిన క్రమంలో విద్యార్థి సంస్థల ఎన్నికల రద్దుకు దారితీయడం తెలిసిందే. అయితే ఇప్పుడు మద్రాస్ ఐఐటీలో పెరియార్- అంబేడ్కర్ స్టడీ సర్కిల్ను నిషేధించమని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ లేఖ రాసిన నాటి నుంచి, పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్కు టీవీలో ధర్మరాజు వేషధారి చౌహాన్ను డెరైక్టర్గా నియమించిన నాటి నుంచి, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ చక్రవర్తి, ప్రశాంత్ మొదలైన ఐదుగురు దళిత విద్యార్థుల సాంఘిక బహిష్కరణ దాకా, జేఎన్యూలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య లాల్, డీఎస్యూ నాయకులు ఉమర్ ఖలీద్ అనిర్బన్, వాళ్ల సహచరులపై కేసులు, అరెస్టులు సమాజంలోనే భౌతిక దాడులకు దారితీసి ఈ దేశాన్ని ఒక ‘పోస్టాఫీసు లేని మరు భూమి’గా మార్చేస్తున్నాయి. డెభ్బైలు, ఎనభైలకు.. మోదిత్వ 2014-16కు తేడా ఏమిటంటే అప్పుడు విప్లవ భావాలకు-విప్లవ వ్యతిరేక భావాలకు ఘర్షణ. ఇప్పుడు హిందుత్వ కాషాయ జెండా నీడలో సామ్రాజ్యవాద-భూస్వామ్య దళారీలకు దళిత, ఆదివాని, ముస్లిం మైనారిటీలు మొదలు మొత్తం ప్రగతిశీల, విప్లవ భావజాలాలతో ఘర్షణ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళిత విద్యార్థులు సాంఘిక బహిష్క రణకు గురవుతారు. వెలివాడలో బ్రాహ్మణాగ్రహారానికి దూరంగా ఆకాశం కప్పుగా అలమటిస్తారు. ఆక్రోశి స్తారు. ఉద్యమిస్తారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో జాతి చైతన్యాన్ని రగిలిస్తాడు. ఉద్యమం పరిస్థితులను చక్కదిద్దితే వైస్ చాన్స్లర్ తిరిగి వచ్చి దౌర్జన్యాన్ని, హింసాకాండను రెచ్చగొట్టి క్యాంపస్ను ఒక కాన్సెం ట్రేషన్ క్యాంపుగా మారుస్తాడు. ఈ సందర్భంలో యూనివర్సిటీ అధికారులు, పోలీసులు కలసి తయారు చేసిన అభియోగపత్రంలో 47 మంది ముద్దాయిలపై కేసు పెట్టారు. అందులో 26 మందిని అరెస్టు చేసి వారం రోజులు చర్లపల్లి జైల్లో పెట్టారు. వీసీ అప్పారావు తిరిగి వచ్చి తన లాడ్జిలో దౌర్జన్యాన్ని రచించుకుని అది సాకుగా మూడు వేలమంది పైచిలుకు విద్యార్థులకు ఆహారం, నీళ్లు, కరెంటు లేకుండా చేశాడు. మెస్లు మూసివేశాడు. కరెంటు కట్ చేయించాడు. యూని వర్సిటీ గేట్లు మూసివేని ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చేశాడు. విద్యార్థులు, ఆచార్యులు అరెస్టయిన వాళ్లు పోను, ఎందరని నీళ్లు, ఆహారం లేకుండా నకనకలాడుతారు. కనుక రెండవరోజు క్యాంపస్లో ఎండలో చెట్ల కింద పక్షుల వలె రాళ్లు ఏరుకుని పొయ్యి, కర్రలు ఏరుకుని నిప్పు, గిన్నెలు పోగుచేసి వంట చేయాలని పూను కున్నారు. అక్కడ మొదలవుతుంది మారణకాండ-అది ఉదయభాను మాటల్లో విన్నాం. ఉదయభాను పాల మూరు జిల్లా షాద్నగర్లో విశ్రాంత ఉపాధ్యాయుల సంతానమైన మాదిగ విద్యార్థి. తెలుగులో ఎం.ఫిల్. పూర్తిచేసి పి.హెచ్.డి. చేస్తున్నాడు. ఏడేళ్లుగా ప్రజాస్వా మిక ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయ కుడు. వక్త, కవి, నాటక ప్రయోక్త. రెండు కవితా సంకల నాలు- జంగ్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం, ముఖ్యంగా- గ్రీన్హంట్ ఆపరేషన్ పేరిట ప్రజలమీద యుద్ధాన్ని ప్రతిఘటిస్తూ ‘పిల్లనగ్రోవి తుపాన్’ కవితా సంకలనం ద్వారా సుప్రసిద్ధుడైనవాడు. హైదరాబాద్ యూనివర్సిటీ రోహిత్ వేముల అమ రత్వం తర్వాత ఏర్పడిన విద్యార్థి జాక్కు సహజంగానే నాయకత్వంలో ఉన్నాడు. అతడు రోహిత్, డాక్టర్ సి కాశీం వలె ‘నిషిద్ధ మానవుడు’. అతనికి చావు రుచి చూపించారు. తననెందుకు అంత చిత్రహింసలకు గురిచేసి చావు సరిహద్దుల దాకా తీసుకువెళ్లి వదిలిపోయారో, దానికి కారణాలను వాస్తవ గత వర్తమానాల మీద ఆధారపడి అతడు ఊహించాడు. విచిత్రమేమిటంటే- ఆయనని నలభై ఏడుగురు ముద్దాయిలలో చూపలేదు. ఇంత చిత్రహింసలు పెట్టిమళ్లీ క్యాంపస్లో విసిరేసి పోయారు గాని ఆసుపత్రిలో చేర్చి మెడికో లీగల్ కేసు వేయలేదు. విసిరేసి పోయేప్పుడు ఒక ఎస్ఐ వచ్చి హెచ్చరించినట్లు ఉదయభానును వాళ్లు చంపదలుచుకున్నారు. మాది హిందూ మతం, హిందూజాతి కాదు, మమ్మల్ని వెలివాడల్లో అస్పృశ్యులుగా చూస్తూ మా ఆత్మగౌరవాన్ని గాయపరుస్తున్నారన్న దళితులను జాతి వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రించి రాజద్రోహ నేరం మోపుతున్న ప్రభుత్వాలను... దళిత ఆదివానీ ముస్లిం మైనారిటీ, జాతుల స్వయం నిర్ణయ హక్కుల పోరాట ప్రజల పక్షాన చైతన్యవంతులుగా, ప్రజా స్వామిక వాదులుగా ధిక్కరిస్తున్నందుకే ఇవ్వాళ ఉన్నత విద్యాలయాల్లో ఈ సామాజిక వర్గాల నుంచి వస్తున్న వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి. బహిష్కరణలు జరుగుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య తర్వాత ఇవ్వాళ ఈ వధ్యశిలపై ఉదయభాను నిలబడ్డాడు. ఆనాడు రోహిత్ నెలరోజుల ముందే వైస్ చాన్స్లర్కు లేఖ రాశాడు. ఆ కుట్రదారుడు అది బయటపెట్టక అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆ హంతకుడు ఇపుడు విద్యార్థులపై అధ్యాపకులపై పోలీసులను, సాల్వాజుడుంను విశృంఖలంగా వదిలేసి క్యాంపస్ను ఒక కాన్సెంట్రేషన్ క్యాంప్గా మార్చాడు. అందుకు ఉదయభానుపై హత్యాప్రయత్నం ఒక సంకేతం మాత్రమే. ఉదయభానును కాపాడుకోవడం, వ్యక్తిని కాపాడుకోవడం కాదు.. ఉద్యమ భానులను వధ్యశిలకు బలికాకుండా కాపాడుకోవడమే అవుతుంది. వరవరరావు, విరసం సంస్థాపక సభ్యులు varavararao@yahoo.com -
పేదల జీవితాలు మార్చేందుకే వారి పోరాటం
- మావోయిస్టు నేత కుమార స్వామి అంతిమ యాత్రలో వరవరరావు నర్సంపేట(వరంగల్ జిల్లా) నిరుపేదల జీవితాలను మార్చడానికే వూవోయిస్టులు పోరాటం చేస్తున్నారని విరసం నేత వరవర రావు అన్నారు. నాలుగు రోజుల క్రితం ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట వుండలం భాంజిపేట గ్రామానికి చెందిన పుట్టపాక కుమార స్వామి... అతని భార్య సోనీ అంతిమ యాత్రలో వరవర రావు మాట్లాడారు. కుమారస్వామి, సోనీలు ప్రజల కోసం పోరాడుతూ మృతి చెందారని పేదల పక్షాన పోరాటం చేస్తూ.. శాఖ మూరి అప్పారావు, పుట్టపాక కుమారస్వామి, సోనీ లాంటి ఎందో మంది అమరులయ్యారని అన్నారు. కుమార స్వామి తన చిన్నతనంలో కలలు కన్న రాజ్యాన్ని ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేశాడన్నారు. విద్యార్థి దశలోనే కుమాక స్వామి రాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడని, 1993లో అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిపారు.కుమార స్వామి దంపతుల మృత దేహాలు చూస్తే.. బుల్లెట్ గాయాలు, చిత్ర హింసలకు గురిచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అన్నారు. రాజకీయాల్లో పెత్తనం చేసే వారు.. కుమార స్వామి తల్లికి బదులు చెప్పాలన్నారు. ఎందరో అమరుల త్యాగాలతో రాజకీయ నాయకులు తెలంగాణలో అధికార పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. కాగా.. మావోయిస్టు దంపతులు పుట్టపాక కుమార స్వామి, అతని భార్య చింద్రీ లింగో అలియాస్ సోనీ అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరిగాయి. వీరి మృతదేహాలను గురువారం ఉదయం నుంచి భారీ ఎత్తున ప్రజలు సందర్శించుకున్నారు. కుమారస్వామి అన్న కుమారుడు దహన సంస్కారాలను నిర్వహించారు. అంతిమ యాత్రలో ప్రజాసంఘాల నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు బాసిత్, వెంకన్న, రమేష్ చందర్, భారతక్క, సురేష్, పద్మకుమారి, భారతి, రంజిత్, అంజమ్మ, జ్యోతక్క, శాంత తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్పై న్యాయ విచారణ చేయాలి
వరంగల్ అడవుల్లో జరిగిన పోలీసుల బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని విప్లవ రచయితల సంఘం సభ్యుడు తంగళ్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన బూటకపు ఎన్ కౌంటర్ లో తన కుమార్తె శృతి మృతి చెందిందని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్కౌంటర్ దోషులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉండవని, నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని అన్నారు. ప్రజా వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తున్నారని.. మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన కూతురు శృతి ఊరూరా తిరిగి.. తెలంగాణ పాటలు పాడిందని గుర్తుచేసుకున్నారు. అలాంటి శృతిని ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారన్నారు. -
చలసానికి జోహార్
-
చలసాని మహాప్రస్థానం
చలసాని ప్రసాద్.. ఓ సమున్నత శిఖరం. నిరంతర చైతన్య స్రవంతి. అలుపెరుగని శ్రామికులు. ఆయన జీవించి ఉన్న కాలంలో 'సాక్షి' విశాఖ ఎడిషన్లో 'విశాఖ శిఖరాలు' శీర్షికన నిర్వహించిన ఫీచర్లో చలసాని గురించి కూడా సమగ్రంగా వివరించాం. చలసాని ప్రసాద్ శనివారం ఉదయం 11.30 గంటలకు మరణించారు. ఈ సందర్భంగా ఆయన గురించిన కథనాన్ని మరొక్కసారి చూద్దాం.. 'కొంతమంది యువకులు ముందు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అప్పటికి ఆయనకు చలసాని ప్రసాద్ వంటి వాళ్లెవరూ పరిచయం కాలేదనాలేమో. అయి ఉంటే మాత్రం 'కొంతమంది వృద్ధులు నేటి తరపు యువకులు.. అలుపెరుగని శ్రామికులు.. నవలోకపు కార్మికులు' అని ప్రత్యేకించి ప్రకటించేవాడేమో. నిజమే మరి.. ఎనిమిది పదుల వయస్సులో కూడా పరుగులు తీసిన చలసాని నేటి తరపు యువకులెందరికో అసూయ పుట్టించే నిత్య చైతన్యవంతుడు. తాను విశ్వసించే సిద్ధాంతం కోసం అహరహం పనిచేసిన సమసమాజ శ్రామికుడు. తాను ఆశించే రేపటి మరో ప్రపంచం నేడే సాకారం కావాలని, స్వప్న సాక్షాత్కారం కావాలని పరిశ్రమించిన, పరితపించిన నవ్యలోకపు కార్మికుడు. దగమనంతో సాగే ద్విచక్రవాహనాన్ని నడిపిస్తూ, పరిచయస్తుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ మామూలుగా కనిపించే ఆ వ్యక్తిలో ఇంత శక్తి దాగి ఉందంటే తెలియని వారు నమ్మడం కష్టమే. కానీ ఆయన గురించి తెలిసిన వారికి చలసాని ప్రసాద్ చైతన్య స్వరూపం ఆశ్చర్యమనిపించదు. పధ్నాలుగేళ్లు కష్టపడి ఇరవై భాగాలుగా శ్రీశ్రీ సాహితీ సర్వస్వాన్ని ప్రచురించినా, అదే తరగని ఉత్సాహంతో రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల సాహిత్యమంతటినీ సంపుటాలుగా వెలువరించినా అది చలసానికే చెల్లింది. 1970లో విప్లవ రచయతల సంఘాన్ని స్థాపించిన నాటి నుంచి విరసంతో ఆయన అనుబంధం కొనసాగింది. వాడీవేడి గల సంస్థగా ఆవిర్భవించిన విరసాన్ని అదే బాటలో ఉరకలు వేయించడంలో చురుకైన పాత్ర నిర్వహించారు. అయితే చలసాని ప్రసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన వాడీవేడి గల సంస్థగా ఆవిర్భవించిన విరసాన్ని అదే బాటలో ఉరకలు వేయించడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అయితే చలసాని ప్రసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఆశ అనంతం. ఆయన దృష్టి అఖండం. ఆయన చూపు రేపటి ప్రపంచం వైపు. మహాకవి మాదిరిగానే ఆయనకూ రేపటి సూర్యోదయంపై అంతులేని విశ్వాసముంది. శ్రామిక లోకపు కల్యాణం సాధ్యపడే ఆ మరో ప్రపంచం అరుదెంచే రోజు చేరువవుతోందన్న కొండంత భరోసా ఉంది. ఆ వి'శ్వాస'మే ఆయన్నునేటికీ పరుగులు తీయించింది. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి మార్క్సిస్టుగా పెరిగి, మావోయిస్టుగా స్థిరపడ్డ చలసాని జీవితం శ్రీశ్రీ సాహిత్యమంత విస్తారమైనది. ఆయన ఆలోచన, కృషి రావిశాస్త్రి రచనల్లోని పాత్రలంత విస్తృతమైనవి. ప్రజా సాహిత్యమన్నా, శ్రామిక విప్లవమన్నా ఆయనకు అంతులేని మమకారం. ఆ ప్రేమాభిమానాల కారణంగానే కష్టజీవులకు అటూఇటూ నిలబడ్డ శ్రీశ్రీ, రావిశాస్త్రి ఆయనకు పంచప్రాణాలయ్యారు. విప్లవపోరాటాలకు ప్రజలను కార్యోన్ముఖులను చేసే సాహితీ సృజన కోసం ఆయన విరసం ఉద్భవించే చారిత్రాత్మక పరిణామంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. 1970లో శ్రీశ్రీ షష్టిపూర్తి సభను ఇందుకు వేదికగా మలచారు. ఆ రెండు మహత్తర సంఘటనలూ శ్రీశ్రీకి, చలసానికి అత్యంత ఇష్టమైన విశాఖలోనే జరగడం విశేషం. అదే ఉత్సాహం విరసం ఏర్పడి నాలుగు దశాబ్దాలయినా చలసాని ఉత్సాహం అప్పటికీ ఇప్పటికీ ఝరీపాత సమానమే. ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండనే ఉంటుంది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోరు. విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలుస్తారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే. ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్తారు. ఉద్యమాలలో అగ్రపీఠిన నిలబడతారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా ఇంత భారాన్నీ మోస్తూ అంతర్లీనంగా ప్రవహించే చైతన్య స్రవంతితో నవయువకుడిగా పరుగులు తీశారు. ఆయన వాహనం నేటికీ ఏనాటికీ పంచకల్యాణి. ఆయన అలపూసొలుపూ లేని నవ్యోత్సాహ వాహిని. తెలుగుకు ఢోకా లేదు ‘కొందరు భయపడుతున్నట్టు తెలుగుకేం ఢోకా లేదు. గతంలో సంస్కృతాన్ని, ఇప్పుడు ఇంగ్లీషును ఎదిరించి నిలిచిన భాష తెలుగు. ఏ భాషా పదాన్నయినా తనలో కలుపుకొని ఎదిగే శక్తి తెలుగుకు ఉంది. అందుకే తెలుగు అజరామరం. తెలుగు భవిష్యత్తు ఉజ్వలం’ అని చలసాని చెబుతారు. ఏ మూల చూసినా పుస్తకాలే ఏడెనిమిది మంది డాక్టరేట్లకు ఇవే ఆధారం.. ఎవరైనా ఇల్లు నివసించడానికి కట్టించుకుంటారు. చలసాని మాత్రం పుస్తకాలను కొలువు తీర్చడానికే ఇంటిని కట్టుకున్నారు. మేడమీద ఓ గది వేసినా, ఇంటిని ఇంకాస్త పొడిగించినా అది పుస్తకాల కోసమేనంటారు. అందరిళ్లలో దేవుడి గది, భోజనాల గది వగైరా ఉంటే ఆయన ఇంట్లో శ్రీశ్రీ గది, రావి శాస్త్రి గది, కొకు గది అని ఉంటాయి. ఇంట్లోని ఎనిమిది గదుల్లోనూ పుస్తకాలే ఉంటాయంటే చలసాని అభిమానం ఎటువంటిదో అర్థమవుతుంది. ఆయన పుస్తకాలయంలో ఇరవై వేల పుస్తకాలున్నాయంటే ఆ మమకారం ఏపాటిదో అవగతమవుతుంది. ఆయన దగ్గరి పుస్తకాల ఆధారంగా ఏడెనిమిది మంది పీహెచ్డీలు చేశారు. ఎందరో పఠనాభిలాషులు వచ్చి నిత్యం ఏదో సమాచారం సేకరించుకుని పోతూ ఉంటారు. ‘పోలీసులెవరికైనా పార్వతీపురం కుట్రకేసుపై ఏవైనా సందేహాలు తలెత్తితే హోంశాఖ ప్రచురించిన 22 భారీ సంపుటాల కోసం చలసాని ఇంటికి రావాల్సిందే’ అని ఆయన సన్నిహితులు అంటారు. అడ్డపొగ ఇష్టం విశాఖపట్నం అంటే, ఉత్తరాంధ్ర మహిళాలోకమంటే చలసానికి చాలా అభిమానం. ‘ఉత్తరాంధ్ర మహిళలు శ్రమజీవులు. కల్లాకపటం లేనివారు’ అంటారాయన. వారి నిష్కపటం, శ్రమజీవనం, వినయం గొప్ప విషయాలని చెబుతారు. ఇక్కడి గ్రామీణ మహిళలు అడ్డపొగ కాల్చడం నచ్చుతుంది.. అంటారు చలసాని. విశాఖ అంటే శ్రీశ్రీ. విశాఖ అంటే రావిశాస్త్రి. జీవితమంతా విశాఖే. అందుకే ఈ ఊరంటే ప్రత్యేక మమకారం.. అని చెబుతారు. అందరికీ బాబాయ్ ఆమధ్య అమరుడైన మావోయిస్టు నేత ఆజాద్ నుంచి వర్థమాన రచయతల వరకు అందరికీ ఆయన బాబాయ్గా చిరపరిచితుడు. ఎవరు బాబాయ్ అని పిలిచినా చలసాని మహాకవికి మాత్రం ఆయన వేరే వరస! చలసానిని శ్రీశ్రీ సరదాగా నా మూడో భార్య అని వ్యవహరించేవారట మరి! ఎన్నో అవతారాలు కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమం లో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. జీవన చిత్రం పుట్టినది: 08-12-1932 మరణం: 25-07-2015 జన్మస్థలం: భట్ల పెనుమర్రు, కృష్ణాజిల్లా తల్లితండ్రులు: బసవయ్య, వెంకట నరసమ్మ భార్య: (దివంగత) విజయలక్ష్మి కుమార్తెలు: నవత ( జర్నలిస్ట్), మమత ( ఏవీఎన్ కాలేజీ లెక్చరర్) చదువు: ఎం.ఎ (పొలిటికల్ సైన్స్) ఏయూ-1957 ఉద్యోగం: మత్స్యశాఖలో ఎల్డీసీ 1957-59 రైల్వేలో క్లర్క్ 1960-62 కలిమి లేములు తదితర సినిమాలకు సహాయ దర్శకుడు దర్శకుడు ప్రత్యగాత్మకు సహాయకుడు 1963-67 ఏవీఎన్ కళాశాల రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు 1968-92 -
విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత
-
విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత
విశాఖ : ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విరసం నేత చలసాని ప్రసాద్ (83) శనివారం కన్నుమూశారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఇంటికి చేరుకునే లోపు చలసాని ప్రసాద్ తుది శ్వాస విడిచారు. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో చలసాని ప్రసాద్ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాంస్కృతిక సాహిత్య ఉద్యమంలో చలసాని ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకుల్లో అత్యంత ముఖ్యులలో చలసాని ప్రసాద్ ఒకరు. ఎమర్జెన్సీ హయాంలో ఆయన జైలుకు వెళ్లారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చలసాని ప్రసాద్ అనేక సార్లు జైలుకు వెళ్లారు. మహాకవి శ్రీశ్రీ, ప్రముఖ రచయితలు కొడవటిగంటి, రావిశాస్త్రి, రమణారెడ్డి తదితరులతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అనేక అరుదైన పుస్తకాలకు చలసాని ప్రసాద్ సంకలన కర్తగా వ్యవహారించారు. సినిమా, సాహిత్యం రంగాలపై లోతైన అవగాహాన ఉంది. చలసాని ప్రసాద్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు పలువురు సంతాపం తెలిపారు. -
రచయితలారా.. మీరెటువైపు?
విప్లవ రచయితల సంఘం (విరసం) 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 12వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు విరసం నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. విప్లవ విద్యార్థి వివేక్ అమరత్వ స్ఫూర్తితో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. జూన్ 12న వరంగల్- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మడకం జోగి, మడకం దేవెలతో పాటు.. హైదరాబాద్లో న్యాయవిద్య చదువుతున్న వివేక్ కూడా మరణించిన విషయాన్ని విరసం నేతలు ప్రస్తావించారు. ఈ సమయంలో ''రచయితలారా.. మీరెటువైపు'' అనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో బంగారాన్ని, చంద్రబాబు చెప్పే నవ్యాంధ్రలో నవ్యతను చూడటం అజ్ఞానమేనని ఆ ప్రకటనలో విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంచులా మోగాల్సిన కంఠాలు కరువవ్వడం అన్నింటికంటే విషాదమని తెలిపారు. ఇక 12వ తేదీనాటి సభలో వివిధ అంశాలపై వివిధ వక్తలు ప్రసంగిస్తారు. 'మేడిన్ ఇండియా - కాషాయీకరణ - జనతన సర్కార్ ప్రత్యామ్నాయం' అనే అంశంపై పాణి, 'ప్రజావ్యతిరేక భూసేకరణ ఆర్డినెన్సు'పై రవికుమార్, 'తెలంగాణలో పాలకుల ఎజెండా - ప్రజల ఎజెండా' అనే అంశంపై కాశీం, 'ఆంధ్రప్రదేశ్ పాలకుల ఎజెండా - ప్రజల ఎజెండా' అనే అంశంపై వరలక్ష్మి, 'మళ్లీ అదే ప్రశ్న .. రచయితలారా మీరెటువైపు' అనే అంశంపై వరవరరావు ప్రసంగిస్తారు. ఇదే సందర్భంలో వివిధ రచయితలు రాసిన 11 పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ప్రజా కళామండలి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
‘జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది’
విశాఖపట్నం: నిజాయితీగా తీర్పులివ్వకపోతే జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం అన్నారు. చుండూరు నరమేధంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ‘జడ్జీల నియూమకం-వారి జవాబుదారితనం’పై విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జరిగింది. ముందుగా అంబేద్కర్ భవన్ నుంచి రామాటాకీస్, ఆశీల్మెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో తారకం మాట్లాడారు. చుండూరు కేసులో నిందితులు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారనే కారణాన్ని చూపుతూ హైకోర్టు జడ్జి వారిని విడుదల చేస్తూ తీర్పు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో నిందితులకు తిరిగి శిక్ష అమలు పడేలా చూస్తామన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కో-ఆర్డినేటర్ కంచర్ల శేషు, విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు చలసాని ప్రసాద్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ రామారావు, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యుడు జె.వి.ప్రభాకర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ, జనచైతన్యమండలి ప్రతినిధి ఎల్.కృష్ణ, అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో విరసం వరవరరావు