ప్రొఫెసర్‌ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు | Police Raids On Virasam State Secretary Professor Khasim House | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు

Jan 18 2020 10:01 AM | Updated on Jan 18 2020 2:39 PM

Police Raids On Virasam State Secretary Professor Khasim House - Sakshi

సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

గజ్వేల్‌ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. అయితే, ప్రొఫెసర్‌ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు. నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్‌ వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement