-
జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. పెరుగుతున్న డెంగీ కేసులు..
ఆదిలాబాద్టౌన్: వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నా యి. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలువృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభా వం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవే ట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి పోతున్నా యి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం రిమ్స్ ఆస్పత్రి ఓపీ విభాగం రోగులతో కిటకిటలాడింది. పేరు నమోదుకు జనం బారులు తీరా రు. దాదాపు 1500 మంది వరకు వైద్యం కోసం తరలివచ్చారు. అయితే ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు.. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా జ్వరాలు ప్ర బలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా డెంగీ కేసులు పెరిగాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 23 నమోదవగా, ఇందులో ఈనెలలోనే 5 నమోదైనట్లు వైద్యులు తెలిపారు. జిల్లాకేంద్రంలోని కేఆర్కే కాలనీ, చిల్కూరి లక్ష్మీనగర్తో పాటు ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లిలో డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మలేరియా కేసులు ఈఏడాది 2 నమోదు కాగా, తాంసిలో 1, నర్సాపూర్(టి)లో మరో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. సాధారణ జ్వరాలు ఈనెలలో వెయ్యికి పైగా నమోదయ్యాయి. రోగులతో కిటకిట.. జిల్లా కేంద్రంలోని రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,అర్బన్హెల్త్సెంటర్లు, జిల్లాకేంద్రంలోని ప్రైవే ట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో జ్వరాల కేసులు అధికంగా ఉ న్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచం బారిన పడుతున్నారు. కాగా మార్చిలో సాధారణ జ్వరాలు 1617,ఏప్రిల్లో 1558, మేలో 1628, జూన్ లో 1571, జూలైలో ఇప్పటివరకు వెయ్యికి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. బ్రీడింగ్ చెక్కర్ల నియామకం.. సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో 25 మంది బ్రీడింగ్ చెక్కర్లను నియమించింది. డిసెంబర్ వరకు వీరిని కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒ క్కో బ్రీడింగ్ చెక్కర్ రోజుకు వంద ఇళ్ల చొప్పున సర్వే చేస్తారు. వ్యాధులపై అవగాహన కల్పిస్తారు. డెంగీ జ్వరాలు ప్రబలిన చోట స్ప్రే చేయిస్తారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించే విధంగా చర్యలు చేపడతారు. ప్రత్యేక దృష్టి.. వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచారు. కలెక్టర్ సమక్షంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కళాజాత బృందాలతో గోండీ భాషలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంద్రవెల్లి, దంతన్పల్లి, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్ మండల వాసుల కోసం ప్రత్యేకంగా ఐదు అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. 16 ట్రైబల్ పీహెచ్సీల్లో ప్రతిరోజు ర్యాపిడ్ సర్వే చేపడుతున్నారు. మైదాన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పల్లె దవాఖానాల్లో మందులు, 14 రకాల టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది నమోదైన డెంగీ కేసులు -23 (ఈ నెలలో 05), సాధారణ జ్వరాలు -6,500, మలేరియా కేసులు -02 హైరిస్క్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలుతాయి. వారంలో రెండు రోజులు డ్రైడే పాటించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ర్యాపిడ్ సర్వే చేయిస్తున్నాం. బ్రీడ్చెక్కర్లను నియమించాం. ఆస్పత్రుల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
విషజ్వరాలతో విలవిల
మంచంపట్టిన కొండకిందిగూడెం – 100కు చేరిన జ్వరపీడితుల సంఖ్య – నలుగురి పరిస్థితి విషమం – హైదరాబాద్, సూర్యాపేట ఆస్పత్రులకు తరలింపు – పారిశుద్ధ్య లోపంతోనే రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తుల ఆవేదన – పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు కేతేపల్లి: కేతేపల్లి మండలం కొండకిందిగూడెలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 100 మంది గ్రామస్తులు మంచం పట్టారు. గ్రామంలో సుమారు 350 కుటుంబాల్లో 1500 వరకు జనాభా ఉన్నారు. వారం రోజులుగా ఒకొక్కరిగా జ్వరాల బారిన పడుతూ, జ్వరాలు కాస్త ముదిరి ఒకరొ నుంచి మరొకరికి సోకి గ్రామం మొత్తం విస్తరించిపోయింది. ప్రతి ఇంట్లో ఒకరి నుంచి ఇద్దరు జ్వరపీడితులున్నారు. మాజీ సర్పంచ్ కోట్ల రాములు, రాచకొండ సుగుణమ్మ, కేశబోయిన సతీష్, నర్సింగ్ సతీష్, బండారు శ్రీరాములు, కోట్ల లింటమ్మ, కోట్ల నాగయ్య, తెట్టి నాగులు, అల్లి వీరస్వామి, దొతం నాగయ్య, వంగూరి మార్తమ్మ, అల్లి అంజి మరో ఇరవై ఐదు కుటుంబాల వ్యక్తులు విషజ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట, హైదరాబాద్లలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం గ్రామంలోడ్రెయినేజీ సక్రమంగా లేకపోవటంతో పాకరిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లో పేరుకపోయిన మురుగును తొలగించక పోవటం వల్ల ఈగలు, దోమల వ్యాప్తి పెరగటంతో పాటు దుర్వాసన వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి నుంచి తాగునీటి ట్యాంకును శుభ్రం చేయక పోవటంతో తాగునీరు కలుషితపై వాధ్యుల భారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరపీడితులకు వైద్యపరీక్షలు విష జ్వరాలతో బాధపడుతున్న కొండకిందిగూడెం ప్రజలకు గురువారం కేతేపల్లి ప్రాథమిక కేంద్రం ఆద్వర్యంలో వైద్య పరీక్షలు నిరహించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి 288 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తీవ్ర అస్వస్థకు లోనయిన వారికి అక్కడే సెలైన్ ఎక్కించి, ఇంజక్షన్లు చేశారు. జ్వరంతో బాధపడుతున్న 68 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నిల్వ చేసిన నీటిని తాగటం వల్లనే సీజనల్గా విషజ్వరాలు వస్తున్నాయని మండల వైద్యాధికారి లక్ష్మికాంత్ తెలిపారు. కాచి వడబోసిన నీటిని తాగటంతో పాటు, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రక్త నమూనాల రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యశిబిరంలో సర్పంచ్ డి.సాయిరెడ్డి, నకిరేకల్ ఎసీపీహెచ్వో చరణ్దాస్, సీహెచ్ఓ సందర్నాయక్, వైద్యసిబ్బంది జగదీష్రెడ్డి, దయామణి, రుక్మారెడ్డి, రాజమ్మ, అనిత, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement