breaking news
BY Vijayendra
-
కర్ణాటకలో మరో నాయకత్వ మార్పు?
కర్ణాటకలో ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు గురించే అక్కడి రాజకీయ వర్గాల్లో ఎక్కవగా చర్చ నడుస్తోంది. సీఎం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పును కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని కన్నడ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏదోరకంగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో చాప కింద నీరులా ప్రతిపక్ష బీజేపీలోనూ ముసలం మొదలైంది. అయితే దీనిపై మీడియా అంతగా ఫోకస్ చేయలేదు.కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర (BY Vijayendra) సీటు కిందకు నీళ్లు వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆయన నాయకత్వంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తేలడంతో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని విజయేంద్రపై కేంద్ర నాయకత్వానికి పలువురు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. సీనియర్ నేతలతో సఖ్యతగా ఉండడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. విజయేంద్రతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక పనితీరుపైనా రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ను నిర్లక్ష్యం చేయడం వల్లే పార్టీలో సమస్యలు తలెత్తాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.రంగం దిగిన 'అప్పా'కొడుకు పదవికి గండం ఏర్పడే పరిస్థితులు నెలకొనడంతో విజయేంద్ర తండ్రి, మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) స్వయంగా రంగం దిగారు. తన కుమారుడిపై స్థానిక నేతలు, క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆయన పయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను సావధానంగా వింటున్నారు. అసంతృప్తులను బుజగించి గ్యాప్ తగ్గించేందును తన అనుభవాన్ని వాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా నాయకత్వం ముందు ప్రసావించడానికి వీలుగా ఒక వేదికను కల్పించేందుకు యడియూరప్ప తిరిగి వచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. "ఇది విజయేంద్ర తన సొంత నియోజకవర్గం శికారిపురపై దృష్టి పెట్టడానికి కూడా అవకాశం ఇస్తుంది" అని ఒక సీనియర్ కార్యకర్త అన్నారు.2023 నవంబర్లో విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యడియూరప్ప క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొడును గండం నుంచి తప్పించడానికి ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. బెంగళూరులోని జగన్నాథ్ భవన్లో ప్రతిరోజు నాయకులు, కార్యకర్తలకు పెద్దాయన అందుబాటులో ఉంటున్నారు. రాజకీయంగా ఆయన ఇంకా చురుగ్గానే ఉన్నారని, గణనీయమైన ప్రభావాన్ని చూపగలరని సన్నిహితులు పేర్కొంటున్నారు.విజయేంద్రకు వ్యతిరేకంగా పావులుపార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఎమ్మెల్యేలు బిపి హరీష్, మాజీ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర నేతృత్వంలోని వర్గాలు.. విజయేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. లింబవల్లి, రమేష్ జార్కిహోళి, ప్రతాప్ సింహా, హరీష్ తదిరత నాయకులు కూడా విజయేంద్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో అసమ్మతిని గుర్తించిన అధినాయకత్వం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని (Pralhad Joshi) కర్ణాటకకు పంపించింది. అసమ్మతి నేతలతో ఆయన జరిపిన సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని అంతర్గత వర్గాల సమాచారం. ఇంత జరుగుతున్నా విజయేంద్రకే పార్టీ మద్దతుగా నిలిచింది. అసమ్మతి గళం వినిపించిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ను సస్పెండ్ చేసి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని సందేశం పంపింది.నాయకత్వ మార్పు తప్పదా?కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటక పర్యటన తర్వాత పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. విజయేంద్ర శిబిరం నమ్మకంగా ఉన్నప్పటికీ, నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు మొదలయ్యాయి. విజయేంద్ర ఢిల్లీ పర్యటన కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక (R Ashoka) కూడా హస్తినలో ఉండడంతో ప్రచారం జోరందుకుంది. అయితే ప్రతిపక్ష నేతను మార్చే అవకాశం ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది.చదవండి: స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్! ఏమైనా జరగొచ్చు..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని మేము అనుకోవడం లేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిని మార్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. ఏమైనా జరగొచ్చు అంటూ మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. "ఎవరూ హైకమాండ్ మనసును చదవలేరు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. పార్టీని ఏకం చేసి మమల్ని ఎన్నికల మోడ్లోకి నడిపించగల వ్యక్తిని అధినాయకత్వం ఎంపిక చేస్తుంద"ని అన్నారు. మరి కొడుకును కాపాడటానికి కోసం రంగంలోకి దిగిన యడియూరప్ప తాను అనుకున్నది సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాలి. -
దమ్ముంటే నిరూపించండి
సాక్షి బెంగళూరు: తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని, 50 మంది ఎమ్మెల్యేలను కొనడానికి కుట్రలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది. సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని గురువారం సిద్ధరామయ్యకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడానికి తాము ప్రయత్నించినట్లు నిరూపించకపోతే ప్రజలు ఎప్పటికీ ఆయనను నమ్మరని తేల్చిచెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకుడి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయని, ఆరోపణలను ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. అయితే, విజయేంద్ర సవాలుపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మరోవైపు బీజేపీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ సమర్థించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన సంగతి నిజమేనని గురువారం చెప్పారు. పలువురు మంత్రులు సైతం సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందందని వారు పేర్కొన్నారు. -
కర్ణాటకలో మళ్లీ అధికారం బీజేపీదే..!
-
ఢిల్లీ టూర్తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం
శివాజీనగర: రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యార్థకమైంది. పరిపాలనలో విజయేంద్ర వేలు పెడుతున్నారని, సీఎంను మార్చాలని యడ్డి వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అరుణ్సింగ్ను కలుస్తారని తెలిసింది. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే అవకాశముది ఇది మూడు ముక్కల ప్రభుత్వమని మంత్రి యోగీశ్వర్ ఇటీవల విమర్శలు చేయడంపై విజయేంద్ర ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన వల్ల పారీ్టకి, ప్రభుత్వానికి అవమానమైందని, వీలైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే అవకాశముంది. బళ్లారి జిల్లాలో జిందాల్కు ఇచ్చిన 3 వేల ఎకరాలకు పైగా భూమిని వెనక్కు తీసుకోవడంపైనా వివరణ ఇవ్వనున్నారు. హైకమాండ్ వద్ద తన వాదనను వినిపించేందుకు యడియూరప్ప తనయున్ని పంపినట్లు తెలిసింది. సీఎం మార్పు ఉండదు మైసూరు: ఢిల్లీకి ఎవరు, ఎందుకు వెళ్లారు అన్న విషయం నాకు తెలియదు, సీఎంగా యడియూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారని బీజేపి జాతీయ కార్యదర్శి సి.టి.రవి అన్నారు. మంగళవారం మైసూరులో ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడారు. బీ.వై. విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకులు అన్నాక అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కరోనా సమయంలో రాజకీయాలువద్దని అన్నారు. సీఎం మార్పు ఉండబోదని చెప్పారు. -
రూల్స్ బ్రేక్ చేసిన సీఎం కుమారుడు, భార్యతో కలిసి..
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే వాటిని కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడే స్వయంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. సీఎం కుమారుడు, బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. భార్యతో కలిసి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్థగంటకు పైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సందర్శన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తనయుడు కావడంతో ఆలయ అధికారులు కూడా కోవిడ్ నిబంధనల్ని పక్కన పెట్టేశారు. ఆయనకు వీఐపీ మర్యాదలన్నీ చేశారు. కాగా, బీవై విజయేంద్ర ఆలయ సందర్శన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా? అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆలయాలన్నీ మూసివేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రూల్స్ను బ్రేక్ చేసిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా విజయేంద్ర ఆలయంలో పూజలు చేపట్టడం పలు విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఒక రూల్.. నాయకులకు ఒక నిబంధన ఉంటదా? అని స్థానికులూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయేంద్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: గొర్రెల ధర్నా: బర్త్ డే నాడు గవర్నర్కు చేదు అనుభవం