breaking news
vijayabhaskar
-
పాల్ ల్యాబ్స్ తో ఆధునిక విద్యాబోధన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాల్ ల్యాబ్స్కు శ్రీకారం చుట్టినట్లు పాల్ ల్యాబ్స్ రాష్ట్ర నోడల్ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గుంటూరులోని ఏసీ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియెంటేషన్ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా నోడల్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్ ల్యాబ్స్ మంజూరు చేసిన 60 పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో పాటు గణిత, సైన్స్ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయకర్త కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ పాల్ కార్యక్రమ ఉద్దేశం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను వివరించారు. -
రోడ్స్ బ్లాకు...
‘ఆకు పాకు ఇస్తరాకు.. ఆల్ సైడ్స్ రోడ్స్ బ్లాకు..’ అంటూ సాగే పాట ‘జిలేబి’ చిత్రంలోనిది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘మన్మథుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇది. శ్రీ కమల్, శివానీ రాజశేఖర్ జంటగా గుంటూరు రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘ఆకు పా కు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పా డారు. -
ఇద్దరు మంత్రులపై కేసు ?
► విచారణాధికారిగా ఏఎస్పీ శంకర్ ► మంత్రి విజయభాస్కర్కు సమన్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఆదాయ పన్నుశాఖ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ను విచారణాధికారిగా కమిషనర్ కరణ్ సిన్హా నియమించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచే నగదు బట్వాడా సాగినట్లు ఎన్నికల కమిషన్కు సమాచారం అందింది. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన రాష్ట్రం నలుమూలలా ఐటీ దాడులు సాగాయి. ఈ సమయంలో మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించినట్లుగా చెన్నై పోలీస్ కమిషనర్కు ఐటీ ఉన్నతాధికారులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ మంత్రులపై కేసు నమోదుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నేతృత్వంలో సంఘటనపై విచారణ జరిపేందుకు కమిషనర్ నిర్ణయించారు. ఇదిలా ఉండగా, దాడుల తరువాత కార్యాలయానికి ఐటీ కార్యాలయంలో హాజరైన మంత్రి విజయభాస్కర్కు మరలా సమన్లు పంపారు. ఈ సమన్ల ప్రకారం శుక్రవారం ఉదయం అధికారుల విచారణకు మంత్రి మరోసారి హాజరుకావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలను చూపి మంత్రి హాజరుకాలేదు. మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్కుమార్ ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు మంత్రికి దినకరన్ బాసట మంత్రి విజయభాస్కర్కు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆయనకు బాసటగా నిలిచారు. మంత్రి విజయభాస్కర్ను పదివి నుంచి తప్పించడమో లేక రాజీనామా కోరడమో అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దినకరన్ గెలుపు కోసమే మంత్రి నగదు పంపిణీ చేసిన సంగతి పాఠకులకు విదితమే. తన గెలుపుకోసం ఐటీ ఉచ్చులో పడి అవస్థలు పడుతున్న మంత్రికి ఆయన భరోసా ఇస్తూ బహిరంగ ప్రకటన చేశారు. -
‘రెండు లక్షల ఈత, ఖర్జూర చెట్లు పెంచుతాం’
స్వచ్ఛమైన కల్లు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన తాండూరులోని ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం కింద తమ శాఖ పరిధిలో 2 లక్షల ఈత, ఖర్జూర మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు. పట్టాభూముల్లో వీటిని పెంచుతామని, దరఖాస్తు చేసుకున్న వారికి మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. పెంపకం దారులకు మొక్కకు కొంతమొత్తం చొప్పున సొమ్మును కూడా అందజేస్తామని వెల్లడించారు. -
గుండె గుప్పెండంత ఊహ ఉప్పెనంత...
సినిమా వెనుక స్టోరీ - 38 ఆ హాల్లో నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు విజయభాస్కర్ మొదలుకొని ఆఫీసుబాయ్ దాకా పది, పదిహేను మంది ఉన్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్తో సహా కథ చెబుతున్నాడు. కొందరు ముసి ముసిగా నవ్వుతుంటే, ఇంకొందరు పగలబడి నవ్వుతున్నారు. ఈ రియాక్షన్స్ అన్నీ రవికిశోర్ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ‘శుభం’ అంటూ త్రివిక్రమ్ స్క్రిప్టు మూసేశాడు. అక్కడున్నవాళ్లంతా త్రివి క్రమ్కి కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్ భాస్కర్ - త్రివిక్రమ్ ఇద్దర్నీ రవికిశోర్ హగ్ చేసుకున్నారు. ఆ హగ్లోనే తెలిసి పోయింది... కథ ఎంత బాగా నచ్చేసిందో! ‘నువ్వేకావాలి’ ఉషాకిరణ్ మూవీస్ బ్యానలో రూపొందినా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మేకింగ్ అంతా చూసు కున్నది రవికిశోరే. ‘నువ్వే కావాలి’ ఎండింగ్లో ఉండగానే విజయ్భాస్కర్, త్రివిక్రమ్లిద్దరికీ అడ్వాన్స్ ఇచ్చేసి ‘‘నెక్స్ట్ సినిమా కూడా మనం కలిసి చేస్తున్నాం’’ అనేశారాయన. వాళ్లిద్దరూ ఆయనకు అంత బాగా కనెక్టయిపోయారు. వాళ్లతో పని చేస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోంది. ఇలాంటి ఫీలింగ్ అతి కొద్దిమంది దగ్గరే కలుగు తుంది. ‘నువ్వే కావాలి’ రిజల్ట్ ఎలా ఉన్నా సరే, వాళ్లిద్దరితో కలిసి పనిచేయాలని రవి కిశోర్ డిసైడయ్యారు. అలాగని ‘నువ్వే కావాలి’ మీద డౌట్లు లేవాయనకు! ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ నమ్మకమే నిజమైంది. ‘నువ్వే కావాలి’ ఇండస్ట్రీని ఊపేసింది. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే ముగ్గురూ నెక్స్ట్ సినిమా పనిలో పడ్డారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో శ్రీనివాస్ అపార్ట్మెంట్. థర్డ్ ఫ్లోర్లో శ్రీ స్రవంతీ మూవీస్ ఆఫీస్. అక్కడ రెండు నెలలు కూర్చుని త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు రెడీ చేసేశాడు. దాన్ని మెయిన్ టీమ్ అందరికీ వినిపిస్తే హండ్రెడ్ మార్క్స్ వేసేశారు. ఎప్పుడో దర్శకుడు కేవీరెడ్డి గారి టైమ్లో ఇలా టీమ్ అందరికీ స్క్రిప్టు వినిపించేవారట. రవికిశోర్కు కూడా ఆ పద్ధతి ఇష్టం. ఆయన ఎంత హ్యాపీ అంటే బ్రీఫ్ కేస్లో చెక్కు బుక్కులన్నీ తీసేసి, ఈ స్క్రిప్టే పెట్టుకుని తిరుగుతున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా తనివి తీరా చదువు కుంటున్నారు. కథ మొత్తం కంఠస్థం వచ్చేసింది. ఏ హీరోతో అయినా చేయడానికి రెడీ. కానీ ఈ కథ ఎవరికో రాసిపెట్టే ఉండుంటుంది. అవును... రాసి పెట్టి ఉంది... వెంకటేశ్కి! రవికిశోర్కి నిర్మాత డి.సురేశ్బాబు చాలా క్లోజ్. అక్కడ్నుంచి ప్రపోజల్. ‘‘విజయ్భాస్కర్ - త్రివి క్రమ్లతో చేయడానికి మా వెంకటేశ్ రెడీ! మీకు ఓకేనా?’’ అంత పెద్ద హీరో పిలిచి డేట్లు ఇస్తానంటే, ఎవరు మాత్రం కాదంటారు? రవికిశోర్కు బ్రహ్మాండంగా ఓకే త్రివిక్రమ్ కథ చెప్పాడు. వెంకటేశ్ ఫ్లాట్! ‘‘వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరె జేషన్’’ అనుకున్నాడు. కానీ వెంకటేశ్కో డౌట్! సెకండాఫ్ మొత్తం ఓ ఇంట్లోనే నడిచి పోతోంది. ఆడియన్స్కి కొంచెం రిలీఫ్ కావాలి కదా! అవును నిజమే! గుడ్ సజెషన్. ఎంతైనా సీనియర్ సీనియరే! ‘మిస్టర్ బీన్’ ఇన్స్పిరేషన్తో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి, అతణ్ణి హీరో హీరోయిన్లకు తారసపడేలా చేస్తే...? త్రివిక్రమ్ అదే చేశాడు. బ్రహ్మానందం లాంటోడు ఈ క్యారెక్టర్ చేస్తేనా...? లాంటోడేంటి? బ్రహ్మానందమే చేస్తాడు. చేయాలి కూడా! ఓకే అన్నాడు కూడా! క్యారెక్టర్స్ అన్నిటికీ స్టార్స్ ఫిక్స్డ్. కేవలం టూ క్యారెక్టర్స్ బ్యాలెన్స్. ఒకటి - హీరోయిన్ పాత్ర. రెండోది - హీరోయిన్ ఫాదర్ పాత్ర. ప్రొడ్యూసర్, డెరైక్టర్లిద్దరికీ ఒకటే చాయిస్... ప్రకాశ్రాజ్! అతనైతే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ ప్రకాశ్రాజ్ ఆ టైమ్లో ఫుల్ బిజీ. దానికి తోడు ఫుల్ ట్రబుల్స్లో కూడా ఉన్నాడు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వాళ్లు అతని మీద బ్యాన్ పెట్టారు. ప్రకాశ్రాజ్ను తెలుగు సినిమాల్లో పెట్టుకోవడానికి వీల్లేదు. రవికిశోర్కి కోపం వచ్చింది. ‘‘నా క్యారెక్టర్కి అతనే కావాలి. నేను అతణ్ణే పెట్టుకుంటాను.’’ పరిస్థితి కొంచెం హాట్ హాట్గానే ఉంది. నాజర్, రఘువరన్ లాంటి వాళ్లతో ఈ పాత్ర చేయించేయొచ్చు. కానీ, ప్రకాశ్రాజ్ అయితేనే ఆ డెప్త్ వస్తుంది. అందుకే ఓ పని చేస్తే? ప్రకాశ్రాజ్ సీన్స్ అన్నీ పెండింగ్లో పెట్టి, మిగతా వెర్షన్ కంప్లీట్ చేసేస్తే? బాగానే ఉంది కానీ, హీరోయిన్ తేలడం లేదు. త్రిష... ఇంకెవరో... ఎవరో... చాలా ఆప్షన్స్. కానీ ఫ్రెష్ ఫేస్ అయితే నే బాగుంటుంది. విజయభాస్కర్ ముంబై వెళ్లాడు. మోడల్ కో-ఆర్డినేటర్స్ దగ్గర చాలామంది అమ్మాయిల స్టిల్స్ చూశాడు. వాళ్లల్లో ఒకమ్మాయి నచ్చేసింది. ‘పాగల్పన్’ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. పేరు - ఆర్తీ అగర్వాల్. కానీ ఇప్పుడు న్యూయార్క్లో ఉంది. నో కాంటాక్ట్. మామూలుగా అయితే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేవారు. కానీ, ఆ పాత్ర ఆమెకే రాసిపెట్టినట్టుంది. అందుకే న్యూయార్క్లో ఆమె గురించి వేట మొదలైంది. సురేశ్బాబు ఫ్రెండొకరు న్యూయార్క్లోనే ఉంటారు. ఆయన ద్వారా ట్రై చేస్తే దొరికేసింది. ఆర్తి వచ్చీ రావడంతోనే షూటింగ్ స్టార్ట్. సినిమా మొత్తం దాదాపు హీరోయిన్ ఇంట్లోనే! అందుకే నానక్రామ్గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్సెట్ వేయించేశారు. 60 లక్షల ఖర్చు. సీన్లు.. సాంగ్స్.. షూటింగ్ చకచకా సాగిపోతోంది. అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. న్యూజిలాండ్లో రెండు పాటలు తీయాలి. అదీ నెక్స్ట్ షెడ్యూల్లో! ఈలోగా అక్కడ నుంచి ఫోన్! ‘‘సీజన్లో చేంజ్ ఉంది. మీరొచ్చే టైమ్కి గ్రీనరీ ఉండదు. వస్తే ఇప్పుడే రావాలి’’. ఇక్కడేమో 10 - 15 మంది ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతోంది. ఇది అర్ధంతరంగా వదిలేసి, న్యూజిలాండ్ వెళ్తే మళ్లీ డేట్లు దొరకడం కష్టం. రవికిశోర్ ఒకటే అన్నారు. ‘‘మనుషుల డేట్లు ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రకృతి డేట్లు మన చేతిలో ఉండవు.’’ షెడ్యూల్ ఆపేసి మరీ న్యూజిలాండ్ వెళ్లారు! ఫ్లయిట్లో ఆ రెండు పాటలూ వింటూనే ఉంది ఆర్తి. తెలుగు అస్సలు రాకపోయినా వినీ వినీ బట్టీ వచ్చేశాయామెకు! న్యూజిలాండ్లో దిగగానే ఆ పాటలు పాడేయడం కూడా మొదలుపెట్టింది. తీరా అక్కడికి వెళ్లాక వెంకటేశ్కి ఫుల్ ఫీవర్. ఆ ఫీవర్తోనే షూటింగ్ చేసేశాడు. న్యూజిలాండ్ నుంచి సరాసరి చెన్నైలో ల్యాండింగ్. అక్కడ ‘ఎం.జి.ఎం. అమ్యూజ్మెంట్ పార్క్’లో షూటింగ్. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం, ‘కళ్లు’ చిదంబరం, బేబీ పింకీలపై కామెడీ సీన్స్. అక్కడి నుంచి మళ్లీ ఊటీ. త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహాత్మ్యమో, రవికిశోర్ ప్లానింగ్ చిత్రమో, విజయ భాస్కర్ దర్శక చాతుర్యమో కానీ షూటింగ్ చాలా స్మూత్గా జరిగిపోతోంది. ‘పిక్నిక్’ అనేమాట అందరూ వాడేస్తుం టారు. కానీ, ఇక్కడ మాత్రం అది నిజం. 64 రోజులు 64 క్షణాల్లా గడిచిపోయాయి. ప్రకాశ్రాజ్ రిలేటెడ్ సీన్స్ ఒక్కటే బ్యాలెన్స్. వీళ్లకు అదృష్టం కలిసొచ్చింది. ఇక్కడ పరిణామా లన్నీ మారిపోయాయి. మునుపటి హీట్ లేదు. ప్రకాశ్రాజ్ నిరాహారదీక్షకు దిగడంతో అన్ని సమస్యలూ కొలిక్కి వచ్చేశాయి. ఆయనపై బ్యాన్ కూడా తీసే శారు. ఆ న్యూస్ వచ్చిన మరుక్షణం ప్రకాశ్ రాజ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సెట్లో ఉన్నాడు. కంటిన్యుయస్గా 17 రోజులు వర్క్ చేశాడు. హమ్మయ్యా... సినిమాకు గుమ్మడికాయ కొట్టేయొచ్చు! ఇప్పుడు అసలు పనంతా మ్యూజిక్ డెరైక్టర్ కోటి చేతిలో ఉంది. బ్రహ్మాండంగా రీ-రికార్డింగ్ చేయాలి. ఇదే టార్గెట్. నో టైమ్ లిమిట్. ట్వంటీ సిక్స్ డేస్ తర్వాత... రవి కిశోర్, విజయ్భాస్కర్ ఫైనల్ అవుట్పుట్ చూశారు. కొన్ని ఎపిసోడ్స్లో రీ-రికార్డింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. రవికిశోర్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. కోటికి అర్థమైపోయింది. మళ్లీ రికార్డింగ్ థియే టర్లో కూర్చున్నాడు. స్మాల్ చేంజెస్. 99కి 100కి ఒక్కటే కదా తేడా! అదిప్పుడు ఫుల్ ఫిల్ అయిపోయింది. రవికిశోర్ ఈసారి చూసి కోటిని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ హగ్లోనే రిజల్ట్ తెలిసిపోయింది. 2001 సెప్టెంబర్ 6... 3 గంటల 12 నిమిషాలు ఓపిక పడితే తప్ప రిజల్ట్ తెలియదు. అవును... ఈ సినిమా నిడివి అంతే! బయటికొచ్చిన వాళ్లంతా ‘‘సినిమా బాగుంది కానీ, లెంగ్త్ ఎక్కువైపోయింది’’ అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడిపోతున్నారు. రవికిశోర్ మాత్రం చాలా తాపీగా ఉన్నారు. ఆయనకు ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి భరోసా. ఆ టైమ్లో వెంకటేశ్కిది డిఫరెంట్ అటెంప్ట్. దానికి తోడు సినిమాలో నో ఫైట్స్. ఫ్యాన్స్లో కొంత డైలమా ఉంటుంది. నాలుగు రోజులు ఆగితే అంతా సెట్ అయిపో తుంది. అవతలేమో పెద్దపెద్దవాళ్లు కూడా ఫోన్లు చేసి, అరగంట సినిమా ఎడిట్ చేసేయమంటున్నారు. ముఖ్యంగా సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమంటున్నారు. రవికిశోర్ మాత్ర ం మొండిగా ఉన్నారు. ఒక్క షాట్ కూడా తీసేది లేదు. ఈ సినిమా సూపర్హిట్... అంతే. ఎస్... వన్ వీక్ తర్వాత రిజల్ట్ అదే! అందరూ ఈ సినిమాను ‘నువ్వు నాకు నచ్చావ్’ అనడం మొదలుపెట్టారు. ‘స్రవంతి’ రవికిశోర్ టేబుల్ మీద ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు ఎప్పుడూ ఉంటుంది. అదో ఇన్స్పిరేషన్ ఆయనకు! జాబ్ శాటిస్ఫేక్షన్ ... జేబు శాటిస్ఫేక్షన్ కలగాలంటే స్క్రిప్టే పరమావధి అనే విషయం ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది! వెరీ ఇంట్రస్టింగ్ ⇒వెంకటేశ్ పారితోషికం మినహాయిస్తే, ఈ సినిమాకైన బడ్జెట్ నాలుగున్నర కోట్ల రూపాయలు. ⇒ఈ సినిమాకు ఆర్తీ అగర్వాల్ పారితోషికం పది లక్షలు. ⇒తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్తో రీమేక్ చేశారు. యావరేజ్. కన్నడంలో మాత్రం హిట్. ⇒‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...’ పాట కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. ఫైనల్గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే అయ్యింది. - పులగం చిన్నారాయణ -
ఆ నలుగురి మధ్య..
ముగ్గురు యువకులు, ఓ యువతి మధ్య ప్రేమకథ -‘నిన్నే కోరుకుంటా’. సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక ముఖ్య తారలు. గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. అతిథులుగా నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రామ సత్యనారాయణ పాల్గొన్నారు. -
టేస్టీగా మసాలా రెడీ
వెంకటేష్, దర్శకుడు కె.విజయభాస్కర్ ఇద్దరూ నవ్వించడంలో సిద్దహస్తులే. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో అలరించాయి. ముచ్చటగా మూడో సారి వీరిద్దరూ కలిసి పనిచేయడం ఓ విశేషం అయితే, వీరితో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తోడవ్వడం మరో విశేషం. ఈ ముగ్గురు కలిసి నూరే మల్టీస్టారర్ ‘మసాలా’ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా! అంజలి హొయలు... షాజన్ పదమ్సీ తళుకులు ఈ ‘మసాలా’కు అదనపు ఆకర్షణలు. ఇటీవలే వెంకటేష్, రామ్, కోవై సరళ, జయప్రకాష్రెడ్డి, అలీపై చిత్రీకరించిన మసాలా రీమిక్స్ సాంగ్తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ‘స్రవంతి’రవికిషోర్ వచ్చే నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వెంకటేష్ ఇందులో దాదాగా నటిస్తున్నారు. ఆయన పాత్ర తీరు తెన్నులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఆహార్యంలోనూ, వాచకంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకొని వెంకటేష్ ఈ పాత్ర పోషించారు. అభిమానులనే కాక, ప్రతి ఒక్కరినీ ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. రామ్ పాత్ర కొత్తగా ఉంటుంది. అతని పాత్రలో భిన్న కోణాలుంటాయి. నటునిగా రామ్ని మరో మెట్టుపై నిలబెట్టే సినిమా అవుతుంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా తప్పకుండా అందరినీ అలరిస్తుందని నా నమ్మకం’’ అని ‘స్రవంతి’ రవికిషోర్ అన్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిదని, రెండున్నర గంటల పాటు చక్కని టైమ్పాస్ అని దర్శకుడు విజయభాస్కర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: రోహిత్శెట్టి, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కళ: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: డి.సురేష్బాబు, నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.