-
సైకో భర్త.. భార్యకు మత్తుమందు ఇచ్చి నిద్రపోగానే..
భర్త అంటే జీవితాంతం తన భార్యకు తోడునీడగా కలిసి జీవించాలి అంటారు. దాంపత్య జీవితంలో వచ్చే కష్టనష్టాలను భర్తిస్తూ బతుకు బండిని నడిపించాలి అంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం భర్త అనే పదానికి అర్థమే మార్చేశాడు. తన అర్థాంగిపై ఎవరూ చేయని దారుణానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలియడంతో ఆ మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అసలేం జరిగిందంటే.. వీడు భర్త కాదు శాడిస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ కి చెందిన డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి తినే అన్నంలో మత్తు మందును కలిపి ఇచ్చేవాడు. అది తిన్న ఆమె నిద్రలోకి జారుకునేది. ఆమె మత్తులోకి వెళ్లగానే పరాయి పురుషులను తన ఇంటికి పిలిపించి.. తన భార్యపై అత్యాచారం చేయించే వాడు. అంతేకాకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు ఆ దురదుర్మార్గపు భర్త. ఇదే తంతుని ఆమెకు తెలియకుండానే పదేళ్లపాటు నడిపించాడు. ఈ సమయంలో దాదాపు 92 మంది ఆ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 51 మంది.. 26 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిపారు. వీరిలో ఫైర్మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టు సహా పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దారుణమైన విషయాన్ని ఫ్రాన్స్ లో ది టెలిగ్రాఫ్ అనే పత్రికలో వెల్లడించారు. పొగతాగి, మద్యం సేవించి, పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చేవారిని డొమినిక్ అనుమతించేవాడు కాదు. ఎందుకంటే ఆ వాసనతో తన భార్యకు మెలుకువ వచ్చే అవకాశం ఉందని.. తన బండారం బయటపడుతుందని భావించేవాడు. అంతేకాకుండా బండ్లను తన ఇంటి ముందు కాకుండా దూరంగా పార్కింగ్ చేసి రావాలని సూచించేవాడు. అసలు నిజం బయటపడిందిలా అయితే మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరాలతో వీడియోలు తీస్తున్నట్లు అనుమానం రావడంతో డొమినిక్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక విచారణలో అత్యాచార వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికీ డొమినిక్ తో సహా 52 మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మందిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇన్నాళ్లుగా తనపై జరుగుతున్న దారుణాన్ని గురించి తెలుసుకున్న ఆ మహిళ షాకయ్యింది. తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. చదవండి: టైటాన్ జలాంతర్గామి విషాదం.. భర్తతో, కుమారుడితో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుని.. -
తిరుమల ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్లో క్వాలిటీ సమస్యా? అసలు ఏమైంది?
సాక్షి, ముంబై: గూగుల్ పిక్సెల్ ఫోన్లతో స్మార్ట్ఫోన్ మార్కెట్లో హవా చాటుకున్న గూగుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది అక్టోబరులో లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 7 సిరీస్లో వీడియో కాల్ నాణ్యత బాగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. అద్భుతమైన ఇమేజింగ్ నాణ్యత, పిక్చర్ క్యాప్చరింగ్ ఫోన్లగా చెప్పుకుంటున్న ఈ ఫోన్లలో రియర్, సెల్పీ కెమెరాల వీడియో క్వాలిటీ పూర్, మసక మసకగా ఉంటోందని యూజర్లు ఫిర్యాదు చేశారు. (ఫోటో క్రెడిట్: ఆండ్రాయిడ్ పోలీస్) Google Meetతో సహా పలు యాప్లలో వీడియో క్వాలిటీ అసలు బాలేదనీ, ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వీడియో నాణ్యత చాలా తక్కువగా ఉన్నాయని రెడిట్ యూజర్ ఒకరు ఫిర్యాదు చేశారు. అంతేకాదు Pixel 7 నుండి రిసీవ్ చేసుకున్న వీడియోలు కూడా అస్పష్టంగా,మసక బారినట్లుగా ఉన్నాయని ఆరోపించారు. పలువురు ట్విటర్ వినియోగదారులు కూడా దాదాపు ఇదే ఆరోపణ చేశారు. పిక్సెల్ 7 ప్రోతో Google Meetలో వీడియో కాల్ చేస్తున్నప్పుడు నాసెల్పీ కెమెరా అసలు క్లియర్గా లేదు..దీనికేదైనా పరిష్కారం ఉందా అని అని ఒకరు గత నెలలో ట్వీట్ చేశారు. (ఫోటో క్రెడిట్: ఆండ్రాయిడ్ పోలీస్) గూగుల్ సొంత యాప్తోపాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాం యాప్స్లో వీడియో కాల్స్ అస్పష్టంగా ఉన్నాయని పిక్సెల్ 7 ప్రో యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దీనిపై డజన్ల కొద్దీ ఇతర Android వినియోగదారులు వ్యాఖ్యానించినట్టు ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. గతంలో పిక్సెల్ 6లో ఇలాంటి సమస్యే వచ్చిందని నివేదించింది. సాఫ్ట్వేర్ సమస్య కావచ్చని సాఫ్ట్వేర్ అప్డేట్ద్వారా గూగుల్ దీన్ని పరిష్కరించాలని యూజర్లుకోరుతున్నారు. కాగా గతంలో కూడా గూగుల్ పిక్సెల్ 7 యూజర్లు రియర్ కెమెరా గ్లాస్ పగిలిన ఫిర్యాదుల నేపథ్యంలో రీప్లేస్ చేసింది. మరి తాజా ఫిర్యాదులపై ఎలా స్పందిస్తుందో చూడాలి. గూగుల్ పిక్సెల్ 7 ధర రూ. 52,950, గూగుల్ పిక్సెల్ 7 ప్రొ ధర రూ. 84,999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో అక్టోబర్ 2022లో భారతదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
కుమార్తెతో మద్యం తాగించి లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో
మార్కాపురం: కన్న కుమార్తె పైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో తండ్రి. పైగా బలవంతంగా కుమార్తెతో మద్యం తాగించి.. లైంగిక దాడి వ్యవహారాన్ని తన ప్రియురాలితో వీడియో తీయించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ డాక్టర్ కిషోర్కుమార్ తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. వైఎస్సార్ జిల్లాలో పని చేస్తున్నాడు. భార్య, కుమార్తె ఉన్నారు. ఇతను బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఆ ఉద్యోగి తన 15 ఏళ్ల కుమార్తెను గత నెల 25న తన ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి.. కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆపై కుమార్తెపై లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్ఫోన్తో వీడియో తీయించాడు. ఈ ఘటన గురించి బాధిత బాలిక ఇంటికొచ్చాక తన తల్లితో చెప్పింది. చదవండి: (ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి) అదే రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో పట్టణ శివారులోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ నాగరాజు చెప్పారు. నిందితుడి వద్ద ఉన్న సెల్ ఫోన్, అందులోని వీడియో, ఫొటోలను సీజ్ చేసినట్టు తెలిపారు. -
యువతి స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
చెన్ట్నై,తిరువొత్తియూరు: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా కీళకరై సమీపంలోని కన్నిరాజపురం ప్రాంతానికి చెందిన యువతి తన ఇంటిలో స్నానం చేస్తోంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఎబేసన్ (23) అతని స్నేహితులు ఎబిరోన్, విఘ్నేష్ చాటుగా సెల్ఫోన్లో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను వాట్సాప్లో పెట్టారు. దీనిపై యువతి ఈ నెల 2న కీళ్కరై మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఎబేసన్తో సహా ముగ్గురి కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో కన్యాకుమారి జిల్లా తేంగాయ్పట్టినం తీర ప్రాంతంలో దాగి ఉన్న ఎబేసన్ను కీళకరై పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. సముద్రతీర పోలీసుల సాయంతో ఎబేసన్ను అరెస్టు చేశారు. అతన్ని కీళకరై పోలీసుస్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement