breaking news
veternaty department
-
చొక్కాలు చింపుకున్న డాక్టర్లు
సాక్షి, గద్వాల: ఆ ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లేగాక జిల్లాస్థాయి అధికారులు.. ఇవన్నీ మర్చిపోయి వీధిలో ఆకతాయిల మాదిరి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గద్వాల పశుసంవర్ధక శాఖలో డీవీఏహెచ్ఓగా డాక్టర్ కేశవసాయి, ఏడీగా డాక్టర్ రమేష్ విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో హరితహారం నిర్వహించగా కలెక్టర్ శృతిఓఝా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మొక్కలను నాటి వెళ్లిన అనంతరం ఈ ఇద్దరు అధికారుల మధ్య వివాదం రేగింది. ఎలాంటి సమచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ డీవీఏహెచ్ఓ చాంబర్లోకి ఏడీ డాక్టర్ రమేష్ వెళ్లి డాక్టర్ కేశవసాయిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు దూషించు కుని బాహాబాహీకి దిగారు. దీంతో రమేష్ తలకు గా యాలు కాగా అక్కడే ఉన్న సిబ్బంది విడిపించారు. డాక్టర్ రమేష్ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదనపు కలెక్టర్ వద్దకు పంచాయితీ కాగా ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఇద్దరు అధికారులను కలెక్టరేట్కు పిలిపించుకున్నారు. ఎందుకు ఘర్షణ పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యతాయుతంగా మెలగాల్సిన మీరు ఇలా కొట్టుకోవడం ఏమిటి..’ అని మందలించారు. అనంతరం సంఘటన జరిగిన పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఆర్డీఓ రాములు వెళ్లి విచారణ జరిపారు. ముందుగా దాడికి దిగారు.. ముందుగా నా చాంబర్కు ఏడీ డాక్టర్ రమేష్ వచ్చి దూషిస్తూ అకారణంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో టేబుల్పై ఉన్న వస్తువుతో కొట్టాను. – డాక్టర్ కేశవసాయి, డీవీఏహెచ్ఓ సమాచారం ఇవ్వనందుకే.. హరితహారంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే విషయం అడుగుదామని ఆయన చాంబర్కు వెళ్లి అ డిగా. టేబుల్పై ఉన్న వస్తువుతో నా తలపై కొట్టాడు. దీనిపై పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశా. – డాక్టర్ రమేష్, ఏడీ, పశుసంవర్ధకశాఖ -
మీరొచ్చినా...మేమువెళ్లం!
–రెగ్యులర్ సిబ్బంది వచ్చినా తమ స్థానాలకు వెళ్లని డిప్యూటేషన్ సిబ్బంది –వారికి అధికారులు, టీడీపీ నేతల మద్దతు – ఒకే పోస్టులో ఇద్దరు ప్రకారం జేవీఓలు కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత ఒకవైపు తీవ్రంగా వేధిస్తోండగా మరోవైపు ఒకే గ్రామీణ పశువైద్యశాలలో ఒకే హోదా సిబ్బంది ఇద్దరు పనిచేస్తుండటం గమనార్హం. ఆళ్లగడ్డ డివిజన్కు చెందిన ఇద్దరు జూనియన్ వెటర్నరీ ఆఫీసర్లను గతంలో డిప్యూటేషన్పై కర్నూలు మండలంలోని గ్రామీణ పశువైద్యశాలకు జేవీఓలుగా నియమించారు. ఇటీవల వీటికి రెగ్యులర్ జేవీఓలను నియమించారు. డిప్యూటేషన్పై పనిచేస్తున్న వారు తమ రెగ్యులర్ పోస్టులకు వెళ్లాలి. అయితే, వారు ఆ స్థానాలను వదలడం లేదు. పైగా మేము ఇక్కడే పనిచే స్తాం. మీరు మరో చోటుకు వెళ్లండంటూ ఒత్తిడి తెస్తున్నారు. వీరికి ఒకవైపు అధికార తెలుగు దేశం నేతలు, మరోవైపు పశుసంవర్ధకశాఖ అధికారుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలోని రామళ్లకోటలో లైవ్స్టాక్ అసిస్టెంటుగా పనిచేస్తున్న రాజశేఖర్కు ఇటీవల జేవీఓ గా పదోన్నతి కల్పించి కర్నూలులోని బుధవారపేట పశువైద్యశాలకు బదిలీ చేశారు. గూడూరు మండలం పెంచికలపాడులో లైవ్స్టాక్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవిందుకు జేవీఓగా పదోన్నతి ఇచ్చి కర్నూలు మండలం నిడ్జూరు గ్రామీణ పశువైద్యశాలకు బదిలీ చేశారు. గతంలో ఆళ్లగడ్డ మండలం కిష్టిపాడులో జేవీఓగా పనిచేస్తున్న మహేశ్వరమ్మను బుధవారపేట పశువైద్యశాలకు, ఆళ్లగడ్డ మండలం బత్తులేరులో పనిచేస్తున్న పద్మజను నిడ్జూరు కు రాజకీయ సిపారస్సుల మేరకు డిప్యూటేషన్పై నియమించారు. ఆయా ఆసుపత్రులకు పదోన్నతిపై రెగ్యులర్ జేవీఓలను నియమించడంతో డిప్యూటేషన్లపై పనిచేసే వారు తమ స్థానాలకు వెళ్లాలి.అయితే, వారెవరూ వెళ్లడం లేదు. మీరు వేరే పశువైద్యశాలలకు వెళ్లిపోవాలని రెగ్యులర్ జేవీఓలు గోవిందు, రాజశేఖర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికారులు సైతం డిప్యూటేషన్పై పనిచేస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఈ నెల 16 నుంచి ఒక్కో పశువైద్యశాలలో ఇద్దరు పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.