-
వాయుసేనలో శిక్షణాధికారిగా రైతు బిడ్డ
చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు. పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు. ఎన్డీఏతోపాటు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా మొదటి ఆశయం ఇదే చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
పక్కా స్కెచ్ వేసిన ప్రియుడు
నెల్లూరు : వారిద్దరి ఊర్లు వేరు..ఫేస్బుక్లో పరిచయం..అది కాస్తా ప్రేమగా మారింది. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చివరకు ప్రియుడు మొహం చాటేశాడు. దీంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడిపై కేసు నమోదైంది. దీంతో కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని పక్కా స్కెచ్ వేసి ప్రియురాలిని మళ్లీ మోసం చేశాడు. నమ్మించి కేసు కొట్టేయించుకొని ఇంటికొస్తే పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పాడు. చివరకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రియురాలిపై ప్రియుడి కుటుంబ సభ్యలందరూ కలిసి దాడికి దిగారు. ఈ సంఘటన భక్తవత్సలనగర్ లెప్రసీ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. వివరాలు..విజయవాడ భవాననీపురానికి చెందిన కీర్తి డిగ్రీ చదువుతోంది. ఆమెకు సుమారు ఏడాదిన్నర క్రితం నెల్లూరు భక్తవత్సలనగర్కు చెందిన ఎ.వెంకటసాయితో ఫేస్బుక్లో పరిచయం అయింది. కొంతకాలం చాటింగ్ చేసుకొన్నారు. ఇద్దరు అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. పలుమార్లు వెంకటసాయి విజయవాడకు వెళ్లి ప్రియురాలిని కలిసివచ్చాడు. వారి ప్రేమ వ్యవహారం వెంకటసాయి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు అతనిని కీర్తిని కలవ్వనివ్వకుండా అడ్డుకున్నారు. పలుమార్లు కీర్తి అతనికి ఫోను చేసింది. కులాలు వేరుకావడంతో ప్రేమను అంగీకరించడం లేదని ఇక కలవలేనని వెంకటసాయి ఆమెకు చెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన కీర్తి గతేడాది జూన్ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుడి మోసంపై అప్పట్లో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటసాయి ప్రియురాలిని విడిచి ఉండలేనని ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఆమె కోసం విజయవాడకు వచ్చాడు. నీవెంటే ఉంటానని ఆమెను నమ్మించాడు. ఖమ్మం జిల్లా మదిరలోని బంధువుల వద్ద ఉంటూ ఉద్యోగం చేస్తానని, తర్వాత వివాహం చేసుకుందామని చెప్పడంతో కీర్తీ అతనిని పూర్తిగా నమ్మింది. అతని అవసరాల కోసం తన బంగారు వస్తువులను అమ్మి రూ.20 వేలు నగదు కూడా ఇచ్చింది. ఆమెను శారీరకంగా అనుభవించాడు. ఆమెతో ప్రేమగా నటిస్తూ కేసు కొట్టివేయించుకున్నాడు. తాను అనుకున్న పని పూర్తవడంతో రాత్రికి రాత్రే నెల్లూరుకు ఉడాయించాడు. కీర్తి ఫోను చేస్తే మాట్లాడేవాడు కాదు. చివరకు కీర్తి రెండురోజుల క్రితం ఫోనులో గట్టిగా నిలదీసింది. దీంతో నెల్లూరుకు వచ్చి తన కుటుంబసభ్యులను ఒప్పిస్తే వివాహం చేసుకొంటానని వెంకటసాయి చెప్పి ఫోను పెట్టేశాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన కీర్తి తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకుంది. వెంకటసాయి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడే ప్రయత్నం చేయగా వెంకటసాయి అతని తల్లి, అక్క, బావలు కీర్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారు. అడ్డుకున్న వారి కుటుంబసభ్యులపై సైతం దాడి చేశారు. తనను వివాహం చేసుకుంటేనే ఇంటి వద్ద నుంచి బయటకు వెళతానని కీర్తి కూర్చోవడంతో వెంకటసాయి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకొని ఎటో వెళ్లిపోయారు. వెంకటసాయితో వివాహం అయ్యేంతవరకూ ఆందోళన కొనసాగిస్తానని ఇంటి ఎదుట బైఠాయించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement