-
కర్నూలులో లక్ష దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
సాక్షి, నంద్యాల: జిల్లాలో సోమవారం నాటికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మొదలై 100 రోజులు పూర్తయాయి. దాంతోపాటు కర్నూలు వ్యాప్తంగా నేటి వరకు లక్షా ఐదు వేల కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు బాబు, సహాయ కార్యదర్శి మదన్ మోహన్, శ్రీనివాసులు, కర్నూల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు జీ.వి సతీష్, రజాక్, ఇతర ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కట్టడిలో ట్రూనాట్ ల్యాబ్స్, వీర్డీఎల్ ల్యాబ్స్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్ల కృషిని ఈ సందర్బంగా పలువురు కొనియాడారు. అంతేకాకుండా కరోనా కట్టడిలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కర్నూల్ జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ తీసుకున్న నిర్ణయాలను జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల తరుపున రఘు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 56 ట్రూ నాట్ ల్యాబ్లలో, మరో 20 వరకు వీర్ఆర్డీఎల్ ల్యాబ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు నిర్విరామంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల్లో భాగస్వాములై ఉన్నారు.ఇప్పటికి దాదాపు ప్రతి జిల్లాలో కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారిన పడినప్పటికి కోలుకున్న తరువాత తిరిగి విధులకు సిద్ధంగా ఉన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సునీతతో ల్యాబ్ టెక్నీషియన్లు -
కర్నూలు ఆసుపత్రి చరిత్రలో మరో మైలురాయి
సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రి చరిత్రలో, రాయలసీమలోనే తొలిసారిగా ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి, ఉస్మానియా ఆసుపత్రి యురాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమసింహారెడ్డి, నిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి యురాలజీ హెచ్వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య విజయవంతంగా చేశారు. స్వయాన యురాలజిస్ట్ అయిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించడం విశేషం. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు (24)కు రెండు కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ మార్పిడి తప్పనిసరని వైద్యులు చెప్పారు. పెద్దాసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు జీవన్దాన్ ట్రస్ట్ నుంచి ఏడాది క్రితం అనుమతి లభించింది. దీంతో రామాంజనేయులు పేరును రిజిష్టర్ చేయించారు. అతనికి కిడ్నీ ఇవ్వడానికి తల్లి బజారమ్మ ముందుకు వచ్చింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి మొత్తం 35 మందితో కూడిన బృందం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరంతరాయంగా శ్రమించి ఆపరేషన్ను విజయవంతం చేశారు. పెద్దాసుపత్రి చరిత్రలో గొప్ప అధ్యాయం : కలెక్టర్ పెద్దాసుపత్రి చరిత్రలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఒక గొప్ప అధ్యాయమని, ఆసుపత్రి మరో మైలురాయిని చేరుకుందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆపరేషన్లో పాల్గొన్న వైద్యులను, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకుని చాలా గర్వపడ్డానన్నారు. ఇది నిజంగా ఆసుపత్రి చరిత్రలో గొప్ప లక్ష్యసాధనగా పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఒక ఏడాది వరకు అవసరమైన మందులను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. ఒక్క ఆపరేషన్తో ఆపకూడదని, ఇకపై మరిన్ని ఆపరేషన్లు చేయాలని వైద్యులను ప్రోత్సహించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వైద్యసేవలు అందించగలిగే వైద్యులు ఇక్కడ ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, నెఫ్రాలజీ హెచ్వోడీ డాక్టర్ పీఎన్ జిక్కి, యురాలజీ హెచ్వోడీ డాక్టర్ భగవాన్, ప్రొఫెసర్ డాక్టర్ సీతారామయ్య, అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రఘురామ్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. డాక్టర్ సూర్యప్రకాష్కు సన్మానం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడంలో సహకరించిన నిమ్స్ యురాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సూర్యప్రకాష్ను సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం కర్నూలుకే గర్వకారణమని క్లబ్ జిల్లా చైర్మన్ ఎన్.వెంకటరామరాజు అన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్లు ఎస్.నాగేశ్వర్రావు, డాక్టర్ జి.బాలమద్దయ్య, సభ్యులు రమణగౌడ్, బోస్ పాల్గొన్నారు. 30 ఏళ్ల కల నెరవేరింది నేను కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. మా చేరికతోనే ఈ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారింది. 1971లో నా ఆధ్వర్యంలో ఇక్కడ యురాలజీ విభాగం ప్రారంభమైంది. అప్పట్లో రాయలసీమలోనే నేను మొదటి యురాలజిస్టు. అప్పట్లోనే ఒక రోగికి డయాలసిస్ ప్రారంభించాం. 30 ఏళ్ల క్రితమే నేను ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించాలని భావించా. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పిలిపించి ఉస్మానియాలో ఉంచారు. 30 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. నా ఆధ్వర్యంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగడం ఆనందంగా ఉంది. – డాక్టర్ ఎ.విక్రమసింహారెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి రిటైర్డ్ ప్రొఫెసర్ -
తహశీల్దార్తోపాటూ ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అనంతపురం : భూ అక్రమాలపై కలెక్టర్ వీరపాండ్యన్ సీరియస్ అయ్యారు. కూడేరు తహశీల్దార్ వసంత లతతో సహా ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. డబ్బు తీసుకొని ప్రభుత్వ భూములకు ఇష్టారాజ్యంగా కూడేరు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేశారు. విచారణలో నిజాలు నిగ్గు తేలటంతో అక్రమార్కులపై కలెక్టర్ వేటు వేశారు. -
నేడు విధులకు నూతన కలెక్టర్
అనంతపురం అర్బన్ : జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన జి.వీరపాండియన్ సోమవారం విధులకు హాజరుకానున్నారు. ఆదివారం రాత్రి ఆలస్యంగా జిల్లాకు చేరుకున్న ఆయన... కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. జిల్లా కలెక్టర్గా ఉన్న శశిధర్ను గుంటూరు కలెక్టర్గా, విజయవాడ మున్సిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న వీర పాండియన్ను జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ నెల 20న జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుతో పాటు నూతన కలెక్టర్ వీరపాండియన్ పాల్గొన్నారు. అదే రోజు రాత్రి ఆయన తిరిగి విజయవాడ వెళ్లారు. -
24న వీర పాండియన్ బాధ్యతల స్వీకరణ!
అనంతపురం అర్బన్ : జిల్లా నూతన కలెక్టర్గా వీరపాండియన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించవచ్చని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను ప్రభుత్వం జిల్లా కలెక్టర్గా నియమించిన విషయం విదితమే. ఈ నెల 20న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో పాల్గొన్న వీరపాండియన్ అదే రోజు విజయవాడకు తిరిగి వెళ్లారు. శనివారం విజయవాడ కార్పొరేషన్లో రిలీవ్ అవుతారని సమాచారం. జిల్లా కలెక్టర్గా ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయంపై ఇప్పటి వరకు సమాచారం లేదని, అయితే.. 24న విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. కోన శశిధర్ రిలీవ్ కలెక్టర్ కోనశశిధర్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను గుంటూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. శనివారం గుంటూరులో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఆయనకు జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement