breaking news
varalakhsmi vratalu
-
ఏ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకోవాలి..?
సాధారణంగా వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పున్నమి ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్టు 1 శుక్రవారం చేసుకోవాలా? లేక ఆగస్టు 8న వచ్చే శుక్రవారం చేసుకోవాలా... అన్న సందేహం సహజం. చాలామంది పంచాంగ కారులు 8వ తేదీని పున్నమి అయినా ఆ వేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణం, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవేవరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పింది కాబట్టి మంచి సంçపద, మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పున్నమికి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది. ఒకవేళ పున్నమిరోజునే శుక్రవారం వస్తే.. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఈ మేరకు ఈ ఆగస్టు 8నే వరవలక్ష్మీవ్రతం చేసుకోవాలనే సంకేతం కదా! ఒకవేళ ఏ కారణం చేతనైనా 8 వతేదీ ఆటంకం కలుగుతుందేమో అని అనుకొనే వారు ఆగస్టు 1న వచ్చే రెండవ శుక్రవారం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. (చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?) -
వరాల తల్లికి పూజలు
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. -
వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు
బోట్క్లబ్ (కాకినాడ), న్యూస్లైన్ : బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. సుమారు నాలుగు వేల మంది మహిళలు సంప్రదాయబద్ధంగా వ్రతాలు ఆచరించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణం మహిళలతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు చెరుకూరి రాజా ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సతీమణి మహాలక్ష్మి జ్యోతిప్రజ్వలన చేసి సామూహిక వ్రతాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ పూజల్లో పాల్గొన్నమహిళలకు చీర, జాకెట్, రూపు, అమ్మవారి ప్రతిమతో పాటు 36 రకాల పూజా సామగ్రిని అందజేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ జొన్నాడ చిన్నబాబు చెప్పారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిత్య మెరైన్స్ అధినేత ఎన్వీ రాంబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ సీహెచ్ విజయభాస్కరరెడ్డి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెలగల గంగాభవాని, కంపర అప్పారావు, సోమిరెడ్డి వెంకటేశ్వరస్వామి, ఎల్లబోయిన సత్యనారాయణ, ఆలయ అర్చకుడు చెరుకూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.