breaking news
V. hanumantha Rao
-
కేసీఆర్ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం
సిద్దిపేటరూరల్ : రాష్ట్రంలో కేసీఆర్ పాలన ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పట్టినట్టుగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విమర్శించారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు చెక్కుల పంపిణీలో ఏ ఒక్క రైతుకు కూడా సరైన న్యాయం జరగలేదన్నారు. వందల కొద్దీ భూములు కొనుగోలు చేసి.. భవంతుల్లో, పట్టణాల్లో ఉంటున్న భూ యజమాని లక్షల పెట్టుబడి సాయాన్ని పొందడంతో.. కౌలు రైతులు తీరని అన్యాయం జరిగిందన్నారు. రైతుబంధు ధనవంతులకు బంధువుగా మారిందని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా.. ఒక్క రైతు కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విచ్చలవిడిగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతురన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గంప మహేందర్, బొమ్మల యాదగిరి, కలీమోద్దీన్, దాసాంజనేయ, నరేష్, శ్రీను, ఆరిఫ్, అక్బర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యభిచారం
మాజీ ఎంపీ వి.హన్మంతరావు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రాజకీయ వ్యభిచారం రోజురోజుకూ పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధు లుగా ఎన్నికై స్వప్రయోజనాల కోసం మరో పార్టీలో చేరుతూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఆయన ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైద్కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు.