-
అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్పోర్ట్ కౌన్సిల్కు కార్పోరేట్ రంగానికి చెందిన పునీత్ రంజన్, రాజేశ్ సుబ్రమణియమ్లను ఎన్నుకున్నట్లు వైట్హౌస్ బుధవారం ప్రకటించింది. రంజన్ గతంలో డెలాయిట్ కన్సల్టింగ్కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్ గ్లోబల్ సీఈఓ ఎమిరిటస్గా ఉన్నారు. ఫెడ్ఎక్స్కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్కు సలహాలు, సూచనలు చేస్తోంది. -
అమెరికాలో భారత్ భారీగా ఉద్యోగాలు
వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలను భారత్ ఎగరేసుకుంటూ పోతుందంటూ శ్వేతాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు రిపోర్టులు గట్టి సమాధానమిస్తున్నాయి. ఆ దేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా సాగుతున్న క్రమంలో అమెరికాకు భారత్ అందిస్తున్న సహకారాన్ని వెల్లడించాయి. భారత్ కు అమెరికా చేసే ఎగుమతులు వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 2,60,000పైగా ఆ దేశ ఉద్యోగాలకు మన దేశం సహకరిస్తున్నట్టు తాజా రిపోర్టులు వెల్లడించాయి. 2015లో అమెరికా నుంచి 28.3 బిలియన్ డాలర్లు అంటే రూ1,82,351కోట్లకు పైగా పెట్టుబడులు మనదేశంలోకి వచ్చినట్టు తెలిపాయి. అమెరికాలోనూ భారత విదేశీ పెట్టుబడులు 2015 వరకు 9.2 బిలియన్ డాలర్లు(రూ.52,838కోట్లు)గా ఉన్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇవి 2006 నుంచి 2015 వరకు 5000 శాతానికి పైగా పైకి ఎగిసినట్టు తెలిపాయి. ఇండియా మాటర్స్ ఫర్ అమెరికా/ అమెరికా మాటర్స్ ఫర్ ఇండియా పేరుతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ఈ రిపోర్టు విడుదల చేసింది. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈస్ట్-వెస్ట్ సెంటర్ ఈవెంట్ లో ఈ డేటాను వెల్లడించింది. ప్రతి ఒక్క అమెరికా రాష్ట్రం భారత్ కు ఎగుమతులు చేస్తుందని, ఈ ఎగుమతులు వల్ల అమెరికాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,60,000కు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్టు పేర్కొంది. 31 రాష్ట్రాలు భారత్ కు ఎగుమతి చేసే వాటిపైనే ఆధారపడి 1000 ఉద్యోగాలు కల్పిస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా అదనంగా 6 రాష్ట్రాలు 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయని చెప్పింది. భారత్ లో ఎక్కువగా పెట్టుబడులు చేసే దేశాల్లో అమెరికా ఒకటని రిపోర్టు వెల్లడించింది. ప్రొఫిషినల్, సైటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, డిపాజిటరీ ఇన్ స్టిట్యూషన్స్, మానుఫ్రాక్ట్ర్చరింగ్ వంటి వాటిని భారత్ కూడా ఎక్కువగా అమెరికాలో పెట్టుబడులుగా పెడుతున్నట్టు ఆ దేశ వాణిజ్య అధికారి చెప్పారు. అంతేకాక ఇటీవల 100 కొత్త అమెరికన్ విమానాలు కావాలంటూ భారత్ విమానయానాల ఆర్డర్ వల్ల తమ దేశంలో వేలకు పైగా వేలు ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం చెప్పారు. అతిపెద్ద ఆర్డర్స్ లలో ఇదీ ఒకటని అభివర్ణించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అమెరికన్ ఎనర్జీని భారీగా ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో అమెరికన్ నేచురల్ గ్యాస్ కొనుగోలు ఒప్పందం కూడా ఒకటి. దీనిపై సంతకం చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement