UK Prime Minister
-
యూకే రక్షణ మంత్రి జాన్ హీలే రాజీనామా
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రక్షణ మంత్రి జాన్ హీలే గురువారం పదవికి రాజీనామా చేశారు. రక్షణ బడ్జెట్పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరో దారి లేకనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్లో ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత రక్షణ బడ్జెట్తో భద్రతా బలగాల అవసరాలు ఏమాత్రం తీరవని, ఫలితంగా దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని జాన్ హీలే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని స్టార్మర్ గానీ, ఆర్థిక మంత్రి గానీ దేశ భద్రతకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి వద్ద మిలటరీ మిషన్, నాటో ఆర్కిటిక్ సెంట్రీ మిషన్, యూకేతోపాటు నాటోపై ఎక్కువైన రష్యా దూకుడు వంటి వాటి నేపథ్యంలో రక్షణ బడ్జెట్ అవసరాలు పెరిగాయని జాన్ హీలే వివరించారు. -
యూకే ఆరోగ్య మంత్రి రాజీనామా
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్పై మంత్రుల తిరుగుబాటు కొనసాగుతోంది. ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పలువురు ఉప మంత్రులు వైదొలిగారు. తాజాగా, ఆయన కేబినెట్లోని ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్ రాజీనామా చేశారు. స్టార్మర్పై తిరుగుబాటు ప్రకటించిన మొదటి సీనియర్ మంత్రి స్ట్రీటింగ్ కావడం గమనార్హం. ‘ప్రపంచ వేదికపై మీరు ధైర్యాన్ని, రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ పాల్గొనకుండా చేయడంలో మీ పాత్ర కీలకం. కానీ, మనకు ఒక స్పష్టమైన దూరదృష్టి, సరైన దిశానిర్దేశం లేకుండాపోయింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు లేబర్ పార్టీని నడిపించలేరనే విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. అందుకే వైదొలుగుతున్నాను’అని రాజీనామా లేఖలో స్ట్రీటింగ్ పేర్కొన్నారు. ప్రధాని పీఠంపై ఎప్పటినుంచో కన్నేసిన వెస్ స్ట్రీటింగ్.. స్టార్మర్ నాయకత్వాన్ని సవాల్ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. అదేవిధంగా, మాజీ ఉపప్రధాని అంజెలా రేనార్ కూడా ప్రధాని రేసులో ఉంటానని ప్రకటించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై రాజీనామా చేసిన అంజెలా అభియోగాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ప్రధాని పదవి కోసం అవసరమైతే స్ట్రీటింగ్తోనూ పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. వీరిద్దరితోపాటు గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్హమ్ కూడా స్టార్మర్కు గట్టి పోటీదారుగా మారే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఆయన ముందుగా పార్లమెంట్కు ఎన్నికవ్వాల్సి ఉంది. అందుకుగాను ఒక సభ్యుడు రాజీనామా చేస్తే ప్రత్యేకంగా ఎన్నిక జరిపి ఆండీని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. గత వారం స్థానిక ఎన్నికలకు జరిగిన అధికార లేబర్ పార్టీ పేలవమైన ఫలితాలు సాధించినప్పటి నుంచి ప్రధాని స్టార్మర్పై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. అయితే, వైదొలిగేది లేదంటూ గురువారం ఆయన మరోసారి ప్రకటించడం గమనార్హం. లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం..ప్ర«దానమంత్రికి ప్రధాన పోటీ దారుగా నిలవాలనుకునే నేత కామన్స్ సభలోని 403 మందికిగాను కనీసం 81 మంది మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. గతంలో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉండగా, ప్రధానిని గద్దె దించిన సందర్భాలున్నప్పటికీ, లేబర్ పార్టీ అటువంటి పరిస్థితి రావడం చాలా అరుదైన విషయమని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్లో రికార్డు స్థాయిలో 400కు పైగా ఎంపీలను గెల్చుకుని అధికారం చేపట్టిన రెండేళ్లలోనే స్టార్మర్ పదవి కోల్పోవాల్సి వస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రధానీ.. ప్లీజ్ రాజీనామా చేయండి!!
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, 14 ఏళ్ల కన్జర్వేటివ్ల పాలనకు చరమగీతం పాడిన లేబర్ పార్టీ.. ఏడాది తిరగకముందే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ప్రధాని కీర్ స్టార్మర్పై సొంత పార్టీ నేతలే కత్తిగట్టారు. ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని 70 మందికి పైగా ఎంపీలు, సీనియర్ క్యాబినెట్ మంత్రులు డిమాండ్ చేయడం ఇప్పుడు బ్రిటన్లో సంచలనంగా మారింది.ముదురుతున్న సంక్షోభంఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా వేల్స్ పార్లమెంటుపై 1999 నుంచి ఉన్న పట్టును కోల్పోయి, ‘ప్లాయిడ్ సిమ్రూ’కు అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. అటు స్కాట్లాండ్లోనూ పార్టీ ప్రాభవం తగ్గడం, రిఫార్మ్ యూకే, గ్రీన్ పార్టీలు పుంజుకోవడంతో స్టార్మర్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.మంత్రుల ఒత్తిడివిదేశాంగ మంత్రి యెవెట్టే కూపర్, అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ వంటి కీలక నేతలు ఇప్పటికే స్టార్మర్తో చర్చలు జరిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీ జరగాలని వారు సూచించినట్లు సమాచారం.సహాయకుల రాజీనామానలుగురు కీలక మంత్రుల పార్లమెంటరీ సహాయకులు (జో మోరిస్, టామ్ రట్లాండ్, మెలానియా వార్డ్, నౌషాబా ఖాన్) తమ పదవులకు రాజీనామా చేస్తూ.. స్టార్మర్పై ప్రజలకు నమ్మకం పోయిందని బహిరంగంగా విమర్శించారు.గండం గట్టెక్కేనా?లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం.. అధికారికంగా నాయకత్వ మార్పు కోసం ఓటింగ్ జరగాలంటే కనీసం 81 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం 70 మందికి పైగా సభ్యులు వ్యతిరేకిస్తుండటంతో, మరో పది మంది తోడైతే స్టార్మర్ కుర్చీకి ప్రమాదం తప్పదు. 2029 సాధారణ ఎన్నికల నాటికి స్టార్మర్ సారథ్యంలో పార్టీ గెలవడం అసాధ్యమని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు."ప్రధానిపై ప్రజలకు విశ్వాసం సడలిందని స్పష్టమవుతోంది. ఈ మార్పుకు ఆయన నాయకత్వం వహించలేరు" అని వెస్ స్ట్రీటింగ్ పార్లమెంటరీ సహాయకుడు జో మోరిస్ వ్యాఖ్యానించారు.తగ్గని స్టార్మర్.. వారసులెవరు?ఎంత ఒత్తిడి వచ్చినా తాను వెనక్కి తగ్గేది లేదని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. "నాపై సందేహాలు ఉన్నాయని తెలుసు, వాటిని పటాపంచలు చేస్తాను. నేను బాధ్యతల నుంచి పారిపోను" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, ఇంధన సంస్కరణలు, ఐరోపాతో సత్సంబంధాలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన మద్దతుదారులకు హామీ ఇచ్చారు.రేసులో వీరేనా?ఒకవేళ స్టార్మర్ దిగిపోవాల్సి వస్తే.. ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ లేదా మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక స్తబ్దత మధ్య స్టార్మర్ ఈ గండాన్ని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. -
స్టార్మర్కు గట్టి షాక్
లండన్: యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ ఊహించని షాక్కు గురైంది. తాజాగా జరిగిన ప్రాంతీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంగ్లండ్లోని వెయ్యి సీట్లు సహా మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 1,400కుపైగా స్థానాలను కోల్పోయింది. అనూహ్యంగా రిఫార్మ్ యూకే తెరపైకి వచి్చంది. సీనియర్ రాజకీయ నేత నిగెల్ ఫరేజ్ సారథ్యంలోని వలస వ్యతిరేక అజెండా కలిగిన ఈ పార్టీ ఇప్పటి వరకు 1,440 కౌన్సిల్ స్థానాలకు గెలుచుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్పై అసమ్మతి స్వరం మరింతగా పెరిగింది. ఆయన పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రధాని కియర్ స్టార్మర్ పాలనపై అనధికారిక ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన పార్టీని అధికారం దిశగా నడిపించిన స్టార్మర్ ప్రజాదరణ ఆ తర్వాత వేగంగా తగ్గిపోతూ వచి్చంది. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఆయన పదవికి ఇప్పటికిప్పుడు వచి్చన ముప్పేమీ లేదని విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోవడం, ఆర్థిక పురోగతి మందగించడం, సంక్షేమ వ్యయం తగ్గించడం వంటివి లేబర్ పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. లేబర్ పార్టీతోపాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో దెబ్బతింది. అధికార లేబర్ పార్టీకి 50 ఏళ్లుగా కంచుకోటలుగా ఉన్న సుండర్లాండ్, బార్న్స్లే వంటి చోట్ల రిఫార్మ్ పార్టీ జెండా ఎగురవేసింది. కన్జర్వేటివ్లకు మంచిపట్టున్న న్యూకాజిల్–అండర్–లైమ్, సఫోక్, ఎస్సెక్స్ ప్రాంతాలు కూడా ఈ పార్టీ వశమయ్యాయి. ఎసెక్స్ నుంచే అరడజను మంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. కన్జర్వేటివ్ పార్టీకి సంప్రదాయబద్ధంగా పట్టున్న ప్రాంతాల్లో రిఫార్మ్ పార్టీ ఓట్లను చీల్చడం, నేరుగా గెలవడం ద్వారా ప్రభావాన్ని చాటుకుంది. ఇంతేకాదు, మొట్ట మొదటిసారిగా లండన్ పరిధిలో ఉన్న హవెరింగ్నూ రిఫార్మ్ యూకే పార్టీ గెల్చుకుంది. వేల్స్లో 27 ఏళ్ల తర్వాత ఓటమి అధికార లేబర్ పార్టీ వేల్స్లో 27 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయింది. వేల్స్ జాతీయ పార్లమెంట్(సెనెడ్)లో ప్లాయిడ్ కమ్రీ పార్టీ ఘన విజయం సాధించింది. సెనేడ్లోని 96 స్థానాలకు గాను ప్లాయిడ్ కమ్రీ 43 సీట్లను గెల్చుకుంది. అయితే, మెజారిటీకి కొద్దిదూరంలో నిలిచింది. ఇక్కడా రిఫార్మ్ యూకే పార్టీ దూకుడు కొనసాగింది. ఎవరూ ఊహించని రీతిలో సెనేడ్లో ఈ పార్టీ 34 సీట్లు కైవసం చేసుకోగా లేబర్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. లేబర్ ఫస్ట్ మినిస్టర్గా ఉన్న ఎల్యునెడ్ మోర్గాన్ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటిదాకా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 22 మంది సభ్యులుండగా, తాజాగా ఏడుగురు మాత్రమే విజయతీరాలకు చేరారు. ఇంగ్లండ్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే లండన్లో మాత్రం లేబర్ మంచి ఫలితాలనే సాధించుకుంది. ప్రధాని స్టార్మర్ సొంత నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్కు పొరుగునున్న కామ్డెన్లో 16 సీట్లను కోల్పోయినప్పటికీ లేబర్ పార్టీ పట్టునిలుపుకుంది. ఇక్కడ గ్రీన్ పార్టీకి 10 సీట్లు దక్కాయి. ఈ ఫలితాలు స్టార్మర్కు కొంత ఊరట కలిగించాయని చెప్పవచ్చు.పదవి నుంచి వైదొలగను: స్టార్మర్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలంటూ వెలుపలి నుంచి విని్పస్తున్న డిమాండ్లపై ప్రధాని స్టార్మర్ స్పందించారు. ‘ఈ పరిస్థితుల్లో నేను పదవి నుంచి తప్పుకోను. దేశాన్ని అస్థిరతలోకి నెట్టివేయబోను’అని స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనవసరమైన కొన్ని తప్పిదాలు చేసిందని, మొదటి రెండేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయిందని అంగీకరించారు. మంత్రివర్గ సహచరులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎవ్వరూ వ్యతిరేక గళం వినిపించలేదు. గట్టి పోటీదారులుగా భావించే లేబర్ పార్టీ నేతలెవరూ ఆయన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో స్టార్మర్ తర్వాతి స్థానంలో ఉండే అండీ బర్న్ హామ్, ఏంజెలా రేనర్ వంటి వారు సైతం మౌనంగా ఉన్నారు.స్కాట్లాండ్లో ఎస్ఎన్పీకి ఆధిక్యం స్కాట్లాండ్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) వరుసగా ఐదోసారి విజయం సాధించింది. అయితే, పూర్తి మెజారిటీ సాధనలో వెనుకబడిపోయింది. మొత్తం 129 సీట్లకుగాను ఎస్ఎన్పీ 58 స్థానాలను మాత్రమే సాధించింది. ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పెర్త్షైర్ నార్త్ సీటును నిలబెట్టుకున్నారు. అయితే, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆయన ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రిఫార్మ్ పార్టీ కూడా లేబర్ పార్టీతో సమానంగా 17 సీట్లు గెల్చుకోగా, గ్రీన్స్ పార్టీకి 15 సీట్లు దక్కాయి. స్వతంత్ర స్కాట్లాండ్ నినాదానికి మద్దతిచ్చే పార్టీ కావడంతో ఎస్ఎన్పీ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయి. స్కాట్లాండ్ను బ్రిటన్ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చడం ఎస్ఎన్పీ ప్రధాన అజెండా. అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం వల్ల రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కష్టం కానుంది. -
నాటో పాత్రను చులకన చేస్తారా!
లండన్: అఫ్గానిస్తాన్లో యుద్ధం సమయంలో అమెరికా బలగాలు మాత్రమే ముందుండగా నాటో దేశాల బలగాలు దూరంగా ఉండిపో యాయని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందాను. ఆ వ్యాఖ్యలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే దేశ ప్రజలకు తీవ్ర వేదన కలిగించాయి’అని స్టార్మర్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్లో నాటో బలగాలు సాహసోపేతంగా పోరాడాయని, దేశం కోసం త్యాగాలు చేశాయని స్టార్మర్ కొనియాడారు. నాటో బలగాల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ట్రంప్ను ఆయన కోరారు. అవసరమైనప్పుడు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నాటో సిద్ధంగా ఉంటుందన్న తనకు నమ్మకం లేదని ట్రంప్ దావోస్లో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మాకు నాటో అవసరం ఎప్పుడూ రాలేదు, మేం వారిని నిజానికి ఏమీ అడగలేదు. నాటో దేశాల వారు అఫ్గానిస్తాన్కు, ఇతర ప్రాంతాలకు కొన్ని దళాలను పంపించారు. కానీ, వారు ముందు వరుసలో ఉండటానికి బదులు వెనుకనే ఉండిపోయారు’అని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. -
వాణిజ్య యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదు
లండన్: గ్రీన్లాండ్ను సొంతం చేసుకునే క్ర మంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, యూకే ఎప్పటిలా గానే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగు తాయన్న ఆయన..వాణిజ్య యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్లాండ్ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్ని స్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్లను అస్త్రంగా ప్రయో గించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో, యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యతన్నారు. ‘అందుకే, భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్తోపాటు యూరప్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్తో ఫోన్లో మాట్లాడా. ఎందుకంటే, బలమైన కూట ములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఆ విధంగానే కాపాడుకుంటాయి’అని వ్యాఖ్యా నించారు. ట్రంప్తో క్రమం తప్పక మాట్లాడు తూనే ఉంటానన్న స్టార్మర్..విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖా ముఖి చర్చించి పరిష్కరించుకోవడమే పరిణతి చెందిన కూటముల లక్షణమని చెప్పారు. -
తక్షణ బహిష్కరణ.. ఆపై విచారణ!
లండన్: అక్రమ వలసదారులకు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గట్టి హెచ్చరికలు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తక్షణమే బహిష్కరించి, ఆ తర్వాతే ఆన్లైన్లో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ‘డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్’స్కీంలో ఉన్న దేశాల సంఖ్య 8 నుంచి భారత్ సహా 23కు పెంచిన నేపథ్యంలో స్టార్మర్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ‘మా దేశంలోకి మీరు అక్రమంగా వచ్చినట్లయితే నేరానికి పాల్పడినట్లే. ఇందుకుగాను డిటెన్షన్ను, బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వేగంగా మిమ్మల్ని వెనక్కి పంపివేస్తాం’అని సోమవారం ఎక్స్లో స్టార్మర్ పేర్కొన్నారు. ‘ఎంతో కాలంగా విదేశీ నేరగాళ్లు మా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. వారి అప్పీల్స్ వాయిదా పడుతుండటంతో యూకేలో నెలలు, సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుంటున్నారు. దీనికి ముగింపు పలుకుతాం’అని ఆయన పేర్కొన్నారు. తాజాగా పెంచిన జాబితాలోని 23 దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తక్షణమే దేశం నుంచి వెనక్కి పంపించివేస్తారు. వారి అప్పీళ్లపై వీడియో లింక్ ద్వారా విచారణ చేపడతారు. విదేశీ నేరగాళ్లను తొలగించడం, డిటెన్షన్ సెంటర్లపై ఒత్తిడి తగ్గించడం, ప్రజా ధనాన్ని ఆదా చేయడమే తమ లక్ష్యమని యూకే ప్రభుత్వం అంటోంది. 2023లో మొదటగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు అందులోని జాబితాలో ఆల్బేనియా, కొసావో, నైజీరియా, ఎస్టోనియా దేశాలే ఉన్నాయి. విస్తరించిన జాబితాలో భారత్తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, మలేసియా, కెన్యా, ఉగాండా తదితర దేశాలను చేర్చారు. దీనిపై ఆయా దేశాలతో యూకే అధికారులు చర్చలు ప్రారంభించారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైతం ఇప్పటికే విదేశీయులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తుండటం తెల్సిందే.భారతీయులు సహా వందలాది మంది అరెస్ట్దేశవ్యాప్తంగా అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు సహా వందలాదిమందిని యూకే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా బైక్లపై డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జూలై 20–27 తేదీల మధ్యన చేపట్టిన తనిఖీల్లో 1,780 అక్రమంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు, 280 మంది అనుమతులు లేకుండా పనులు చేసే వలసదారులు పట్టుబడ్డారని వెల్లడించారు. హిల్లింగ్డన్లో ఏడుగురు భారతీయులు దొరికారని, వీరిలో ఐదుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్మ్యాప్పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్ను ఎఫ్టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది. యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్వెజ్, లిక్కర్లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్ఫర్డ్కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్లోని హాల్బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్


