breaking news
Ujjwal DISCOMs
-
వ్యవసాయ విద్యుత్కు మీటర్లు
- ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించండి - ఏడాదిలోగా సమర్పించండి: డిస్కంలతో ఈఆర్సీ - లేదంటే 2015–16 లెక్కలతో టారిఫ్ నిర్ణయిస్తామని స్పష్టం సాక్షి, హైదరాబాద్:ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ విద్యుత్ సంస్థ (డిస్కం)లను విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళిక సమర్పించకపోయినా, పథకంలో నిర్దేశించిన విధంగా 2017–18 నాటికి లక్ష్యాలు చేరుకోలేకపోయినా 2015–16 వ్యవ సాయ విద్యుత్ విక్రయాలను ప్రామాణికంగా తీసుకుని విద్యుత్ టారీఫ్ నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ వినియోగం, సరఫరా నష్టాల మదింపు కోసం మీటర్లు ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రణాళిక రూపొం దించి అనుమతి పొందాలని గతేడాది ఉత్తర్వు ల్లో సూచించినా డిస్కంలు శ్రద్ధ చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. గడువులోగా మీటర్లు బిగించే లక్ష్యాన్ని పునర్ నిర్దేశించడం తప్ప కమిషన్కు మరో గత్యం తరం లేదంటూ 2017–18కి సంబంధించి ఇటీవల జారీ చేసిన టారీఫ్ ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. వ్యవసా య విద్యుత్ సరఫరా సమయాన్ని రాత్రిపూట 7 గంటల నుంచి పగటి పూటే 9 గంటలకు పెంచిన డిస్కంలు.. వచ్చే ఫిబ్రవరి నుంచి 24 గంటలు సరఫరా చేసేందుకు సమాయత్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిస్కంలకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీలను పెంచాలని ఈఆర్సీ సూచించింది. వ్యవసాయ విద్యుత్కు లెక్కల్లేవ్.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో ఉచిత విద్యుత్కు సంబంధించి కచ్చితమైన లెక్కలు డిస్కంల వద్ద లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్ లో 25 శాతం వ్యవసాయానికి ఇస్తున్నట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈఆర్సీ ఆమోదించిన ఐఎస్ఐ విధానం ద్వారా ఈ అంచనాలు రూపొందిస్తున్న డిస్కంలు.. ఏటా ఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో వీటినే సమర్పిస్తున్నాయి. డిస్కంలు సమర్పిస్తున్న అంచనాలను పరిగణలోకి తీసుకునే ఈఆర్సీ ఏటా విద్యుత్ టారీఫ్ నిర్ణయిస్తోంది. అయితే సరఫరా నష్టాలనూ వ్యవసాయ విద్యుత్ కింద లెక్కగట్టి నష్టాలు తగ్గించి చూపుతున్నాయని డిస్కంలపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యం లో వాస్తవ లెక్కల కోసం విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాజాగా ఈఆర్సీ ఆదేశించింది. తొలుత నాగర్కర్నూల్లో మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ డివిజన్ లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఈఆర్సీ అనుమతి కోరింది. అనుమతులు లభించిన తర్వాత మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపింది. 6.5 శాతం పెరిగిన వినియోగం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం 6.5 శాతం పెరిగిందని ఈఆర్సీకి డిస్కంలు తెలిపాయి. రెండేళ్లలో కొత్తగా 1,47,284 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడంతో ఈ మేరకు వినియోగం పెరిగిందని అంచనాలు సమర్పించాయి. -
విద్యుత్ చోరీ చేస్తే.. పేరు టాంటాం!
‘నేమ్ అండ్ షేమ్’ ప్రచారోద్యమం నిర్వహించాలని కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి పేర్లను ఎప్పటికప్పుడు ప్రకటించి వారిలో సిగ్గు కలిగించే రీతిలో ప్రచారోద్యమం (నేమ్ అండ్ షేమ్ క్యాంపెయిన్) నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. విద్యుత్ చౌర్యం నియంత్రించేందుకు ఈ ప్రచారం నిర్వహించాలని కోరింది. ‘ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్)’ పథకానికి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య ఈ నెల 4న త్రైపాక్షిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందం మేరకు డిస్కంలు తీసుకోవాల్సిన చర్యల్లో ‘నేమ్ అండ్ షేమ్’ ప్రచారోద్యమాన్ని కేంద్రం చేర్చింది. నిర్దేశిత గడువుతో లక్ష్యాలు డిస్కంల కార్యనిర్వహణ, ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత గడువులతో పలు లక్ష్యాలను విధించింది. ఆ వివరాలు ► వాస్తవ సరఫరా విలువ (ఏసీఎస్), వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) మధ్య వ్యత్యాసాన్ని 2018–19లోగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి. ► ఫీడర్ల విభజనను మార్చి 2018లోగా పూర్తి చేయాలి. దీంతో వ్యవసాయానికి వాస్తవంగా సరఫరా అవుతున్న విద్యుత్ ఎంతో వెల్లడవుతుంది. ► నెలకు 500 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులందరికీ 2018 డిసెంబర్ 31లోగా స్మార్ట్ మీటర్లను బిగించాలి. నెలకు 200 యూనిట్లకు మించి వినియోగించేవారికి 2019 డిసెంబర్ 31లోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వినియోగదారులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ► 2017 జూన్ 30లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, ఫీడర్లకు 100 శాతం మీటర్లు బిగించాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ స్థాయి వరకు విద్యుత్ సరఫరాపై 2018 మార్చి 31లోగా ఆడిట్కు శ్రీకారం చుట్టాలి. ► విద్యుత్ సరఫరా లేని గృహాలకు 2018–19లోగా విద్యుత్ సదుపాయం కల్పించాలి. ► ప్రస్తుత వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లలో కనీసం 10 శాతం పంపుసెట్లను మార్చి 2019లోగా ఇంధన పొదుపు సామర్థ్యమున్న పంపు సెట్లతో మార్చాలి. ► కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా పారదర్శక విధానంలో మాత్రమే విద్యుత్ కొనుగోళ్లు జరపాలి. ► అధికారుల వేధింపులు, విద్యుత్ చౌర్యం, భద్రత సంబంధిత ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేందుకు కేంద్రీకృత కస్టమర్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ► ఏటా వార్షికాదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లను సకాలంలో ఈఆర్సీకి సమర్పించాలి. ► నష్టాల తగ్గింపు, మీటరింగ్, బిల్లింగ్, బిల్లుల వసూళ్ల విషయంలో బాధ్యుడైన ప్రతి అధికారి పనితీరుకు సూచికల (కీ పర్ఫామెన్స్) విధానాలను ప్రవేశపెట్టాలి. నష్టాలు తగ్గించుకోవాల్సిందే త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. డిస్కంలు సాంకేతిక, వాణిజ్య సమ్మిళిత (ఏటీ అండ్ సీ) నష్టాలను ప్రస్తుతమున్న 12.29 శాతం నుంచి 2018–19 నాటికి 9.95 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలతో సరఫరా, పంపిణీ దశల్లో జరిగే విద్యుత్ తరుగుదలను సాంకేతిక నష్టాలుగా, పంపిణీ చేసిన మొత్తం విద్యుత్లో బిల్లుల చెల్లింపులు జరగని విద్యుత్ను వాణిజ్య నష్టాలుగా పరిగణిస్తారు. స్పష్టంగా చెప్పాలంటే చౌర్యానికి గురైన విద్యుత్నే వాణిజ్య నష్టాలుగా పిలుస్తారు. మొత్తంగా ఈ రెండు రకాల నష్టాలను తగ్గించుకోవడానికి సబ్ డివిజన్, డివిజన్, సర్కిల్, జోనల్ స్థాయిల్లో లక్ష్యాలను నిర్దేశించాలని కేంద్ర విద్యుత్ శాఖ డిస్కంలను ఆదేశించింది. నష్టాలు తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గంటలను పెంచాలని సూచించింది.