breaking news
UGC recognized
-
కేజీబీవీల్లో 958 టీచింగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. పోస్టులను భర్తీ చేసి ఈనెల 20వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్దేశించారు. రిజర్వుడ్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మాధ్యమంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగిస్తారు. టీచింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో, ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు, సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, డీఈవోలు విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్ జాబితా వెలువరిస్తారు. విద్యార్హతలు, నెలవారీ వేతనాలు ఇలా ప్రిన్సిపాల్ (స్పెషలాఫీసర్): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.27,755 సీఆర్టీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీతో పాటు ఏపీటెట్ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.21,755 పీఈటీ: 50 శాతం కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్లో అర్హత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వేతనం రూ.21,755 పీజీటీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12,000 పీజీటీ వొకేషనల్: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమో చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీ వొకేషనల్ పోస్టులో రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12000. -
డాక్టర్ వైఎస్సార్ ఎఫ్యూకు 2(ఎఫ్) గుర్తింపు
ఏఎఫ్యూ (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కడపలో గతేడాది ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 2(ఎఫ్) గుర్తింపు లభించింది. ఈ మేరకు యూజీసీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలోని విశ్వవిద్యాలయాల జాబితాలో డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి చోటు దక్కినట్లయింది. దీంతో విశ్వవిద్యాలయం జారీ చేసే సర్టిఫికెట్లకు యూజీసీ గుర్తింపు దక్కనుంది. యూనివర్సిటీలో పరిశోధనలు, ప్రాజెక్టులు నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుంది. వర్సిటీ ఏర్పాటైన ఏడాదికే యూజీసీ నుంచి 2(ఎఫ్) గుర్తింపు లభించడంపై వీసీ ఆచార్య దురైరాజ్ విజయ్కిశోర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి.సురేంద్రనాథ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
కూలుతున్న విద్యావృక్షం
కామారెడ్డి డిగ్రీ కళాశాల ఒకప్పుడు ప్రతిభావంతులకు నిలయం. ఇక్కడ చదివిన ఎందరో దీని కీర్తి ప్రతిష్టలను ఎల్లలు దాటించారు. ఇప్పుడు ఈ కళాశాల పరిస్థితి దయనీయంగా ఉంది. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నా నిర్వహణ భారంగా మారింది. ఎందరికో జీవిత పాఠాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన విద్యావృక్షమది. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులతో అలరారుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు ఆ చదువులమ్మ చెట్టు నీడలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పల్లె నుంచి వచ్చినోళ్లయినా.. పట్నం పిల్లాడికైనా చక్కని విద్యాఫలాలను అందించింది. అలా చదువుకున్నోళ్లలో చాలామంది దేశ, విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో కొలువుదీరారు. ‘నీ డిగ్రీ ఎక్కడ చేశావ్..’ అని ఎవరైన అడిగితే.. ‘కామారెడ్డి డిగ్రీ కాలేజీలో..’ అని గర్వంగా చెప్పుకునేవాళ్లు. అలాంటి యాభయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల ఇప్పుడు దీన స్థితికి చేరుకుంది. చెప్పుకోవడానికి వందల ఎకరాల భూములున్నట్లేగానీ.. తన పేరిట ఒక్క ఎకరమైనా లేని దుస్థితి. దీంతో న్యాక్ గుర్తింపునకు నోచుకోక.. యూజీసీ నిధులూ రాక.. సరైన వసతులూ లేక.. స్వర్ణోత్సవాల వేళలో చావుకళతో నిట్టూరుస్తోంది. ఎందరెందరికో విద్యాబుద్ధులు పంచిపెట్టిన తనను ఆదుకునేవారు లేరా.. అన్నట్లుగా కన్ను ఆర్పకుండా ఎదురు చూస్తోంది. కామారెడ్డి ‘కాలేజీ’ కథ వందల కోట్ల ఆస్తులు ఉన్నా అనాథగా.. తన పేరిట ఎకరం భూమి కూడా లేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితంగా న్యాక్, యూజీసీ గుర్తింపునకు నోచుకోలేని దుస్థితి యూజీసీ నిధుల్లేవ్.. వసతుల కల్పన దేవుడెరుగు స్వర్ణోత్సవ సంబురాల వేళలో చావు కళ కళ్లు తెరవకుంటే భవిత ఉండదంటున్న మేధావులు ఉద్యమిస్తామంటున్న విద్యార్థి సంఘాలు కామారెడ్డి : ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 263 ఎకరాల భూమిని కలిగి ఉన్న ఈ కళాశాల తనపేరున ఒక్క ఎకరమైనా లేకపోవడంతో ప్రభుత్వపరంగా అందాల్సిన నిధులు, ప్రోత్సాహకాలకు దూరమ వుతోంది. అన్నింటికి మించి యూజీసీ, న్యాక్ గుర్తింపునకు నోచుకోలేక పోయింది. ఫలితంగా కళాశాల అభివృద్ధికి రావలసిన కోట్లాది రూపాయలు రాకుండా పోయాయి. స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకోవాల్సిన ఈ విద్యావృక్షం అందరూ ఉన్న అనాథలా తయారైంది. కాలేజీ పుట్టుక.. కామారెడ్డి.. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల కూడలి ఇది. జాతీయ రహదారితో పాటు రైల్వే మార్గం కలిగిన పట్టణమిది. అప్పట్లో ఇక్క డ విద్యావసతులు లేకపోవడంతో పదో తరగతితోనే చదువుకు ఫు ల్స్టాప్ పెట్టేవారు. అప్పట్లో కొంతమంది పెద్దలు మన ఊర్లో.. మన పిల్లల కోసం ఓ కళాశాల స్థాపించాలన్న ఆలోచనతో ముందుకు కదిలారు. వీరికి అప్పటి జిల్లా కలెక్టర్ బీఎన్ రామన్ సహకరించారు. బీఎన్రామన్ అ ధ్యక్షతన కేఆర్ రాజారెడ్డి, కేపీ రాజారెడ్డి, జి.విఠల్రెడ్డి, వి.నారాయణరావు, బాదల్చంద్, నర్సాగౌడ్ తదితరులు సభ్యులుగా ‘కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఏర్పాటైంది. గంజ్లో క్రయవిక్రయాలకు వచ్చే ధాన్యం, బెల్లంపై కొంత సుంకం విధించి, ఆ డబ్బును కళాశాల కోసం వెచ్చించారు. కొందరు రైతులు ఉచితంగా, మరి కొందరు డబ్బులకు ఇచ్చిన భూములు కలిపి.. మొత్తం 263 ఎకరాలను సేకరించారు. ముందుచూపుతో భారీ భవనాన్ని నిర్మించి, 1964 ఆగస్టు 10న ‘కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల’ పేరుతో ఎయిడెడ్ కళాశాలను ప్రారంభించారు. తొలుత బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. 1979లో బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ ఫిషరీష్, బీఎస్సీ డెయిరీ, బీఏ రూరల్ ఇండస్ట్రీ వంటి అరుదైన కోర్సులు ప్రారంభించారు. స్వాధీనం చేసుకోవాలని తరువాతి కాలంలో విద్యార్థులు భరించలేని ఫీజులు, నియామకాల్లో అక్రమాలు.. ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థులు ఉద్యమాలు లేవదీశారు. చివరకు 1987లో కళాశాలను ప్ర భుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కొంతకాలానికి కళాశాల కమిటీ తిరిగి కోర్టుకు వెళ్లడంతో కళాశాల ఆస్తిని విద్యాకమిటీకి ఇవ్వాలని తీర్పును వెలువరించారు. దీంతో మళ్లీ కళాశాల సొసైటీ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ ఉద్యమాలు జరిగాయి. నాలుగేళ్ల క్రితం కళాశాల కమిటీ తమ వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వానికి అప్పగించింది. రికార్డుల్లో మాత్రం కళాశాల కమిటీ పేరే చెల్లుబాటవుతోంది. కరిగిపోతున్న భూములు.. కళాశాల కమిటీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కు పెద్దఎత్తున భూ పంపిణీ చేయడంతో ఇప్పుడు కేవలం 60ఎకరాలే మిగిలినట్లు తెలుస్తోంది. సబ్స్టేషన్లకు 12ఎకరాలు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలకు 6ఎకరాలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీకి 25ఎకరాలు, డెయిరీ కళాశాలకు 62ఎకరాలు, జూనియర్ కాలేజీకి 5ఎకరాలు, కర్షక్ బీఈడీ కాలేజీకి 5ఎకరాలు, సరస్వతీ శిశుమందిర్ కు రెండెకరాలు, ఫారెస్టు నర్సరీకి ఎకరం, టీవీ స్టేషన్ కు ఎకరం, జీవీఎస్ కాలేజీకి 5ఎకరాలు, స్టేడియం నిర్మాణానికి 11ఎకరాలు, పోలీసు స్టేషన్కు 2ఎకరాలు, హాస్టళ్లకు 23ఎకరాలు, పారిశ్రామిక వాడకు 20ఎకరాలు, మైనారిటీ కాలేజీకి రెండెకరాలు, మున్సిపల్ నీటిశుద్ధి, ట్యాంకులకు నాలుగెకరాలు.. తాజాగా పీహెచ్సీ భవనానికి 2ఎకరాలు కేటాయించారు. అలాగే ఆక్రమణలకు కూడా అడ్డులేకుండా పోయింది. యూజీసీ, న్యాక్ గుర్తింపు లేక రాష్ట్రంలోనే పేరొందిన కామారెడ్డి డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ యూజీసీ, న్యాక్ గుర్తింపు లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం కళాశాలను స్వాధీనం చేసుకుని మూడు దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కాలేజీ పేరిట భూమి లేకపోవడంతో న్యాక్, యూజీసీ గుర్తింపు దక్కడం లేదు. దీంతో కళాశాలలో స్పోర్ట్స్, అకడమిక్, లైబ్రరీ, భవనాల నిర్మాణం, లాబోరేటరీలు, ఆడిటోరియం, హాస్టల్ భవనాలు... ఇలా ఎన్నింటికో రావలసిన కోట్లాది రూపాయలు రాకుండా పోయాయి. కాలేజీ ఏర్పడి యాబై ఏళ్లవుతున్న సందర్భంలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. కాని ఇక్కడ కాలేజీని పట్టించుకునేవారు లేక, ఏ గుర్తింపులేని పరిస్థితుల్లో అనాథలా మారింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఎన్నోఏళ్లుగా నిరాదరణకు గురైన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తెలంగాణ రాష్ట్రంలోనైనా తగిన గుర్తింపు లభిస్తుందా.. అన్న ఆశతో ఇక్కడి విద్యాభిమానులు ఎదురు చూస్తున్నారు.