tv actress sreevani
-
సీరియల్ నటి శ్రీవాణి ఇల్లు చూశారా? ఎంత బాగుందో..
బుల్లితెర నటి శ్రీవాణి హోమ్టూర్ వీడియో చేసింది. గతేడాది ఆమె సొంతింటి కల నిజం చేసుకున్న విషయం తెలిసిందే కదా! ఇటీవల ఈ ఇంటికే ఇంటీరియర్ డిజైన్ చేయించి నూతన గృహంలా మార్చేసింది నటి. ఈ సందర్భంగా హోమ్టూర్ అంటూ యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రీవాణి, ఆమె భర్త విక్రమ్ మాట్లాడుతూ.. పల్లెటూరు అంటే ఎంతో ఇష్టమని, ఒక నెల రోజులపాటు ఏదైనా పల్లెలో ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, పల్లెటూరు వాతావరణంపై ఉన్న ఇష్టంతో ఇంటికి ముందు గుడిసె ఆకారం వచ్చేలా డిజైన్ చేయించారు. ఇంటికి ముందు బోలెడన్ని మొక్కలు పెట్టి పచ్చదనాన్ని నింపేశారు. హాల్లో సోఫాలు, దేవుడి విగ్రహాలు ఉంచారు. దేవుడి గదిని సింపుల్గా డిజైన్ చేశారు. అయితే ఈ గదికి తలుపు లేకపోవడం గమనార్హం. విశాలమైన ఓపెన్ కిచెన్ను, డైనింగ్ హాల్ను క్షుణ్ణంగా తిరిగి చూపించారు. ప్రతి గదిలో రిమోట్తో ఆన్, ఆఫ్ చేయగలిగే ఫ్యాన్స్ పెట్టారు. ఇవి గాలినే కాకుండా వెలుతురిని కూడా ఇస్తాయని చూపించారు. బాల్కనీని కూడా పూలకుండీలతో నింపేశారు. బాల్కనీలో ఉన్న పచ్చని మొక్కల మధ్య తమ కుటుంబం అంతా కాలక్షేపం చేస్తామని చెప్పుకొచ్చింది శ్రీవాణి. అనంతరం మాస్టర్ బెడ్రూమ్.. కూతురి బెడ్రూమ్, మరొక ఎక్స్ట్రా బెడ్రూమ్ చూపించారు. ప్రతి గదిలో వీలైనంత సామాను పెట్టుకోవడానికి ఎక్కువ కప్ బోర్డ్స్ చేయించామని తెలిపింది. ఇది చూసిన నెటిజన్లు మీ ఇల్లు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఇటివల కొత్త ఇంట్లోకి ప్రవేశం.. తాజాగా లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి
బుల్లితెరపై లేడీ విలన్గా విలనీజం చూపించిన నటి శ్రీవాణి. ప్రస్తుతం సీరియల్స్, షోలు మానేసి ఇంటికే పరిమితమైన ఆమె సోషల్ మీడియాలో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి దాని ద్వారా తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వ్లాగ్స్ చేసి వీడియోలు షేర్ చేస్తుంది. తన భర్త విక్రమ్ ఆదిత్య, కూతురు నందినిలతో కలిసి ఈ యూట్యూబ్ చానల్ను రన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మారుతి గ్రాండ్ విటారా కొన్న ఆమె కారు ఫొటోలు, వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతేకాదు షో రూంలో కారు కొన్న అనంతరం నుంచి కారుకు పూజ చేయించి.. తన సహానటీనటులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చిన ఫుల్ వీడియోను తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసింది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే రూ. 13 లక్షలపై ఉంటుందని తెలుస్తోంది. కాగా యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీవాణి, ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్లో నటించింది. ‘కలవారి కోడలు’, ‘మనసు మమత’, ‘కాంచన గంగ’, ‘చంద్రముఖి’ లాంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు పొందింది. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. విజయ్ ఆంటోని కోమాలోకి వెళ్లాడా? ఆస్పత్రి బెడ్పై హీరో.. ఫొటో రిలీజ్! View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించింది. ఓ వైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు నెట్టింట అలరిస్తోంది. రీసెంట్గా ఆమె తన సొంత యూట్యూబ్ చానల్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఓ కొత్త ప్లాట్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తన కొత్త ప్లాట్లో జరుగుతున్న వర్క్కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా ఆమె తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకు ఆమె చాలా ఘనంగా నిర్వహించారు. చాలామంది బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బిగ్బాస్ బ్యూటీ హిమజ, ప్రముఖ సీరియల్ నటి సుష్మా, నవీన, అంజలితో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీవాణికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్స్టాగ్రామ్లో శ్రీవాణి గృహప్రవేశం వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sushma Kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) చదవండి: థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు షూటింగ్లో హీరోయిన్కి కారు ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి! -
కొత్త ఫ్లాట్ కొన్న బుల్లితెర నటి శ్రీవాణి
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా ప్రతికూల పాత్రల్లో కనిపిస్తూ విలనిజం పండించిన ఆమె ఆ మధ్య అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే! దీని వల్ల ఆమె గొంతు మూగబోయింది. మంచి చికిత్స తీసుకోవడం వల్ల నెల రోజుల తర్వాత ఆమె తిరిగి ఎప్పటిలా గలగలా మాట్లాడగలిగింది. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా అభిమానులతో పంచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది శ్రీవాణి. గత కొంతకాలంగా సర్ప్రైజ్ అంటూ ఊరిస్తూ వచ్చిన ఆమె అదేంటో బయటపెట్టేసింది. ఓ కొత్త ఫ్లాట్ కొన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని పేర్కొంది. అంతేకాదు, ఎంప్టీ హౌస్ పేరిట యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేసి అందులో ఆ ఇంటినంతా ఓసారి తిప్పి చూపించింది. తూర్పు ఫేసింగ్ ఉన్న ఆ ఫ్లాట్లో ఒక హాల్, ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, పూజగది, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ, యుటిలిటీ ఏరియా ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ చేయించాక ఈ ఇంటికి షిఫ్ట్ అవుతామంది. తమ కొత్తింటిని చూపిస్తూ తెగ మురిసిపోయింది శ్రీవాణి. ఆమె సొంతింటి కల నెరవేరడంతో శుభాకాంక్షలు చెప్తున్నారు శ్రీవాణి ఫ్యాన్స్. చదవండి: యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్ ఏమన్నాడంటే? దీపావళికి థియేటర్స్లో సందడి చేసే సినిమాలివే! -
మూగబోయిన బుల్లితెర నటి గొంతు తిరిగొచ్చేసింది..
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లో నటించింది నటి శ్రీవాణి. గత నెలలో ఆమె అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. కొంచెం గట్టిగా మాట్లాడినా ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని వైద్యులు హెచ్చరించడంతో నెల రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స విజయవంతమైంది. దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది. ఈ సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ ఆమె యూట్యూబ్లో వీడియో వదిలింది. డాక్టర్ సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు మాట్లాడలేదు. కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే మాట్లాడేశా. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది. చదవండి: బెడ్రూమ్లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్ భార్యతో విడాకులు, కూతుర్ని కలవనీయట్లేదు: నటుడు -
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
-
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
వికారాబాద్ : అన్న భార్యపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు బుల్లితెర నటి శ్రీవాణి గైర్హాజరు అయింది. ఈ సందర్భంగా వికారాబాద్ మహిళాa పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల మాట్లాడుతూ విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేశామన్నారు. అయితే ఆమె రాలేదని, విచారణకు శ్రీవాణి సహకరించడం లేదన్నారు. శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అవసరం అయితే అరెస్ట్ తప్పదన్నారు. మరోవైపు పోలీసుల విచారణకు అనూష హాజరు అయ్యింది. కాగా షూటింగ్ ఉన్నందునే విచారణకు హాజరు కాలేకపోయానని శ్రీవాణి తెలిపింది. కాగా రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానికులతో మాట్లాడి ఆరా తీశారు. నటి శ్రీవాణి పలుమార్లు సదరు ఇంటి స్థలాన్ని సందర్శించిందని, వదిన అనూషపై బెదిరింపులకు పాల్పడిందని సీఐకి వివరించారు. దీంతో వారందరి వాంగ్మూలాలను సీఐ నమోదు చేశారు. -
ఇల్లు కూల్చివేతలో నా ప్రమేయం లేదు
టీవీనటి శ్రీవాణి తాండూరు: తనపై తప్పుడు కేసు పెట్టారని, టీవీ నటినైనందునే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని బుల్లి తెర నటి శ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. తన అన్న బాబ్జీ గత నెలలో చనిపోయాడని, నాన్న కోటేశ్వర్రావుకు ఐదుగురు కూతుళ్లమని, తమకు పరిగిలో ఇల్లు, ఒక ఎకరం భూమి ఉందన్నారు. తాము ఆ ఇల్లు కూల్చివేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తన వదిన అనూషను వేధింపులకు గురి చేశానని ఆరోపించడంలో నిజం లేదన్నారు. ఇల్లు కూల్చివేతలో తన ప్రమేయమే లేదని, అది ఏడాది క్రితమే జరిగిందన్నారు. ఇతరులను తీసుకువచ్చి దాడి చేయించాననడం అబద్ధమని, తనపైనే దాడి జరిగిందని చెప్పారు. శ్రీవాణి తండ్రి కోటేశ్వర్రావు మీడియాతో మాట్లాడుతూ పరిగిలో ఐదారు కోట్ల ఆస్తి తన పేరుతో ఉందన్నారు. శ్రీవాణితోపాటు తన కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆస్తిలో ఐదుగురు కూతుళ్లతో పాటు కోడలుకు సమానంగా వాటా ఉంటుందని చెప్పారు. -
నాపై అనవసర ఆరోపణలు: శ్రీవాణి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి గ్రామంలో స్థల వివాదం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటి శ్రీవాణి ఖండించింది. తాను ఎవరిపైనా దాడి చేయలేదని ఆమె స్పష్టం చేసింది. వదిన అనూష తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని శ్రీవాణి వ్యాఖ్యానించింది. తండ్రి ఆస్తిలో తమకు హక్కుందని ఆమె తెలిపింది. పోలీసులు విచారణకు సహకరిస్తానని శ్రీవాణి పేర్కొంది. మరోవైపు శ్రీవాణి వదిన అనూషకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అనూషపై శ్రీవాణి దౌర్జన్యం చేస్తోందని పరిగి సర్పంచ్ సుదర్శన్ అన్నారు. గతంలో కూడా అనూషపై దాడికి యత్నించడమే కాకుండా వేధింపులకు గురి చేసినట్లు దాడికి యత్నించిందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో శ్రీవాణిని ఉందన్నారు. శ్రీవాణి తండ్రి గతంలోనే ఐదెకరాల భూమిని అమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆస్తిని కాజేయాలని చూస్తోందని సుదర్శన్ అన్నారు. కాగా మరోవైపు ఈ కేసుపై సీఐ నిర్మల మాట్లాడుతూ అనూష ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామన్నారు. శ్రీవాణి దౌర్జన్యం చేసినట్లు స్థానికులు చెబుతున్నారన్నారు. గతంలో కూడా అనూషను శ్రీవాణి వేధించారని సీఐ తెలిపారు. చదవండి... (బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం) -
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
-
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం
పరిగి: రీల్ లైఫ్లోనే కాదు...రియల్ లైఫ్లోనూ బుల్లితెర నటి తన విలనిజాన్ని చూపించింది. సోదరుడి ఆస్తిపై కన్నేసిన ఆమె...వదినపై అమానుషంగా ప్రవర్తించింది. అన్నచనిపోవడంతో వదిన ఉంటున్న ఇల్లును జేసీబీతో కూల్చేసింది. ఆస్తి తమకే దక్కుతుందని అనుచరులతో వీరంగం సృష్టించింది. టీవీ సీరియల్ ఎపిసోడ్కు ఏమాత్రం తీసిపోలేదు. చంద్రముఖి సీరియల్ ఫేం శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు. అయితే సోదరుడికి పిల్లలు లేకపోవడంతో తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా వస్తుందంటూ శ్రీవాణి తన సోదరి శ్రీకన్యతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో హల్చల్ చేశారు. వేరే వారిని ఆ స్థలాన్ని విక్రయించేందుకు యత్నించగా అందుకు బాబ్జీ భార్య అనూష అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీవాణి అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా, తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో ఆ ఇంటిని కూల్చివేసింది. దీంతో అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి పోలీసులు శ్రీవాణిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అనూషపై శ్రీవాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై దాడికి యత్నించిందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరు కావాలని శ్రీవాణిని సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అనూషకు స్థానికులు బాసటగా నిలిచారు. అనూష భర్త చనిపోయి బాధలో ఉంటే వేధించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇంటి స్థలం కోసం శ్రీవాణి యత్నించిందని, అయితే ఆ ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. చదవండి....(బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు)