-
44 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితుల్లో దొరికిన మృతదేహం
చనిపోవడానికి ముందు రోజు తిన్న గింజల ఆధారంగానే ఓ వ్యక్తి అవశేషాలు బయటపడ్డాయి. మరణించిన తర్వాత పొట్ట నుంచి మొలకెత్తిన విత్తనం.. అతడి కుటుంబ సభ్యుల 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వివరాలు.. మిర్రర్ కథనం ప్రకారం.. 1974లో గ్రీకు సైప్రోయిట్స్, టర్కిష్ సైప్రోయిట్స్ గ్రూప్స్ మధ్య జరిగిన యుద్ధంలో అహ్మద్ హెర్గూన్ అనే టర్కిష్ వ్యక్తిపై బాంబు దాడి జరిగింది. అతడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వారిద్దరి శవాలు దొరికాయి గానీ అహ్మద్ శవం మాత్రం కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఒకవేళ బాంబు దాడిలో అతడు మరణించలేదేమో.. ఎక్కడైనా సురక్షితంగానే ఉన్నాడేమోనని ఆశతో బతికారు. కానీ 44 ఏళ్ల అనంతరం ఓ చెట్టు వల్ల అతడు బతికి లేడనే నిజం వారికి తెలిసింది. అసలేం జరిగింది... 1974లో బాంబు దాడికి గురైన అనంతరం అహ్మద్ ఓ గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. కానీ తీవ్ర గాయాలపాలవడంతో అతడు మృతి చెందాడు. అయితే చనిపోవడానికి ముందు రోజు అతడు ఫిగ్ ట్రీ గింజలను తిన్నాడు. మరణించిన తర్వాత అతని పొట్టలో మిగిలి పోయిన ఫిగ్ విత్తనం సుమారు 44 ఏళ్ల తర్వాత మొలకెత్తింది. అదే అహ్మద్ జాడను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఓ పరిశోధకుడి కారణంగా.. చెట్లపై పరిశోధనలు చేస్తున్న ఓ ఔత్సాహికుడు అహ్మద్ మృతదేహం పడి ఉన్న గుహలోకి వెళ్లాడు. అయితే అప్పటికీ అక్కడ ఓ మనిషి తాలూకు అవశేషాలు ఉన్నాయని అతడికి తెలియదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఫిగ్ ట్రీ అతడిని ఆకర్షించడంతో ఆ చోటికి చేరుకున్నాడు. ఎందుకంటే అహ్మద్ మృతదేహం పడి ఉన్న పరిసరాల్లో అసలు ఫిగ్ ట్రీలు మొలకెత్తే అవకాశమే లేదు. దీంతో ఆ చెట్టు పుట్టుక గురించి తెలుసుకోవాలని పరిశోధకుడు భావించాడు. అందుకే చెట్టు మొదలును తవ్వుతున్న క్రమంలో మనిషికి సంబంధించిన అవశేషాలు లభించాయి. ఈ విషయం స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో అహ్మద్ జాడ అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కనీసం ఇన్నేళ్ల తర్వాతనైనా తన అహ్మద్ గురించి తమకు నిజం తెలిసిందని అతడి సోదరి వ్యాఖ్యానించింది. ఈ విషయం బయటపడటానికి కారణమైన ఆ పరిశోధకుడికి ధన్యవాదాలు తెలిపింది. -
'అది చెప్పలేను.. గుండె చివుక్కుమంది'
టర్కీ: 'విధుల్లో భాగంగా మధ్యదరా సముద్ర తీరానికి వెళ్లిన నాకు అలలు ఎగిసిపడుతుండగా ఇసుకలో ఓ మూడేళ్ల బాలుడు కదలకుండా పడిఉండి కనిపించాడు. సముద్రంవైపే ముఖం పెట్టి ఉండగా అతడిని అప్పుడప్పుడు అలలు తాకి వెళుతున్నాయి. ఆ బాలుడిలో మాత్రం చలనం లేదు. నేను ఆ బాలుడిని సమీపిస్తున్నాను. మనసులో గట్టిగా ప్రార్థించాను. భగవంతుడా ఆ బాలుడు ప్రాణాలతో ఉండాలని.. కానీ అలా జరగలేదు. అతడు ప్రాణాలతో లేడని అర్థమై గుండె చివుక్కుమంది' 'లోపలే ఏడ్చేశాను. మనసులో ఎంత ఇబ్బందిపడ్డానో నాకే తెలియదు. నా సొంత కొడుకే అన్నంత భావన కలిగింది' అని ఇటీవల సిరియా నుంచి ప్రాణభయంతో మధ్యదరా సముద్రం గుండా వచ్చి ప్రాణాలు కోల్పోయిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ గురించి అతడిని చేతుల్లోకి మొట్టమొదటిసారి తీసుకున్న మెమెట్ క్లిపాక్ అనే పోలీసు చెప్పాడు. తనకు ఆరేళ్ల బాలుడు ఉన్నాడని, అయలాన్ మొదటి చూసినప్పుడు నా స్థానంలో తన తండ్రి ఉంటే ఎంతటి భావోద్వేగానికి లోనవుతాడో అంతగా తాను అయ్యానని ఆ క్షణం మాటల్లో వర్ణించలేనని తెలిపాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement