breaking news
truck burnt
-
ట్రక్కులకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవ దహనం
డిస్పూర్: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. హసావోలో కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(గురువారం) అర్ధరాత్రి హాసావోలోని ఉమ్రాంగ్సోలోని డిస్మావో గ్రామంలో కొంత మంది దుండగులు ఏడు ట్రక్కులను తగులబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు గుర్తించారు. వారి మృత దేహలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు -
రసాయనాల లారీ అగ్నికి ఆహుతి
-
రసాయనాల లారీ అగ్నికి ఆహుతి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటగిరి క్రాస్రోడ్డు దగ్గర రసాయనాల లోడ్తో వెళుతున్న లారీ అగ్నికి ఆహుతైంది. లారీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్టు సమాచారం. హైదారాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా విరామం కోసం డ్రైవర్ లారీని ఆపాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి లారీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలిబూడిదైంది. ఎండ తీవ్రత వల్లే రసాయనాలకు నిప్పంటుకోవచ్చని స్థానికులు అన్నారు. ఈ ప్రమాదంతో రోడ్డువెంట ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.