-
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, పశ్చిమగోదావరి: ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతే ఉంది. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఉంగుటూరు నియోజకవర్గానికి టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు బళ్ళ త్రిమూర్తులు నియోజకవర్గ వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుప్పాల వాసుబాబు ఉంగుటూరు మండలం సీతారాంపురం గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో గడపగడపకు నవరత్నాలు గురించి వివరిస్తు ప్రచారం నిర్వహించారు. నారాయణపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బళ్ళ త్రిమూర్తులు పాటు 80 మంది అనుచరులతో వచ్చి వైసీపీలో చేరారు. పాతూరు గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ర్యాలీలోతో వచ్చిన మండల కన్వీనర్ మరడా వెంకట మంగారావు, కేంద్రపాలక సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, దండు రాము, రావిపాటి సత్యశ్రీనివాస్, సంకు సత్యకుమార్, బళ్ళ త్రిమూర్తులతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
నకిలీ విలేకరుల గుట్టురట్టు
ఆలమూరు : విజిలెన్స్ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నకిలీ విలేకరుల గుట్టురట్టయ్యింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మిగతా ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలమూరు పోలీసు స్టేషన్లో మండపేట సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో ఎస్సై సీహెచ్ సూర్య భాస్కరరావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి నుంచి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలేనికి కిరోసిన్ ట్యాంకర్ బయల్దేరింది. పదహారో నంబర్ జాతీయ రహదారిలోని జొన్నాడ ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చేసరికి ఎనిమిది మంది నకిలీ విలేకరులు రెండు కార్లపై వచ్చి తాము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ కిరోసిన్ ట్యాంకర్ను నిలిపి, రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగానే ఉన్నప్పటికీ వారు ట్యాంకర్ డ్రైవర్ పీఈ సత్యనారాయణను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను ట్యాంకర్ ఓనర్ కె.హరిబాబుకు ఫోన్ చేయగా అతడి మిత్రుడు పత్రికా విలేకరి కోటిపల్లి త్రిమూర్తులును తీసుకురావడంతో వారి బండారం బయటపడింది. వీరు విజిలెన్స్ అధికారులు కాదని, విలేకరులమంటూ తరచూ బెదిరింపులకు దిగుతూ డబ్బులు గుంజుతుంటారని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ నకిలీ విలేకరులు త్రిమూర్తులుపై దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు చెబితే ఎస్సీ, ఎస్టీ కేసును బనాయిస్తామని బెదిరించారు. దీంతో ఆ పత్రికా విలేకరి గాయాలతోనే ఆలమూరు పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై మూడు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. గతంలో కూడా అనేక బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు అక్రమార్జన జరిపారని నిర్ధారించారు. గుర్తింపు కార్డులు స్వాధీనం ఎనిమిది మంది నకిలీ విలేకరులలో కడియం మండలం దుళ్లకు చెందిన గుంటూరి కిరణ్కుమార్, చీకట్ల శివన్నారాయణ (శివ), నేల చక్రవర్తిలను పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి రాజమండ్రికి చెందిన ‘కోస్తా సమయం’ దినపత్రిక గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పులూరి సూర్య ప్రకాశరావు చౌదరి, శెట్టి పోసిబాబు, పిల్లి బాబి, గుత్తుల కుమార్, ఉమ్మిడి చింతాలు అనే మిగతా నకిలీ విలేకరులను ఆరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు మీడియాకు చెందిన వారా? లేక గుర్తింపు కార్డులు కూడా నకిలీవా? అనే విషయం దర్యాప్తులో తేలుతుందని సీఐ రమణ తెలిపారు. అలాగే నిందితులు వినియోగించిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్, టాటా కంపెనీకి చెందిన మాన్యర్ వాహనాల కోసం గాలిస్తున్నామన్నారు. వీరిపై ఐపీసీ 341, 419, 384, 324 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి నకిలీ విలేకరులు, నకిలీ అధికారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండపేట సీఐ పీవీ రమణ కోరారు. అధికారులు తనిఖీకి వచ్చినపుడు ఏమాత్రం తొందరపాటుకు గురికాకుండా వారి ప్రవర్తన, తీరు తెన్నులను అధ్యయనం చేయాలన్నారు. అనుమానం వస్తే సంబంధిత పోలీసు అధికారులకు పిర్యాదు చేయాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement