-
పోస్టుమార్టంలోనూ నిర్లక్ష్యం జరిగిందా ?
నర్సంపేట : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రవు పాఠశాలకు చెందిన విద్యార్థుల అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యో.. ఆత్మహత్యో తేల్చేందుకు కీలకమైన పోస్టుమార్టంను హడావుడిగా నిర్వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నారావుపేట మండలం ఖాదర్పేట శివారులోని గుట్టల్లో డిసెంబర్ 27న లభ్యమైన భూమిక, ప్రియాంక మృతదేహాలకు నర్సంపేటకు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. బాలికల మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉండగా అనుభవజ్ఞులైన వైద్యులతోగాని, ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోగానీ పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా స్థానిక వైద్యులతో మమ అనిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి హడావుడిగా బంధువులకు మృతదేహాలను అప్పగించారు. దీంతో వారం రోజులు కావొస్తున్నా వాస్తవ విషయాలు పోలీసులకు లభించకపోవడంతో శనివారం కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ నాగమోహన్రావుకు సంఘటన స్థలాన్ని చూపించి, నర్సంపేటకు పిలిపించి పోస్టుమార్టం రిపోర్ట్ను పోలీసులు చూపించినట్లు తెలిసింది. సంఘటన వెలుగులోకి వచ్చిన రోజే ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి పోస్టువూర్టం నిర్వహిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉండేది. అలా చేయుకపోవడంతో ప్రస్తుతం బాలికల అనుమానాస్పద మృతి పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆ నలుగురిపై ఆరోపణలు పర్వతగిరి : పోలీసులకు అంతుచిక్కని భూమిక, ప్రియూంక అనుమానాస్పద మృతి కేసులో ప్రధానంగా నలుగురిపైనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి నుంచి ఆటోడ్రైవర్ జేరిపోతుల రాముపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. మూడుచెక్కలపల్లి ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో వంట మనిషి రాజమ్మ కుమారుడు వినోద్పై కూడా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు ప్రియాంక ఇంటికి వచ్చిన సమయంలో ప్రియాంక నాన్న కిషన్ సెల్కు ఫోన్ చేసి మీ గోత్రం ఏమిటని అడిగినట్లు తెలిపారు. గోత్రంతో నీకేం పని అంటూ ప్రశ్నించి ఫోన్ కట్ చేసినట్లు చెబుతున్నారు. కాల్ లిస్ట్లో అతడు ఫోన్ చేసినట్లు తేలింది. కాగా చివరి ఫోన్ రాజమ్మ సెల్ నుంచి రాగా ఆమె కొడుకు వినోద్ మాట్లాడి ఉండవచ్చనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా గతంలో చెడు ప్రవర్తన వల్ల అనిల్ అనే టీచర్ను తొలగించారని, అతడికి రాజమ్మ దగ్గరి మనిషి కావడం వల్లే అతడిపై ఆరోపణలు వస్తున్నాయి. జేరిపోతుల రాము, రాజమ్మ, ఆమె కుమారుడు వినోద్, అనిల్పై బాలికల కుటుంబసభ్యులు ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం భూమిక, ప్రియాంక అనుమానాస్పద మృతిపై నర్సంపేట సీఐ బోనాల కిషన్ వారి కుటుంబసభ్యులను శనివారం కలిశారు. కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక, పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. బాలికల మృతిపై ఐటీడీఏ పీఓ విచారణ నల్లబెల్లి : మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బానోత్ ప్రియూంక, భూమిక అనుమానాస్పద మృతిపై ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ పాఠశాలను శనివారం సందర్శించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులతో సమావేశమయ్యూరు. వర్కర్ రాజమ్మ, గతంలో పనిచేసిన సీఆర్టీల వ్యక్తిత్వం, వ్యవహార శైలి, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ విలేకరులతో మాట్లాడుతూ బాలికల భద్రత కోసం పాఠశాల ప్రహరీ రెండు ఫీట్లు పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా బాలికల మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు పీఓ కు వినతిపత్రం అందజేశారు. అణగారిన వర్గాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పరికి కొర్నేల్, తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక డివిజన్ అధ్యక్షుడు బట్టు సాంబయ్య, జేఏసీ డివిజన్ అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు, బహుజన ఐక్య వేదిక మండల అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య పాల్గొన్నారు. కేఎంసీ ప్రొఫెసర్ విచారణ చెన్నారావుపేట : మండలంలోని ఖాదర్పేట శివారు నల్లగుట్టపై విద్యార్థినుల మృతి విషయమై కాకతీయ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ నాగమోహన్రావు శనివారం విచారణ జరిపారు. ముందు మృతదేహాలు ఉన్న స్థలాన్ని సందర్శించారు. పోలీస్స్టేషన్లో మృతి ఫొటోలు, రికార్డులను పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదికతో విచారణ ముమ్మరం చేస్తామని చెప్పారు. సీఐ బోనాల కిషన్, ఎస్సై పులి వెంకట్గౌడ్, హెచ్సీలు కనకచంద్రం, ప్రభాకర్, నరేష్, వుస్తాన్, దామోదర్, శివ పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి * టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి డిమాండ్ పర్వతగిరి : బాలికలు భూమిక, ప్రియూంక మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ తమ పిల్లలు తప్పిపోయూరని తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పైగా వారిపైనే అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఎర్రబెల్లితో టీడీపీ నాయకులు మాడ్గుల రాజు, జాటోత్ శ్రీనివాస్ ఉన్నా రు. కాగా మృతుల కుటుంబసభ్యులు తమ పిల్లల మృతదేహాలను కుక్క లు పీక్కు తిన్నాయని రోదిస్తూ చెబుతుండగా ఎర్రబెల్లి కన్నీరు పెట్టారు. బాలికల మృతిపై స్పష్టత ఇవ్వాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య పర్వతగిరి : గిరిజన బాలికల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇ వ్వాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య అ న్నారు. మండలంలోని నారా యణపురం శివారు కంబాలకుంట తండాకు చెందిన బాలి కలు భూమిక, ప్రియాంక కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల మృతిపై హాస్టల్ సిబ్బంది, జిల్లా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. 15రోజులు ఇంట్లో జ్వరంతో ఉన్న విద్యార్థులను హాస్టల్లో ఉన్నట్లు హాజరు వేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. కేసు విచారణలో సమగ్ర దర్యాప్తు చేయూలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు రాజ్కుమార్గౌడ్, అప్పం కిషన్, కుమార్గౌడ్, కేదారి గౌడ్, కోల రమేష్, కేదారి యాదవ్, దొంతి కమలాకర్రెడ్డి, అక్కల అనిల్, మదాసి సుధాకర్, మండల నాయకులు సైదులు, వడ్లకొండ వీరభద్రయ్య, జంగ మురళి, వీరమల్లు ఉన్నారు. కలెక్టర్గారూ... కరుణించరూ.. పర్వతగిరి : కూతుళ్లను పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక తల్లిదండ్రులపై ఎవ్వరూ కనికరం చూపించటం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని ఈ కుటుంబంలో పిల్లల మృతి విషాదాన్ని నింపింది. 40 రోజులుగా జీవచ్ఛవాలుగా కాలం వెల్లదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన రాష్ర్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ సాయం కింద అందజేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. బాధిత కుటుంబాలను జిల్లా యంత్రాంగం సంగతి అటుంచితే కనీసం మండల స్థాయి అధికారులు పలకరించిన పాపానపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనులని ప్రభుత్వం, అధికారులు, జిల్లా నాయకులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పిచ్చికుక్కల స్వైరవిహారం.. ముగ్గురిపై దాడి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గురువారం రోడ్డుపై వెళుతున్న ఓ ముగ్గురు విద్యార్థినులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో.. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
తలుపుల్లేని మరుగుదొడ్లు.. నీళ్లు రాని బాత్రూమ్లు
ఎస్ఎస్తాడ్వాయి : గిరిజన ఆశ్రమ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. తాడ్వాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 558 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 26 స్నానాల గదులు, 40 మరుగుదొడ్ల గదులు ఉన్నాయి. ఇందులో 16 మరుగుదొడ్లు వినియోగంలో ఉండగా, 24 మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. విద్యార్థినుల సంఖ్యకు తగిన స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో వారు తెల్లవారుజామునే లేచి మరుగుదొడ్లు, బాత్రూమ్ల ఎదుట గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పాఠశాలలో భవనాల మీద భవనాలు నిర్మిస్తున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు విద్యార్థినులకు కావాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టి సారించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో.. మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనూ మరుగుదొడ్లు, స్నానాల గదుల కొరత ఉంది. 480 మంది విద్యార్థినులు ఉన్న ఈపాఠశాలలో 17 స్నానాల గదులు, 13 మరుగుదొడ్లు ఉన్నాయి. మేడారం జాతర సందర్భంగా నిర్మించిన 10 మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి వినియోగించడానికి వీలులేకుండా ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే కొంతమేరకైనా సమస్య తీరుతుందని విద్యార్థినులు పేర్కొంటున్నారు. ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాడ్వాయి హాస్టల్లోనూ అంతే.. మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహాంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాలలోని 20 మరుగుదొడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ పైపు పగిలిపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లకు వాటర్ కనెక్షన్ పైపులు పాడైపోవడంతో విద్యార్థినులు బకెట్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది. స్నానాలకు గదులు కూడా లేకపోవడంతో విద్యార్థినులు హౌస్ వద్దనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. హాస్టల్ భవనం కుడా శిథిలావస్థకు చేరింది. భవనం స్లాబ్ పెచ్చులూడి చువ్వలు తేలుతున్నాయి. భవనం ఎప్పుడు కూలుతోందనని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని హెచ్డబ్ల్యూఓ వాపోయారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభం నాటికల్లా అదనపు మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్మాణంతోపాటు నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, స్నానాల గదులను వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఐటీడీఏ అధికారులపై ఉంది. పీఓ స్పందించి ఆశ్రమ పాఠశాలల్లోని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. -
సాగు‘బడి’లో విద్యార్థులు
భైంసారూరల్ : బడిలో ఆటలు ఆడుకోవడానికి విశాలంగా ఉన్న మైదానంలో టమాటా సాగు చేస్తూ విద్యార్థులు చదువులో ముందుకు ‘సాగు’తున్నారు. భైంసా పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో విశాలమైన మైదానం ఉంది. పిచ్చిమొక్కలతో నిండుగా కనిపించే మైదానంలో విషసర్పాలు తిరగకుండా చదును చేశారు. పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో టమాటా సాగుచేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థినులే కలుపుమొక్కలు తీస్తూ టమాటా పండిస్తున్నారు. అక్కడే టమాటాలు కోసి రోజు వారీ వసతి గృహ భోజనంలో వంటకు వినియోగిస్తున్నారు. తాము పండించిన టమాటాను వసతిగృహ విద్యార్థులకు అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఏడాదికాలంగా విద్యార్థులు టమాటా సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారే... గిరిజన ఆశ్రమ పాఠశాలలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికం. పంట పొలంలో వేసే టమాటాను పాఠశాలలో సాగు చేస్తూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజు బడిలో పాఠాలు చదువుతూ తీరిక సమయంలో ఇలా సాగు బాటలో శ్రమిస్తున్నారు. స్వచ్ఛభారత్లోనూ ఈ విద్యార్థుల బృందం పాల్గొంటూ పాఠశాల పరిసరాలను శుభ్రం చేసుకుంది. ప్రోత్సహిస్తున్నాం.. విద్యార్థుల్లో టమాటా సాగుపై ఆసక్తిని గమనించాం. అందుకు తగ్గట్లు వారిని ప్రోత్సహిస్తున్నాం. కొంతమంది విద్యార్థులు ఇతర కాయగూరలు సాగుచేద్దామంటున్నారు. ప్రస్తుతమైతే టమాటా సాగు చేశారు. సెలవుదినం ఉంటే అక్కడే ఉంటూ కలుపు మొక్కలు తీస్తూ పంటలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. - అంబారావు, ప్రిన్సిపాల్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement