breaking news
Treasury panchayats
-
అధికారాలకు కత్తెర
పంచాయతీలపై పెన్షన్ కమిటీల పెత్తనం 17 నెలలుగా వేతనాల్లేక సర్పంచ్ల వెతలు గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి శీతాకాల సమావేశాల్లో చర్చించాలంటూ సర్పంచ్ల సంఘం బహిరంగ లేఖ విశాఖపట్నం : పగ్గాలు చేపట్టి పదిహేడు నెలలైంది..నేటికీ రూపాయి వేతనం అందుకోలేదు. పోనీ అభివృద్ధి చేద్దామంటే నిధుల్లేవు..కేంద్రం మంజూరు చేసే నిధులను రాష్ర్టం వివిధ బకాయిల రూపంలో సర్దుబాటు చేస్తూ పంచాయతీల ఖజానాను ఖాళీ చేస్తోంది. మరో పక్క అధికారాలకు కోత పెడుతూ జన్మభూమి పెన్షన్ కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లయింది. ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోక పోగా, సర్పంచ్ల అధికారాలకు కత్తెరేస్తూ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తోంది. దీనిపై పార్టీలకతీతంగా రాష్ర్ట స్థాయిలో పోరుకు వారంతా సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ తీరుపై అధికార పార్టీకి చెందినవారే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ సమస్యలను చర్చించి న్యాయంచేయాలంటూ రాష్ర్ట సర్పంచ్ల సంఘం అధికార, ప్రతిపక్ష పార్టీలకు బహిరంగలేఖ రాశాయి. దానిని ఆదివారం విశాఖపట్నంలో విడుదల చేశాయి. ముఖ్యంగా సర్పంచ్లపై పెత్తనం చెలాయిస్తున్న పెన్షన్ కమిటీ తీరుపై రగిలిపోతున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి,ఇద్దరు డ్వాక్రాసంఘాల మహిళలు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉన్నారు. సామాజిక కార్యకర్తల ముసుగులో నియమితులయ్యే స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకే ఫింఛన్ల కోత, మంజూరుతో పాటు ఇతర పనులన్నీ జరుగుతున్నాయి. గ్రామ పరిపాలనలో పెన్షన్ కమిటీల పెత్తనం వల్ల నిరక్ష్యరాస్యులైన సర్పంచ్లు, రిజర్వేషన్ ప్రాతిపదికన ఎన్నికైన ఎస్సీ,ఎస్టీ, బీసీ సర్పంచ్లపై సామాజిక కార్యకర్తల ముసుగులో అగ్రవర్ణాలపెత్తనం పెరిగి పోయిందని సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది.తక్షణం ఈ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరిగి 17నెలలైనానేటికీ గౌరవ వేతనం ఇవ్వ లేదని..అసలు తమ గౌరవ వేతనం ఎంతో తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. పరోక్షంగా పంచాయతీల్లో అభివృద్ధి పడుతోందని వాపోతున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా మేజర్ పంచాయతీ సర్పంచ్కు రూ.10 వేలు, మైనర్ పంచాయతీ సర్పంచ్కు రూ.8వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషలాఫీసర్ల పాలనలో ఉన్న విద్యుత్ బకాయిలకు తమను బాధ్యులను చేయడం సరికాదు. ఇప్పటి వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వమే చెల్లించి, ఇక నుంచి వచ్చే కరెంటుబిల్లులకు మాత్రమే తమను బాధ్యులను చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల్లో ప్రైవేటు టీచర్స్కు ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం ప్రజలతో నేరుగాఎన్నికైన సర్పంచ్లకు ఎందుకు కల్పించలేదని ఈ సంఘం ప్రశ్నిస్తోంది. తక్షణమే సర్పంచ్లకు ఓటుహక్కు కల్పిస్తూ జీవో జారీచేయాలని డిమాండ్ చేసింది. రాజధాని ప్రాంతంలోఉన్న గ్రామాల హక్కులను హరిస్తూ జారీ చేసినజీవో 201పై కూడా సర్పంచ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ జీవోను వెంటనే రద్దుచేయడంతో పాటు పంచాయతీలకు పూర్తి జవసత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఏకగ్రీవాని’కి నిధులేవి?
ఏడాదైనా విడుదల కాని ప్రోత్సాహకం నిండుకున్న పంచాయతీల ఖజానా సక్రమంగా వసూలు కాని పన్నులు అభివృద్ధి పనులకు ఆటంకం గ్రామాలో పరిస్థితులు అధ్వానం విశాఖ రూరల్, న్యూస్లైన్ : పంచాయతీల ఖజానాలు నిండుకున్నాయి. పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు మంజూరు కావడం లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు విడుదల చేయాల్సిన ప్రోత్సాహక ప్రత్యేక నిధులు ఏడాదైనా విదల్చలేదు. అభివృద్ధి ఊసే లేదు. దీంతో సర్పంచ్లు దిష్టిబొమ్మలుగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. గతేడాది జూలైలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటికి రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలు ముగిశాక గ్రామాలకు నిధులొస్తాయని సర్పంచ్లు భావించారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిధులు రాక.. సక్రమంగా పన్నులు వసూలు కాక పంచాయతీలు కునారిల్లుతున్నాయి. ప్రత్యేక నిధులెక్కడ? ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులిస్తుంది. అవి గ్రామాభివృద్ధికి దోహదపడతాయన్న ఆశతోనే జిల్లాలో 70 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వీటికి ప్రత్యేక ప్రోత్సాహక నిధులివ్వాలి. ఏకగ్రీవమైన వాటిలో నోటిఫైడ్ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రత్యేక గ్రాంట్గా ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఈ దఫాలో కూడా ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు ఇలాగే నిధులొస్తాయని ఆశించినప్పటికీ ఆ ఊసే లేదు. కొత్త ప్రభుత్వం ఇప్పట్లో మంజూరు చేసే అవకాశం కనిపించడం లేదు. ఆదాయం నామమాత్రం : ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు లేవు. కొత్త సర్పంచ్లు కొలువుతీరాక కొద్ది రోజుల క్రితం 13వ ఆర్థిక సంఘం నిధులు 15.78 కోట్లు, ఎస్ఎఫ్సీ రూ.1.3 కోట్లు, ఏజెన్సీకి రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి. ఇవి అభివృద్ధి పనులకు ఏమూలకూ సరిపోవడం లేదు. ఇంకా వృత్తి పన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కనీసం పన్నుల ద్వారా కూడా ఆదాయం సక్రమంగా రావడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లకు కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. దీంతో ఆదాయం లేక గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.