breaking news
t.jeevanreddy
-
వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలి
కొత్త జిల్లాలతో ఉద్యోగులపై పనిభారం ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి ముకరంపుర : ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడిన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు కొనసాగిస్తున్న సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, శ్రమదోపిడీపై స్పందించాల్సిందిగా కోరుతూ మానవlహక్కుల కమిషన్కు లేఖలు రాస్తానన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేసే వీఆర్ఏలు సమ్మెలో ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలంగాణలో తాత్కాలిక ఉద్యోగాలు అనే మాట ఉండదని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పడంతో తాత్కాలిక ఉద్యోగులు రోడ్డునపడ్డారని అన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు మినహా కిందిస్థాయి సిబ్బందిని నియమించకుండా వేగవంతమైన పరిపాలన ఎలా సాధ్యమన్నారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న ఉద్యోగులే 27 జిల్లాల్లో పని చేయాలంటే వారి విపరీతమైన భారం పడుతుందన్నారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో రూ.63వేల కోట్ల అప్పులుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.33 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఆగస్టులోనే రూ.9వేల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. రానున్న ఐదేళ్ల కాలంలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటుతాయన్నారు. సమ్మెలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవ్, జిల్లా కార్యదర్శి గోపు రామకృష్ణ, ఆనంద్కుమార్, రవి, తిరుపతి, సజిత్రెడ్డి, సంకీర్తన, నరేందర్రావు తదితరులున్నారు. వైఎస్సార్సీపీ సంఘీభావం వీఆర్ఏల సమ్మె శిబిరాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్రావు, వినుకొండ రామకృష్ణారెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక పంపత్ తదితరులున్నారు. -
వర్సిటీలపై ఆధిపత్యం కోసమే..
సారంగాపూర్ : విశ్వవిద్యాలయాలపై గుత్తాధిపత్యం చెలాయించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ చాన్స్లర్లను నియమించిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా సారంగాపూర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్చాన్స్లర్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయాలకు చాన్స్లర్గా ఉంటే గవరన్నర్ వైఎస్చాన్స్లర్లను నియమించాల్సి ఉంటుందన్నారు. సంబంధిత నిబంధనలను మార్చుతూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేస్తూ ప్రభుత్వానికి మెుట్టికాయలు వేసిందన్నారు. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి రాజకీయాలకు అతీతంగా ఉంటాయన్న విషయాన్ని ప్రభ్వుత్వం గుర్తించాలన్నారు. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అజమాయిషీ చేయాలని చూస్తే విద్యార్థుల భవిష్యత్తుతో అడుకోవడమేనన్నారు. ఎంసెట్ పేపర్లు లీక్ కావడానికి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఎవరు బాధ్యత తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, అసలైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
'దామాషా పద్ధతిన ఎస్టీలకు రిజర్వేషన్లు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, ఇతర అన్ని రంగాల్లోనూ ఇదే విధానంలో రిజర్వేషన్లు అమలు చేయాలని గురువారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో కోరారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల హామీని 16 నెలల కాలంలో ఎందుకు అమలుచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం వెంటనే ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.