breaking news
Tirupati (25)
-
ఏళ్లు గడిచినా.. మరువలేని మేళ్లు
ప్రజా సంక్షేమమే శ్వాసగా.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా.. బడుగుల సేవే భగవంతుని సేవగా.. చరిత్రలో నిలిచేలా పరిపాలన సాగించి.. ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేసిన దీనజన బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ మహనీయుడు దివికేగి ఏళ్లు గడిచినా.. ప్రజలకు చేసిన మేళ్లు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు నిరుపేద బిడ్డలకు సైతం ఉత్తమ భవితను అందిస్తున్నాయి. ప్రధానంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అత్యున్నతంగా సేవలు అందిస్తూ వైఎస్సార్ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. బుధవారం ఈ మేరకు మహానేత జయంతిని పురస్కరించుకుని నాటి సుపరిపాలనను అన్నివర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి.తిరుపతి సిటీ : ప్రతి పేదవాడి ఇంటిలో డాక్టర్, ఇంజినీర్ ఉండాలనే సదుద్దేశంతో దివంగత మహానేత వైఎస్సార్ అద్భుతంగా పరిపాలన సాగించారు. అందులో భాగంగానే విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టూరు. దీంతో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్లను సకాలంలో అందించి ప్రొత్సహించారు. దీంతో ప్రతి పేద పిల్లలు సైతం ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాలలో రాణిస్తున్నారు. వైఎస్సార్ హయాంలోనే రెండు వర్సిటీలు తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్గా వెలుగొందుతోందంటే అది వైఎస్సార్ చలువే. ఇక్కడ ఆయన రెండు యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఏర్పాటుకు 2004 సెపె్టంబర్ 30వ తేదీన బీజం పడింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతి వెటర్నరీ కళాశాల స్వర్ణోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలకు యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం 2005 జూలై 15న వర్సిటీగా గుర్తింపు ఇచ్చారు. క్రమంలోనే తొలివిడతగా రూ.45కోట్లు కేటాయించారు. మలి విడతలో మరో రూ.100కోట్లు అందించారు. అలాగే వేద విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీని 2006లో స్థాపించారు. ఇందులో వేద విద్యను అభ్యసించిన వేల మంది విద్యార్థులు పండితులుగా, వేద విద్వాంసులుగా, అర్చకులు, అధ్యాపకులుగా పలు పేరొందిన ఆలయాలలో ఉన్నత స్థానంలో రాణిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన వెటర్నరీ వైఎస్సార్ నాటిన మొక్క వెటర్నరీ వర్సిటీ నేడు అంచెలంచెలుగా ఎదిగింది. ప్రసుత్తం వర్సిటీ పరిధిలో తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు, గరివిడిలో వెటర్నరీ కళాశాలు, తిరుపతిలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, ముత్తుకూరులో ఫిషరీ కాలేజీ ఉన్నాయి. వీటిలో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు యానిమల్ హస్బెండరీలో పాలటెక్నిక్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే పేరొందిన పుంగునూరు, ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి పరిశోధనులు సాగుతున్నాయి. పిండమారి్పడి విధానంలో ఈ జాతులను పెంపొందించేందుకు వర్సిటీ కృషి చేస్తోంది. మా అరాధ్య దైవం రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి గతంలో మాది. హోటళ్లలో భార్యాభర్తలం పనిచేస్తుండేవాళ్లం. వైఎస్సార్ హాయాంలో మా అమ్మాయికి ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభించింది. దీంతో నాలుగేళ్లు పూర్తి కాగానే ఆయన చలువతో పేరొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా అమ్మాయి ఆ కంపెనీలో పనిచేస్తున్న ఏడాదిలోపే లండన్లో మంచి జీతంలో ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం మా అమ్మాయి వాళ్ల కుటుంబం లండన్లో సెటిల్ అయ్యారు. మేము ఆర్థికంగా బలపడ్డాం. మాకు వైఎస్సార్ ఆరాధ్యదైవం. ఆయనను ఎన్నటికీ మా కుటుంబం మరువదు. – సుధారాణి, గృహిణి, తిరుపతి మా ఇంటి దేవుడు వైఎస్సార్ హయాంలో మాలాంటి పేదలు సైతం మెడిసిన్ చదువుకునే అవకాశం వచ్చింది. ఆయన తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే నాకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళితే కానీ మా కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి అమెరికాలో పేరొందిన ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేసే స్థాయికి ఎదిగాను అంటే అది వైఎస్సార్ పెట్టిన భిక్షగానే భావిస్తా. ఆయనను మా ఇంటి దేవుడిగానే ఆరాధిస్తున్నాం. మహానేత జయంతిని ఇంటిల్లపాదీ ఘనంగా జరుపకుంటాం. – డాక్టర్ సుధాకర్, అమెరికాలో పనిచేస్తున్న వైద్యుడు -
వేసవి సెలవులు.. పిన్ని ఇంటికి వెళ్లడమే శాపమైంది..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన మైనర్పై బాబాయ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడిని తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో తిరుపతి లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి ఆమె ఇటీవలే వచ్చింది. ఈ క్రమంలో మైనర్కు సంబంధించిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని రామమూర్తి బెదిరింపులకు దిగాడు. అనంతరం, మైనర్ను లొంగదీసుకున్నాడు. అనంతరం, ఇంటికి తిరిగి వచ్చిన మైనర్ ప్రవర్తనలో మార్పులను గుర్తించిన పేరెంట్స్.. అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు.దీంతో, మైనర్ పేరెంట్స్ వెంటనే జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 28వ తేదీన జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం, తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఎఫ్ఐఆర్ను బదిలీ చేశారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ను గుర్తించడంతో ఈనెల 13వ తేదీన క్రైమ్ నెంబర్ 236/2026 పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం, విచారణ చేపట్టినట్టు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
ప్రయాణికులకు అలర్ట్: ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి,తిరుపతి (07257) ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి, చర్లపల్లి (07258) ఈ నెల 9 నుంచి 30 వరకు, కాజీపేట, తిరుపతి (07253) ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి, కాజీపేట (07254) ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.తెనాలి మార్గంలో .. తెనాలి స్టేషన్ యార్డ్లో జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 4న రద్దు చేశారు. అందులో గుంటూరు, రేపల్లె (67249/67250), గుంటూరు, రేపల్లె (67223/67224), తెనాలి,రేపల్లె (67231/67232), తెనాలి,రేపల్లె (67233/67234), విజయవాడ, తెనాలి (67221) రైళ్లు ఉన్నాయి. -
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి హైదరాబాద్: యువ నటుడు నాని నటిస్తున్న సినిమా షూటింగ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. షూటింగ్ స్పాట్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పత్తిలికాయ తిరుపతి (25) కొండాపూర్లోని సిద్దానగర్లో నివసిస్తూ సినిమా షూటింగ్ వాహన క్లీనర్గా, లైట్వున్గా పనిచేస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై యువ హీరో నాని, సురభి థామస్లు జంటగా కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ గత రెండు రోజులుగా సంఘీనగర్లోని సంఘీనగర్ సర్పంచ్, సంఘీ స్పిన్నర్స్ యజమాని అమిత్సంఘీ గెస్ట్హౌస్లో జరుగుతోంది. శనివారం ఉదయం 8.30 గంటలకు షూటింగ్ ప్రారంభం కాగానే బస్సును శుభ్రపరుస్తుండగా తిరుపతి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ఫిట్స్ వచ్చాయనే అనుమానంతో తోటి కార్మికులు అతని చేతిలో తాళాలు ఉంచి హయత్నగర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తిరుపతి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందాడని, షూటింగ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారని వదంతులు పుట్టాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోలీస్స్టేషన్కు తీసుకురావాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు చేరుకున్న మృతుని బంధువులు తిరుపతికి ఇప్పటివరకు ఎలాంటి ఫిట్స్ రాలేదని, ఆరోగ్యంగా ఉన్నాడని.. హఠాత్తుగా ఎలా చనిపోయాడని ప్రశ్నిస్తున్నారు. షూటింగ్కు అనుమతులు లేవు అమిత్సంఘీ గెస్ట్హౌస్లో జరుగుతున్న సినిమా షూటింగ్కు ఎలాంటి అనుమతులు లేవని హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారణాలు తెలుసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


