breaking news
three years governance
-
ప్రగతి పథంలో మూడేళ్లు
-
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నా: సీఎం జగన్
-
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి మూడేళ్లు
-
మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు.. సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏపీ సీఎంగా మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపి న ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవచేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022 -
రాష్ట్రపతిగా మూడేళ్లు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంనాటికి పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్లో వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో 7వేల మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని కోవింద్ కలుసుకున్నట్టు ఆ ట్వీట్లో వెల్లడించింది. ఈ మూడేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంక్షోభ సమయంలో ప్రదర్శించిన మానవత్వం గురించి రాష్ట్రపతి భవన్ వివరించింది. ► కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కి రాష్ట్రపతి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ► కరోనా నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ తొలిసారిగా డిజిటల్ సదస్సులను ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడి కరోనా పరిస్థితులపై చర్చలు జరిపారు. ► రాష్టపతి భవన్లో నిర్వహించే కార్యక్రమాలకు ఆన్లైన్ ద్వారా ఆహ్వానించే ఈ–ఇన్విటేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ► పార్లమెంటు పాస్ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు. 13 ఆర్డినెన్స్లు జారీ చేశారు. 11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. ► రాష్ట్రపతి భవన్లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై నిషేధం విధించి వాటి స్థానంలో గాజు బాటిల్స్ను వినియోగించడం మొదలు పెట్టారు. ► మూడో ఏడాది పదవీకాలంలో రామ్నాథ్ ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు. ► రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న కోవింద్కు ఉప రాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధి విషయంలో మూడేళ్లుగా కోవింద్తో కలిసి పని చేస్తుండడం అద్భుతమైన అనుభూతినిస్తోందన్నారు. -
తడబడి నిలబడిన.. ఈపీఎస్ – ఓపీఎస్!
చెన్నై: పురచ్చితలైవి జయలలిత ఆకస్మిక మరణానంతరం తమిళనాట ఏర్పడిన ఏఐఏడీఎంకే ప్రభుత్వం మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. అంతర్గత కలహాలు, అంతగా ప్రజాదరణ లేని నేతలతో ఎప్పుడు పడిపోతుందో అన్నట్లుగా ఉన్న ఈ.పళని స్వామి(ఈపీఎస్), ఓ.పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ల ప్రభుత్వం స్థిరంగా నిలిచి తలలుపండిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసింది. ఈపీఎస్, ఓపీఎస్..ఈ ఇద్దరు నేతల్లో దిగ్గజ నేత జయలలిత నమ్మిన బంటు ఒకరైతే, జయలలిత రాజకీయ ఉత్థాన పతనాలను దగ్గర్నుంచి చూసిన శశికళను ఒప్పించి, మెప్పించి ఎదిగిన నేత మరొకరు. తొలి వ్యక్తి ఓపీఎస్ రాజకీయాల్లో ఆరితేరిన వాడైనా పళని స్వామి రాజకీయ చతురతకు వెనక్కితగ్గక తప్పలేదు. నిజానికి టీటీవీ దినకరన్ పార్టీలో ఉన్నంత కాలం శశికళ అనుయాయుడిగా మాత్రమే పళనిస్వామి ఉండేవారు. శశికళ జైలుకెళ్లడంతో 2017 ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎడప్పాడి పళనిస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అంతగా అనుభవంలేని ఈపీఎస్కు తిప్పలు తప్పవని అప్పట్లో అంతా భావించారు. ప్రభుత్వం నిలుస్తుందో లేదోనన్న బెంగ మొదట్లో ఆయనలోనూ ఉంది. అదే భయాన్ని తన ఎమ్మెల్యేల మెదళ్లలోకి ఇంకేలా చేయడంలో సఫలీకృతమయ్యారు పళని స్వామి. కలిసికట్టుగా లేకున్నా, ఒకే మాటపై నిలబడకున్నా ప్రభుత్వం పడిపోవడమే కాదు, వారికి భవిష్యత్తు కూడా ఉండదని ఈపీఎస్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు ఆకళింపు చేసుకున్నారు. ఓపీఎస్నూ, ఆయన 10 మంది ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకోవడంతో జయలలిత లేకున్నా ఏఐఏడీఎంకే ప్రభుత్వం తమిళనాట సుస్థిరంగా నిలబడగలిగింది. బీజేపీ పాత్ర ఎంత? తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలను నిలువరించేందుకు ఈపీఎస్–ఓపీఎస్ల కలయిక అనివార్యమని చెప్పి ఇరుపక్షాలనూ ఒప్పించడంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగు మద్దతిస్తానని మాటిచ్చి.. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే– బీజేపీ పొత్తు కుదిరింది. అయితే, ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన డీఎంకే.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేక పోయింది. ఉప ఎన్నికల్లో ఈపీఎస్ ప్రభుత్వం నిలబడటానికి కావాల్సిన 9 సీట్లను ఏఐఏడీఎంకే దక్కించుకోగలిగింది. ఏమాత్రం అనుభవం లేని ఈపీఎస్ సారథ్యంలోని ఏఐఏడీఎంకే విజయాన్ని చూసి విస్తుపోవడం డీఎంకే వంతయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకోవడమే ఈపీఎస్ లక్ష్యం. అందుకే ఆయన ఎన్నికల్లో సీట్ల గెలుపుపైనే దృష్టిపెట్టారు. తన ఎమ్మెల్యేలకు కావాల్సిన కాంట్రాక్టులిచ్చి లక్ష్యం సాధించుకున్నారు. దీనికితోడు తమిళనాడులోని విక్రవాండీ, నాన్గునేరీ ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం ఈపీఎస్కి ఉన్న యాక్సిడెంటల్ సీఎం అన్న పేరును మార్చివేసి, ఆయన భవిష్యత్తును చెప్పకనే చెప్పింది. పన్నీర్ సెల్వంకు ఏం దక్కింది? ఈపీఎస్–ఓపీఎస్ వర్గాల కలయికతో పన్నీర్ సెల్వంకు ఏం మిగిలిందన్న విషయం పక్కనబెడితే ప్రభుత్వం మాత్రం నిలదొక్కుకో గలిగింది. ఓపీఎస్కి డిప్యూటీ సీఎం పదవి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి, పళనిస్వామి మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఫలితంగా ఓపీఎస్కు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేకుండా పోయాయి. దక్కిన డిప్యూటీ సీఎం పదవితోనూ పెద్దగా ఫలితం లేదన్నది వాస్తవం. తమ రెండు వర్గాల కలయికతో ఈపీఎస్కే తప్ప తనకు ఫలితం శూన్యమన్న విషయం ఓపీఎస్కు ఆలస్యంగా అర్థమైంది. దీంతోపాటు పార్టీ విలీనం తరువాత ఓపీఎస్ పక్షం ఎమ్మెల్యేలందరినీ ఏదో రకంగా ఈపీఎస్ తనవైపు తిప్పుకో గలిగారు. కేంద్రంలో ఓపీఎస్ కొడుక్కి సాయం చేస్తానన్న హామీ కూడా నెరవేకుండానే మిగిలిపోయింది. -
కొంచెం మోదం! కొంచెం ఖేదం!!
-
కొంచెం మోదం! కొంచెం ఖేదం!!
► మోదీ మూడేళ్ల పాలనలో మిశ్రమ ఫలితాలు ► మళ్లీ అభివృద్ధి పథంలోకి ఆర్థికవ్యవస్థ ► ఉద్యోగాల కల్పన అంతంత మాత్రమే ► దిగివచ్చిన ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ► బ్యాంకుల్లో పెరిగిన మొండి బకాయిలు ► ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు ► నత్తనడకన నల్లధనం వెలికితీత పనులు ‘అచ్ఛే దిన్’ హామీతో ఎన్నికల్లో గెలిచిన నరేంద్రమోదీ సరిగ్గా మూడేళ్ల కిందట ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోదీ మంచి రోజుల మాటను విశ్వసించిన జనం 2014 ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య మెజారిటీని కట్టబెట్టారు. అనంతరం ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ దేశంలో మోదీ హవా తగ్గలేదని ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఇంకో రెండేళ్ల తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ రెండోసారి గెలవడం నల్లేరు మీద నడకేనని రాజకీయ పండితులంతా జోస్యం చెప్తున్నారు. మరి.. అవినీతిని అంతం చేస్తామని, పరిగెడుతున్న ధరలను అదుపు చేస్తామని, ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మోదీ సర్కారు ఈ మూడేళ్లలో ఎంతవరకూ అమలు చేసింది? మోదీ మూడేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. కొన్ని సానుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక సంస్కరణల అమలు విషయంలో, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి మార్గంలోకి మళ్లించడంలో మోదీ సర్కారు విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు. అయితే.. ఉద్యోగాల కల్పన, నల్లధనం వెలికితీత, బ్యాంకుల్లో మొండి బకాయిల వంటి విషయాల్లో ఇంకా బలమైన ముందడుగు పడలేదనే చెప్పాలి. మోదీ మూడేళ్ల పాలన తీరుతెన్నులపై నిపుణల విశ్లేషణల సారాంశం ఇదీ... ధరలకు ముకుతాడు: మోదీ సర్కారు ఈ మూడేళ్లలో హోల్సేల్, రిటైల్ధరలు రెండిటినీ గణనీయంగా తగ్గించిందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. సరుకుల సరఫరా పెంచడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పంట కోతల తర్వాత పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం, నిత్యవసరాల ఎగుమతులను నియంత్రించడం, రాష్ట్రాల్లో అక్రమ నిల్వలపై చర్యలకు పిలుపునివ్వడం తదితర చర్యలు చేపట్టింది. సరుకుల రవాణాకు ఉపయోగించే చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో తగ్గడం కూడా.. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కలిసివచ్చింది. దీంతో.. బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు సుమారు 10 శాతం ఉన్న రిటైల్ద్రవ్యోల్బణం ప్రస్తుతం అటూ ఇటూగా మూడు శాతానికి తగ్గిపోయింది. ద్రవ్యలోటు నియంత్రణ: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినపుడు ద్రవ్యలోటు జీడీపీలో 5.31గా ఉండగా.. ఇప్పుడు అది 3.2 శాతానికి తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం. దానివల్ల ప్రభుత్వ పెట్రోలియం రాయితీ వ్యయం తగ్గడంతో ఆమేరకు ద్రవ్యలోటు కూడా గణనీయంగా తగ్గింది. సంస్కరణల పరుగులు: అవినీతిని నిర్మూలించడం కోసం, వాణిజ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం, ప్రజల జీవన పరిస్థితులను బాగు చేయడం కోసం మోదీ సర్కారు పలు సాహసోపేత సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంది. ⇒ అందులో భాగంగా అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు దేశాన్ని ఒక కుదుపు కుదిపినప్పటికీ దీర్ఘకాలంలో అది సానుకూల ఫలితాలనిస్తోందని నిపుణులు చెప్తున్నారు. ⇒ డిజిటిల్లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం చేస్తున్న కృషి కూడా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ⇒ దేశంలో ప్రస్తుతమున్న సంక్లిష్ట పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించే లక్ష్యంతో రూపొందించిన వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ను జూలై 1వ తేదీ నుంచి అమలులోకి తేనుంది. ఇందుకోసం ఎన్నో అవరోధాలను సమర్థవంతంగా అధిగమించిన సర్కారు.. దేశ ప్రజలను ఈ కీలక సంస్కరణ కోసం సమాయత్తం చేస్తోంది. ⇒ రైల్వే మౌలిక సదుపాయాలు, రక్షణ, వైద్య పరికరాలు, నిర్మాణ అభివృద్ధి, ప్రసార, బీమా, పెన్షన్, విమానయాన తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)పై పరిమితిని తొలగించడంతో పాటు.. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘మేక్ఇన్ఇండియా’ వంటి పథకాలను మోదీ సర్కారు అమలు చేయడంతో ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్కు పదిలమైన స్థానం లభించింది. వృద్ధి పథంలో ఆర్థికరంగం: మోదీ సర్కారు చేపట్టిన చర్యలతో 201617 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 6000 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు తగ్గిపోయాయి. దీని ఫలితంగా భారత దేశంలో స్టాక్మార్కెట్లు గణనీయంగా లాభపడ్డాయి. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి కూడా బలపడింది. భారతదేశం ఇప్పుడు 7 శాతం వార్షికాభివృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2013లో బ్రెజిల్, ఇండొనేసియా, టర్కీ, దక్షిణాఫ్రికాలతో పాటు ప్రపంచంలో ‘ఫ్రాగైల్ఫైవ్’ (బలహీనమైన పంచ దేశాలు)గా అభివర్ణించిన ఐదు దేశాల్లో ఒకటిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ మూడేళ్లలో తిరిగి అభివృద్ధి పట్టాలెక్కింది. ‘స్మార్ట్’గా.. ‘స్వచ్ఛ’ంగా.. ముందుకు... జన్ధన్యోజన: ప్రజలందరినీ ముఖ్యంగా పేద వర్గాల వారిని కూడా ప్రధాన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించేందుకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఆయా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి జన్ ధన్యోజనను మోదీ సర్కారు అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకూ 28.38 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచారు. అందులో 63,960 కోట్ల మేర నిధులు కూడా ఉన్నాయి. స్మార్ట్సిటీలు: దేశంలో 2019 నాటికి 100 స్మార్ట్సిటీల నిర్మాణం లక్ష్యంగా ప్రకటించన మోదీ సర్కారు 60 నగరాల్లో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందుకు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడులను మంజూరు చేసింది. మరో 20 నగరాల్లో రూ. 1,600 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు పూర్తికావస్తున్నాయి. ఇంకో 40 నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలు పెట్టాల్సి ఉంది. స్వచ్ఛ భారత్: ఈ కార్యక్రమం కింద దేశంలో మొత్తం 4,041 నగరాలు, పట్టణాలను 2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహితం (ఓడీఎఫ్)గా మార్చాలన్నది లక్ష్యం. ఇందులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్రాష్ట్రాలతో పాటు 633 నగరాలు ఓడీఎఫ్గా ప్రకటితమయ్యాయి. రూ. 62,009 కోట్ల వ్యయంతో 32 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు, 1.25 లక్షల పబ్లిక్టాయిలెట్లు నిర్మించారు. ఇంకా 3,400 నగరాల్లో ఈ పథకం అమలు చేయాల్సి ఉంది. అందుబాటు ధరలో ఇల్లు: పట్టణ ప్రాంత పేదలకు 2019 నాటికి రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకూ 18.76 లక్షల ఇళ్లు మంజూరు చేయగా మూడేళ్లలో 3.55 లక్షల ఇళ్లు పూర్తిచేశారు. ఇంకా 1.78 కోట్ల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. మోదీ ప్రధాన వైఫల్యాలివీ... ఉద్యోగాల కల్పనలో విఫలం: మోదీ సర్కారు వైఫల్యాల్లో ప్రధానమైనది ఉద్యోగాల సృష్టి. బీజేపీ అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తుందని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కారు మేక్ఇన్ఇండియా, స్టార్టప్ఇండియా వంటి కార్యక్రమాలను ప్రారంభించింది. షాపులు, రెస్టారెంట్లు, సినిమాలు వంటి వాణిజ్య సంస్థలు 24 గంటల పాటూ తెరిచి ఉంచేలా మోడల్చట్టాన్నీ తెచ్చింది. కానీ దేశంలో తయారీ రంగం అభివృద్ది చెందుతుందని, భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన ఫలితాలు రాలేదు. దేశంలో ‘ఉద్యోగ కల్పన రేటు మందకొడిగా ఉంద’ని 201617 ఆర్థిక సర్వే వెల్లడించింది. 201314లో 4.9 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 201516 నాటికి 5 శాతానికి పెరిగింది. మోదీ సర్కారు మొదటి మూడేళ్లలో ఎనిమిది ప్రధాన రంగాల్లో కొత్తగా సృష్టించిన ఉద్యోగాల సంఖ్య 15.1 లక్షలు. ఇది అంతకుముందు మూడేళ్లలో కల్పించిన ఉద్యోగాల సంఖ్య 24.7 లక్షల కన్నా 39 శాతం తక్కువ. ఈ రంగంలో ఎన్డీఏ సర్కారు మరింత కృషి చేయాల్సిన అవసరముంది. కొలిక్కిరాని నల్లధనం వెలికితీత: విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీస్తామని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కూడా పెద్దగా ముందడుగు పడలేదు. నిజానికి 2014లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. దోపిడీదారులు విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బునంతటినీ వెనక్కు తెస్తే దేశ ప్రజలు ఒక్కొక్కరికి 15, 20 లక్షల రూపాయలు వస్తాయని కూడా మోదీ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ఎం.బి.షా సారథ్యంలో మోదీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ఆ తర్వాత నల్లధనం విషయంలో కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించడానికి 2015లో నల్ల ధనం చట్టం చేసింది. దీనికింద రూ. 4,164 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మళ్లీ 2016లో తెచ్చిన ఆదాయ ప్రకటన పథకం కింద మరో రూ. 55,000 కోట్ల ఆస్తులను వెల్లడించారు. అలాగే.. బినామీ లావాదేవీల చట్టం, రాజకీయ విరాళాల్లో సంస్కరణలు, షెల్కంపెనీలపై దాడులు, నగదు లావాదేవీలపై పరిమితులు వంటి చర్యల వల్ల మున్ముందు నల్లధనం పోగుపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ.. విదేశాల్లో దాచిన నల్లధనం విషయంలో మాత్రం ఏమాత్రం ముందడుగు పడలేదు. నోట్ల రద్దుతో తిప్పలు: కరెన్సీ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కారు అమలు చేసిన నిర్ణయం దేశ ప్రజలను ఒక కుదుపు కుదిపింది. అసంఘటిత రంగాన్ని గట్టిగా దెబ్బతీసింది. తాత్కాలికంగానే అయినా సరఫరా వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. డిమాండ్పడిపోయింది. ఆటోమొబైల్, రియల్ఎస్టేట్, వ్యవసాయ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. దేశంలో దాచిన నల్లధనం వెలికితీస్తామని, అవినీతిని అంతమొందిస్తామని చెప్తూ అమలు చేసిన ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో మోదీ కూడా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కొత్త నోట్లను మార్కెట్లోకి పంపించిన తర్వాత ఆర్నెల్లకు కానీ పరిస్థితి కుదుటపడలేదు. అయితే.. నోట్ల రద్దు నేపథ్యంలో అధిక మొత్తంలో నగదు జమచేసిన 60,000 మంది వ్యక్తులను ఆదాయ పన్నుశాఖ గుర్తించి అందులో చాలా మందికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ఆదాయ పన్ను చెల్లింపులు పెరగడం, ఎక్కువ మంది ఆదాయ పన్ను పరిధిలోకి రావడం, డిజిటల్లావాదేవీల వైపు ప్రజలు పయనించడం వంటి సానుకూల ఫలితాలూ వచ్చాయి. బ్యాంకుల బకాయిల భారం: బడా కార్పొరేట్సంస్థలకు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన అప్పులు భారీగా పేరుకుపోవడం, అప్పుల ఎగవేతలతో నిరర్థక ఆస్తులు పోగుపడటం వంటి పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా కనిపిస్తోంది. దేశంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2014 జూన్నాటికి రూ. 2.34 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. 2016 డిసెంబర్నాటికి రూ. 6.46 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక వీటికి పనర్వ్యవస్థీకరించిన రుణాలు, కొట్టివేసిన బకాయిలు తదితరాలన్నీ కలిపితే రూ. 20 లక్షల కోట్ల వరకూ ఉంటాయని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్కె.సి.చక్రవర్తి లెక్కిస్తున్నారు. ఇక వేల కోట్ల మేర అప్పులు ఎగవేసిన విజయ్మాల్యా సర్కారు బ్రిటన్కు పారిపోవడం మోదీ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఆయనను వెనక్కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఇంకా ఫలించలేదు. ఈ మొండి బకాయిలన్నీ యూపీఏ సర్కారు పుణ్యమేనని ఆరోపిస్తున్న మోదీ సర్కారు.. బ్యాంకులను గట్టెక్కించేందుకు నిరర్థక ఆస్తులను గుర్తించి పరిష్కరించే అధికారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకుకు కట్టబెడుతూ ఆర్డినెన్స్జారీ చేసింది. (మరిన్ని వివరాలకు చదవండి) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) (ఇండియా ఫస్ట్) (మోదీ ప్రజల ప్రధానే..!) (సాక్షి నాలెడ్జ్సెంటర్)