breaking news
thotapalli dam
-
'తోటపల్లి రిజర్వాయర్ ను నిర్మించాలి'
కమలాపురం: కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ను నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు నిరసన దీక్షకు దిగారు. వీరు ఆదివారం అర్ధరాత్రి చిగరుమామిడి మండలంలో నిరసన దీక్షకు దిగారు. దీంతో పోలీసులు వీరిని అర్ధరాత్రే అరెస్ట్ చేసి కమలాపురం పీఎస్కు తరలించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే తోటపల్లి రిజర్వాయర్ను నిర్మించడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లాలో దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నమల్కనూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. -
రాజీవ్ రహదారి దిగ్బంధం
-
రాజీవ్ రహదారి దిగ్బంధం
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్ను ప్రతిపాదిత ప్రాంతంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాజీవ్ రహదారిని దిగ్బంధించింది. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు జాతీయ రహదారిపై బైఠాయించారు. మహిళలు వంటావార్పు నిర్వహిస్తుండగా, నాయకులు కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నేతలు తమ ఆందోళనను కొనసాగించారు. ఓబుల్లాపూర్, టోటపల్లిలోనే రిజర్వాయర్ను యథావిధిగా కొనసాగించాలని, రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కాగా, జాతీయ రహదారిపై ధర్నాతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాలను మళ్లించి రాకపోకలకు అవాంతరం కలగకుండా చర్యలు తీసుకున్నారు.